ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Coronavirus: కర్నూలులో డేంజర్ బెల్స్, ఒక్కరోజే 26 కరోనా కేసులు, ఏపీలో 647కు చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, రెండు వారాల తరువాత విశాఖజిల్లాలో మరో కరోనా కేసు

Hazarath Reddy

ఏపీలో కరోనా (AP Coronavirus) విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు (Corona Positive cases)సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు (Kurnool) జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీలో 572కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, కర్నూలులో మరణించిన డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

Team Latestly

కర్నూలు జిల్లాలో ఒక్కరోజులోనే కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 6 కేసులు కూడా ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేట్ డాక్టర్ కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. వీరితో పాటు కర్నూలులోని సర్వజన హాస్పిటల్ లో పనిచేసే ఓ మహిళా డాక్టర్ కు కూడా కరోనావైరస్ సోకింది.....

AP CM Got Corona Test: ఏపీ సీఎం వైయస్ జగన్‌కు కరోనా టెస్ట్, నెగెటివ్‌గా నిర్ధారణ, దక్షిణ కొరియా నుండి రాష్ట్రానికి లక్ష పరీక్షా కిట్లు, 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పరీక్షలు (AP CM Got Corona Test) చేయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌ (rapid test kit) ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా (South Korea) నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ప్రత్యేక చార్టర్‌ విమానంలో ఇవాళ తీసుకొచ్చారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది.

Guntur COVID-19: క్వారంటైన్‌కు గుంటూరు డాక్టర్లు, మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్, ఏపీలో 534కు చేరిన కేసుల సంఖ్య

Hazarath Reddy

గుంటూరులో 122 కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు (Guntur Doctors in Quarantine) తరలించారు.ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురి రిపోర్ట్‌ వచ్చింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Advertisement

AP CM Jagan Review on COVID-19: ఏపీ సర్కారు కీలక నిర్ణయం, క్వారంటైన్ పూర్తి చేసుకున్న బాధితులకు రూ.2 వేలు, కడప నుంచి 13మంది డిశ్చార్జ్

Hazarath Reddy

జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా క్వారంటైన్ (Quarantine) పూర్తి చేసుకున్నవారికి రూ.2వేలు ఆర్థికసాయం అందించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇవ్వనుంది. అలాగే రానుపోను చార్జీల కోసం మరో రూ.600 ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

COVID-19 Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, తెలంగాణలో 700కు చేరిన కరోనా కేసులు, ఏపీలో 534కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా (COVID-19 in Telugu States) విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి.

Free Ration Distribution: రెండవ ధపా ఉచిత రేషన్ సరఫరా, టైం స్లాట్‌తో కూడిన కూపన్లు, వలంటీర్ల ద్వారా కార్డుదారులకు కూపన్లు

Hazarath Reddy

లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆడుకోవడానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఇప్పటికే ఉచిత రేషన్ బియ్యాన్ని (Free Ration Distribution) సరఫరా చేయాలనీ, అంతేకాకుండా ప్రతి ఇంటికి 1000 రూపాయలను అందజేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్‌ సరుకులను నేటి నుంచి వాలంటీర్లు అందిస్తున్నారు.

Nimmagadda Letter Row: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వివాదం, ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ, ఫోర్జరీ సంతకాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి, లేఖ తానే రాశానంటూ రమేష్ కుమార్ వివరణ

Hazarath Reddy

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై వివాదం (Nimmagadda Letter Row) కొనసాగుతోంది. తాజాగా ఈ లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP Mp Vijaya Sai Reddy) డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి (Gowtham sawang) రాసిన లేఖ రాశారు. ఈ లేఖలో సంతకం తేడాగా ఉందని నిజనిజాలు తేల్చాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు.

Advertisement

AP English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

Hazarath Reddy

పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

COVID -19 in TS & AP: ఆంధ్ర ప్రదేశ్‌లో 11 హాట్‌స్పాట్ జిల్లాల నుంచి 525 కేసులు, తెలంగాణలో 8 హాట్‌స్పాట్లు, 19 నాన్- హాట్‌స్పాట్‌ల నుంచి 650 కేసులు. జిల్లాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి

Team Latestly

కేంద్ర ప్రభుత్వం మే 03 వరకు లాక్డౌన్ పొడగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకే రెండవ ఫేజ్ లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిస్థితులను బట్టి ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉంటాయని కేంద్రం పేర్కొంది. అయితే ఆ సడలింపులు హాట్‌స్పాట్‌ జిల్లాలకు వర్తించబోవు.....

Hostspots in Telugu States: ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం, 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు..

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రాల వారీగా రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 (Covid 19) వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది.

Monsoon 2020: ఈ ఏడాది వర్షపాతం సాధారణం, జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. మాన్‌సూన్ అంచనాలను ప్రకటించిన భారత వాతావరణ శాఖ

Team Latestly

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలకు రుతుపవనాల రాక సాధారణ తేదీలతో పోలిస్తే 3-7 రోజులు ఆలస్యం అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది......

Advertisement

COVID-19 in AP: గుంటూరులో 118 కరోనా కేసులు, ఏపీలో 502కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, వైరస్‌ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులు (AP Coronavirus) సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రొజు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్‌ కేసులు ( coronavirus-positive-cases) నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

Lockdown 2.0 Guidelines: రెండవ దశ దేశవ్యాప్త లాక్డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు ఆంక్షల సడలింపు, పూర్తి జాబితా కోసం చూడండి

Team Latestly

రెండవ దశకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. మే 03 వరకు రైలు, బస్సు, విమానం సహా అన్ని రకాల ప్రయాణ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అయితే COVID-19 హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు కేంద్రం లాక్డౌన్ నుంచి మినహాయింపును ప్రకటించింది......

Fee Reimbursement in AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ఏపీ సర్కారు గుడ్ న్యూస్, తల్లుల అకౌంట్ ఖాతాల్లోకి పూర్తి ఫీజుల మొత్తం, కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

ఏపీలోని విద్యార్థులకు ఏపీ సర్కారు (AP Govt) శుభవార్తను తెలిపింది.నవరత్న కార్యక్రమాల్లో కీలకమైన ‘జగనన్న విద్యా దీవెన’ (Jaganna vidya deevena) పథకానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద విద్యార్థులకు అయ్యే ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు అకౌంట్లలో (credited to mothers) నేరుగా జమ చేయించాలని నిర్ణయించింది.

Reliance Donation to AP CMRF: కరోనాపై పోరుకు ముఖేష్ అంబానీ చేయూత, ఏపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

కరోనా వైరస్ వ్యాప్తిని(Coronavirus) అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోన్న పోరాటానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 ( COVID-19)నివారణ చర్యలు చేపట్టేందుకు రిలయన్స్ గ్రూపు రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్‌ ద్వారా ఆ మొత్తం జమచేసింది.

Advertisement

AP Doctor Dies of COVID-19: కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం, అంత్యక్రియలపై వివాదం, వీడియో కాల్ ద్వారా కడసారి చూసుకుని కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం (Nellore First Death) నమోదైంది. కరోనా పాజిటివ్‌తో (Coronavirus) తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ (Nellore orthopedic Doctor) చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా ఏపీలో కరోనాతో ఓ డాక్టర్ చనిపోవడం ఇదే మొదటిసారి.

AP Coronavirus: గుంటూరులో కరోనా కల్లోలం, వంద దాటిన కరోనా కేసులు, ఏపీలో 473కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 34 కరోనావైరస్‌ (Coronavirus) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది.

Telugu States Coronavirus: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో 439కి చేరిన కేసుల సంఖ్య, తెలంగాణలో 592కు చేరిన కోవిడ్ 9 కేసులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Telugu States Coronavirus) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 19 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో ఇప్పటివరకు కోవిడ్ 19 భారీన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఏడుమంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

Dr YSR Telemedicine: కరోనాపై పోరుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌, 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు అందుతాయి

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్‌ నియంత్రణ (Coronavirus in AP) చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ (Dr YSR Telemedicine) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan mohan Reddy) ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్‌ (Telemedicine) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం వైయస్ జగన్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement