ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam Gas Leak: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ( LG Polymers industry) నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Vizag Gas Leak Tragedy: కాసేపట్లో విశాఖకు చేరుకోనున్న ఏపీ సీఎం, కేజీహెచ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్, గ్యాస్ లీక్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) విశాఖకు బయలుదేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆయన కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. అంతకు ముందు విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌ (Vizag Gas Leak Tragedy) ఘటనపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Visakhapatnam Gas Leak: ఇదొక దురదృష్టకర సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన (Visakhapatnam Gas Leak) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు కేసీఆర్ తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు.
Vizag Gas Leak: ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers industry) రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) స్పందించారు. ఈ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP Chief Minister YS Jagan Mohan Reddy)ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చి‍నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
#VizagGasLeak: గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఘటనపై ఎంహెచ్‌ఏ, ఎన్‌డిఎంఎ అధికారులతో మాట్లాడిన ప్రధాని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
Hazarath Reddyవిశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పరిస్థితులకు సంబంధించి MHA (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ), NDMA (జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ) అధికారులతో మాట్లాడారు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరి భద్రత మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ (PM Modi Tweet) చేశారు.
Vizag LG Polymers Gas Leak: పెరుగుతున్న మృతుల సంఖ్య, విశాఖకు రానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, అందర్నీ రక్షించుకుంటామని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
Hazarath Reddyవిశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ (Vizag LG Polymers Gas Leak) ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు 8 మంది మృతి చెందారని వార్తలు అందుతున్నాయి. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Telangana: తెలంగాణలో 1100 దాటిన కోవిడ్-19 కేసులు, కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు, హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Team Latestlyహైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా....
AP CM YS Jagan Review: వలస కూలీల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వైఎస్సార్ మత్స్యకార భరోసా లాంచ్
Hazarath Reddyరాష్ట్రంలో కోవిడ్‌-19 (Covid'19 in AP) నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు (Migrant workers) అదే విధంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Coronavirus In Telugu States: ఏపీలో 60, తెలంగాణలో 11 కొత్త కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం షాపులు, తెలంగాణలో జోన్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా (Coronavirus In Telugu States) చాపకొంద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా ఏపీలో 60 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 29వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించగా. ఏపీలో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇక రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం కొనుగోలు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు.
AP CM Video Conference: కలెక్టర్లు,ఎస్పీలతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధానికి (liquor ban in AP) తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికే లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో (Collectors, SP's) మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
Cyclone Amphan: ఏపీకి తుఫాను ముప్పు, వాయుగుండంగా మారుతోన్న అల్పపీడనం, ఎంఫాన్‌‌ తుఫాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా (South Andaman Sea) ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. ఎంఫాన్‌ తుఫాన్ ఓడిస్సా పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
AP COVID-19 Bulletin: కర్నూలులో 516కు చేరిన కరోనా కేసులు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 67 కేసులు నమోదు, రాష్ట్రంలో 1717కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ (AP Coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో (AP COVID-19 Bulletin) పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 589 మంది డిశ్చార్జ్‌ కాగా 1094 మందికి చికిత్స కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 34 మంది మృతి చెందారు.
Alcohol Prices Hiked In AP: మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
Hazarath Reddyరాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం... తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ (Liquor Prices Hiked In AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం (AP Govt) తెలిపింది.
AP Covid-19 Report: రాష్ట్రంలో 1650కి చేరిన కరోనావైరస్ కేసులు, 524 మంది కోలుకుని డిశ్చార్జ్, 33 మంది మృతి, తాజాగా 67 కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు (Andhra pradesh covid 19 pandemic) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra pradesh) కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది (Coronavirus Deaths) మృతి చెందారు.
Lockdown Violation in AP: ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నేటి నుంచి మద్యం దుకాణాలను తెరవడంతో పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ (Tamil Nadu and Telangana) రాష్ట్రాల నుంచి మందుబాబులు పోటెత్తారు. మద్యం కొనుక్కొనేందుకు మద్యం ప్రియుల బారులు తీరారు. కాగా తమిళనాడులో మద్యం అమ్మకాలు జరగకపోవడంతో అక్కడినుంచి మందుబాబులు బార్డర్ దాటుకుని (TN Andhra border) చిత్తూరు జిల్లా పాలసముద్రానికి తరలిచ్చారు. మద్యం కొనుగోలు కోసం దుకాణాల మందు బుద్ధిగా బారులు తీరి మరీ నిలుచున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూకట్టారు.
Amphan Cyclone: ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ (Coronavirus) కోర‌ల్లో చిక్కుకుని పోయిన ఏపీకి (Andhra pradesh) మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండ‌మాన్‌కు దక్షిణదిశగా ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా వాయుగుండంగా మార‌బోతోందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌పడి తీవ్ర‌మైన తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు ఎంఫాన్‌గా (Amphan Cyclone) నామ‌క‌రణం చేశారు.
Telangana Lockdown 3.0: మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోంది, స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి అమల్లోకి ఈ పాస్ విధానం, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం విజ్ఞప్తి
Hazarath Reddyకరోనా- లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి.. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం. రెండు.. రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలు నిర్దిష్ట వేళల్లో తెరిచేందుకు అనుమతివ్వడం.
Andhra Pradesh Lockdown 3.0: ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyదేశ వ్యాప్తంగా మూడవ దశ లాక్‌డౌన్ (Lockdown 3.0) నేటి నుంచి అమల్లోకి రానుంది. మే 17 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ 3.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా మూడవ దశ లాక్‌డౌన్‌ను (Andhra Pradesh Lockdown 3.0) రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. కరోనా (Coronavirus) నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా నేటి నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1583 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య; సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తుండటంతో ఏపీ-టీఎస్ బార్డర్ వద్ద ట్రాఫిక్ జాం
Team Latestlyగత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లా నుంచి 11, కృష్ణా నుంచి 8, అనంతపూర్ జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి.....
IAF Tribute to COVID19 Warriors: కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం
Team Latestlyకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై సహా దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలోని కోవిడ్-19 ఆసుపత్రులపై భారత వాయుసేన పూలవర్షం కురిపించింది. కరోనా పోరాట యోధులందరినీ బయటకు ఆహ్వానించి, హెలికాప్టర్ల ద్వారా వారిపై పూలు చల్లుతూ వందనాలు పలికింది. ఈ అపురూపమైన గౌరవానికి వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది....