ఆంధ్ర ప్రదేశ్

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 11కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద ప్రజల పడిగాపులు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

Vikas Manda

దేశవ్యాప్త లాక్ డౌన్ 21 రోజులు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బుధ, గురువారాల నుంచి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే ఆంధ్రా - తెలంగాణ బార్డర్ (AP- TS Border) వద్ద ఏపీ పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు.....

Loot on Lockdown: లాక్‌డౌన్ సైడ్ ఎఫెక్ట్స్, విశాఖపట్నంలో మూసి ఉన్న వైన్స్ షాప్‌పై దోపిడి, 144 మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన తాగుబోతులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Vikas Manda

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వాస్తవానికి గత ఆదివారం నుంచే కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మద్యపానంపై నిషేధం విధించింది. ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటే ఇంటి టార్చర్, బయటకు వెళ్తే పోలీసుల టార్చర్. మరి ఇలాంటి కఠోరమైన పరీక్షలను ఎదుర్కొంటున్న మందుబాబులు....

Chaos at AP - TS Border: హైదరాబాదులో ప్రైవేట్ హాస్టళ్ల మూసివేతతో సొంతూళ్లకు పయనమైన విద్యార్థులు, ఉద్యోగులు. రాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత. హాస్టళ్లు మూయొద్దని నిర్వాహకులకు తెలంగాణ మంత్రుల ఆదేశాలు

Vikas Manda

హైదరాబాద్ లో హాస్టళ్లు మూసివేస్తున్న నేపథ్యంలో, ఇలా అకస్మాత్తుగా మూసివేయకుండా సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం సమావేశం ఏర్పరిచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని సూచించారు.....

COVID-19 in India: భారత్‌లో 694కి చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో అత్యధికం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కరోనా మరణాలు నమోదు

Vikas Manda

భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 649 కు చేరాయి. అయితే తాజాగా నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటే దేశంలో పాజిటివ్ కేసులు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 705కు పెరిగింది.

Advertisement

Pawan Kalyan: కరోనావైరస్‌పై పోరాటానికి రూ. 2 కోట్లు డొనేట్ చేసిన పవన్ కళ్యాణ్, రూ. 71 లక్షలు విరాళమిచ్చిన రామ్ చరణ్ తేజ్, బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు

Vikas Manda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త కర్ఫ్యూను తాను మనస్పూర్థిగా స్వాగతిస్తున్నట్లు పవన్ చెప్పారు. కరోనావైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఇందుకు వేరే దారిలేదని ఆయన చెప్పారు.....

Coronavirus Alert in AP: ఏపీలో కరోనాపై నియంత్రణ, మరోసారి సమగ్ర సర్వే, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే(Another Comprehensive survey) నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.

Coronavirus in AP: కోవిడ్ 19 మీద చంద్రబాబు జాగ్రత్తలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల విరాళం, లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా ఆచరించాలని వినతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్‌ (Coronavirus in andhra pradesh) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) పలు జాగ్రత్తలు సూచించారు. కరోనావైరస్‌ వల్ల మన దేశంలో 20 నుంచి 50 లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చెప్పారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ) అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ఈ మేరకు అంచనా వేసిందని తెలిపారు.

Happy Ugadi 2021 Wishes: శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల లాంటి ఉగాది 2021 గ్రీటింగ్స్, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics ఉగాది విశిష్టతతో అందిస్తున్నాం

Vikas Manda

ప్రకృతి వరప్రసాదమైన ఉగాది పచ్చడి సేవిస్తూ, శ్రావ్యమైన పంచాగం వింటూ అందరికీ శుభమే కలగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలను మీ ఆత్మీయులకు పంపేందుకు మీ Facebook Status, WhatsApp messages, Instagram stories లేదా సందేశాలుగా పంపించేందుకు అందిస్తున్నాం......

Advertisement

Pan-India Lockdown: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన, మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని విజ్ఞప్తి, హెచ్చరిక

Vikas Manda

ఈరోజు అర్ధరాత్రి నుండి, దేశంలో ఏ ఒక్కరిని వారి ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు. ఇది మీ కోసం, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడటం కోసమే" అని మోదీ అన్నారు. అయితే, నిత్యావసర వస్తువులతో సహా ఇంటికి అవసరమయ్యే అన్ని వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వమే....

Nirmala Sitharaman Press Meet: ఐటీ రిటర్నుల గడువు పెంపు, జీఎస్టీ చెల్లింపుల గడువు పెంపు మొదలుకొని కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో పలు కీలక ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హైలైట్స్ చూడండి

Vikas Manda

కరోనావైరస్ వ్యాప్తితో దేశమంతా 'లాక్ డౌన్' పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో కలిగే నష్టాలపై కొంత భారం తగ్గించడానికి ఆర్థిక ప్యాకేజీని.....

Coronavirus Scare: కరోనావైరస్ ఎఫెక్ట్, రాజ్యసభ ఎన్నికలు వాయిదా, ఇటు ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా, ఎంసెట్ మరియు ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు పొడగింపు

Vikas Manda

కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 26 నుంచి జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలను (Rajya Sabha Election) ఎన్నికల సంఘం వాయిదా వేసింది

Coronavirus Outbreak in India: మహారాష్ట్రలో 100 దాటిన కరోనావైరస్ కేసులు, దేశవ్యాప్తంగా 492 కేసులు నమోదు, 9 మరణాలు సంభవించినట్లు అధికారిక గణాంకాలు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ

Vikas Manda

అయితే కేంద్రం ప్రకటించిన గణాంకాలకు, రాష్ట్రాలలో నమోదైన కేసులకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలు, యూటీలు కేంద్రానికి రిపోర్ట్ చేసిన తర్వాత వెల్లడించినవి. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 101కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.....

Advertisement

Covid-19 in Telugu States: తెలంగాణలో 33 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఏపీలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు, లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు, హెచ్చరించిన ఇరురాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Covid-19 in Telugu States) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) కొత్తగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అలాగే తెలంగాణ (Telangana) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే.. ఎవరికీ కూడా సీరియస్‌గా లేదని తెలిపారు.

Covid-19 Patient Selfie Video: సెల్ఫీ వీడియోలో కరోనా పేషెంట్ కన్నీటి ఆవేదన, నా మూలంగా నా ఫ్యామిలీని బ్లేమ్ చేయవద్దంటూ వినతి, త్వరగా బయటకు వచ్చేలా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్

Hazarath Reddy

విజయవాడలో (Vijayawada) కరోనా పాజిటివ్ కేసు ఒకటి వెలుగుచూసింది. అతను ప్యారిస్ (Paris) నుంచి వచ్చాడు. ఢిల్లీలో (Delhi) స్క్రీనింగ్ జరిగినా అక్కడ నెగిటివ్ వచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత అతనికి పాజిటివ్ రావడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ సంధర్భంగా సెల్పీ వీడియో (Covid-19 Patient Selfie Video) విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని సెల్ఫీ వీడియోలో కోరాడు.

AP Lockdown: మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్, అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేత, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి, మీడియాతో ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.

Coronavirus In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విజయవాడలో తొలి కరోనా పాజిటివ్, నగరంలో హై అలర్ట్

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా వైరస్‌ (Covid 19 In AP) విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

Advertisement

COVID-19 in AP: ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, 5కు చేరిన మొత్తం కరోనా కేసులు, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే

Hazarath Reddy

ఏపీలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

Janata Curfew in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత, నిర్మానుష్యంగా మారిన రోడ్లు, ప్రధాని పిలుపుతో ఇంటికే పరిమితమైన ప్రజలు

Hazarath Reddy

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూకు (Janata Curfew In Telugu States) రంగం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం స్తంభించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.

AP DGP Gautam Sawang: మీరు ఇళ్లలో..మేము స్టేషన్లలో, మీరక్షణ మా బాధ్యత, అందరూ జనతా కర్ప్యూని పాటించి కరోనాని జయిద్దాం, మీడియాతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆదివారం దేశమంతా జనతా కర్ప్యూ (Janata Curfew) పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీలో (AP) కూడా జనతా కర్ప్యూకి సంఘీభావం ప్రకటించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ (CM YS Jagan) పిలుపునిచ్చారు. మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సీఎం కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

Housing for Poor Scheme: 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఉగాది నుంచి అంబేద్కర్ జయంతికి వాయిదా వేసిన ఏపీ సర్కారు, కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని (Housing for Poor Scheme) ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ (Coronavirus) నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement