ఆంధ్ర ప్రదేశ్

COVID-19 Deaths in AP: ఏపీలో రెండో కరోనా మరణం, చికిత్స పొందుతూ మృతి చెందిన హిందుపూర్ వాసీ, రాష్ట్రంలో 180కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కోవిడ్ 19 (COVID-19) మహమ్మారి తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా కరోనా (coronavirus) మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు బలి (Second COVID-19 Death in AP) అయ్యారు. అనంతపురం జిల్లా హిందుపురానికి (Hindupur) చెందిన ముస్తాక్‌ ఖాన్‌ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు.

PM Modi Telugu Tweet: తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని, తెలుగులో ట్వీట్ చేసిన పీఎం మోదీ, వి కిల్ కరోనా..వి ఫైట్ విత్ కరోనా అంటూ కరోనాపై చిరంజీవి, నాగార్జున, ఇతర హీరోలు సాంగ్

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ (PM Narendra modi) వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు, ఆలస్యంగా ధృవీకరించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ, మరొక వ్యక్తి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Vikas Manda

ఏపీలో ఇప్పటివరకు 161 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కరోనావైరస్ బారిన పడిన రాజమండ్రికి చెందిన యువకుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకొని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.....

COVID-19 in Andhra Pradesh: తెలంగాణతో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్, కోవిడ్-19 కేసుల్లో దూకుడు, 161కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, దాదాపు రాష్ట్రం మొత్తం విస్తరించిన వైరస్

Vikas Manda

గురువారం వరకు 149 గా ఉన్న కేసులు, గత రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మరో 12 కేసులు కొత్తగా రావడంతో సంఖ్య 161కి పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు నుంచి 8 ఉండగా, విశాఖ నుంచి 3 కేసులు నమోదయ్యాయి.....

Advertisement

COVID-19 in Telangana: తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, మరిన్ని జిల్లాల నుంచి కేసులు పెరిగే అవకాశం, 154కు చేరిన మొత్తం పాజిటివ్ కేసులు

Vikas Manda

నిజామాబాద్, నిర్మల్ మరియు భైంసా పట్టణాలు వైరస్ హాట్ స్పాట్ లుగా అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా నుంచి కనీసం 50 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు, 4 రోజులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు......

PM Narendra Modi Message: ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి, దేశ ప్రజలంతా మహా జాగరణ చేయాలి. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం

Vikas Manda

కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై వచ్చి చేస్తున్న సమిష్టి పోరాటానికి సంఘీభావంగా ఈ ఆదివారం ఏప్రిల్ 05న రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఇంటిలోని సభ్యులు వారి ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి గుమ్మం ఎదుట 9 నిమిషాల పాటు జ్యోతులను లేదా దీపాలను వెలిగించాలని కోరారు......

Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాల రద్దుతో పాటు బ్లాక్‌లిస్ట్ చేసిన కేంద్ర హోంశాఖ, నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ

Vikas Manda

మర్కజ్‌‌లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా.....

PM Interaction with CMs: లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం, అతిక్రమించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, కరోనా అనుమానితులపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన

Vikas Manda

లాక్ డౌన్ యొక్క రెండవ వారంలో ప్రవేశించిన నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం అని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పట్నించి కరోనా అనుమానితులను వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, ఐసోలేషన్ లో ఉంచడం, క్వారంటైన్లకు తరలిండంపైనే సీరియస్ గా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి దిశానిర్ధేషం చేశారు.....

Advertisement

Sri Sita Ramula Kalyanam: భ‌ద్రాద్రిలో రాములోరి కళ్యాణోత్సవం. నిరాడంబరంలోనే రమణీయంగా, కమనీయంగా సాగిన వేడుక, తొలిసారిగా భక్తులు లేకుండానే జరిగిన బ్రహ్మోత్సవం

Vikas Manda

శ్రీ రామ నవమిని పురస్కరించుకొని భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం గురువారం అత్యంత కన్నుల పండువగా జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా భక్తజనం లేకుండానే రాములోరి బ్రహ్మోత్సవం నిర్వహించారు......

COVID-19 in India: భారతదేశంలో 1,965 కు చేరిన కోవిడ్-19 కేసులు, 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా 131 కొత్త పాజిటివ్ కేసులు నమోదు, 50 దాటిన మరణాలు

Vikas Manda

మహారాష్ట్రలో తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ కు కరోనా సోకింది, అలాగే ఒక 26 ఏళ్ల మహిళకు మరియు ఆమె 7ఏళ్ల కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ముంబైలోని ధారావి ప్రాంతంలో ఓ 53 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి ప్రాణాలు కోల్పోవడంతో.....

COVID-19 in Telugu States: కరోనావైరస్ వయా మర్కజ్, ఆంధ్రప్రదేశ్‌లో 132కు పెరిగిన కేసులు, గంటల వ్యవధిలోనే 88 కొత్త కేసులు నమోదు. తెలంగాణలో 127కు పెరిగిన కరోనా కేసులు

Vikas Manda

మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి......

Salute Police: లాక్‌డౌన్ కాలంలో అంకితభావంతో సేవలందిస్తునందుకు కృతజ్ఞతగా పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే, ప్రతిగా ఎమ్మెల్యేకు సెల్యూట్ చేసిన పోలీస్

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫాల్గునా బుధవారం సాయంత్రం తన కారులో వెళ్తుండగా లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న పోలీసులు కనిపించారు. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే ఫాల్గునా పోలీసుల వద్దకు వెళ్లి ఏఎస్ఐ మోహన్ రావ్ పాదాలను తాకుతూ నమస్కారం చేశారు. అందుకు ప్రతిగా ఏఎస్ఐ పోలీస్ సెల్యూట్ తో ఎమ్మెల్యేను గౌరవించారు.....

Advertisement

CM YS Jagan on COVID-19: ఎవరూ ఆందోళన చెందవద్దు, వైరస్‌ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకండి, కరోనావైరస్ కట్టడిపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Andhra pradesh in AP) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీని నియంత్రించేందుకు లాక్ డౌన్ (Lockdown) అమలు చేస్తున్నారు. కాగా కరోనా నియంత్రణ చర్యలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan Press Meet)బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు

Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్ యొక్క క్రియాశీల సభ్యుడు హైదరాబాద్‌లో మృతి. కరోనావైరస్ కారణంగానే మృతి చెందినట్లు అనుమానాలు, ఇప్పటికీ ధృవీకరించని రాష్ట్ర ఆరోగ్య శాఖ

Vikas Manda

అహ్మద్ అబ్దుల్ ముకీత్ అనే వ్యక్తి మంగళవారం మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో మరణించాడు. ఇతడి రక్త నమూనాలు ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారని, ఇతడి మరణానికి గల కారణాలు ఏంటి? కోవిడ్-19 తోనే చనిపోయాడా? లేదా ? అనే విషయాలను ఆరోగ్య శాఖనే....

COVID-19 in India: భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారి

Vikas Manda

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి ద్వారా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ ఈ సమావేశాలకు హాజరైన వారితోనే లింక్ ఉన్నట్లుగా తేలుతుంది.....

Coronavirus in AP: డేంజర్ జోన్‌లో కడప, 24 గంటల్లో 15 కరోనా కేసులు, ఏపీలో 87కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) ఒక్కసారిగా కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరిగాయి. 24 గంటల్లోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in AP) నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) అలర్ట్ అయింది.

Advertisement

Salaries Defer in AP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం, కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Coronavirus in AP) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Coronavirus Alert in AP: ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం, ఒక్కరోజే 21 కేసులు నమోదు, 44కి చేరిన పాజిటివ్ కేసులు, హై అలర్ట్ అయిన ఏపీ సర్కారు

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ కలకలం (coronavirus pandamic) ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారిగా ఏపీలో కేసులు (Covid 19 in AP) పెరిగిపోవడంతో ఏపీ సర్కారు అలర్ట్ (AP Govt) అయింది. ఏపీ పోలీస్ యంత్రాగాన్ని (AP Police) అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ప్రధానంగా కోవిడ్‌ 19 (Covid-19) వ్యాపిస్తోందని వారిని కట్టడి చేసింది. అయితే ఊహించని విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి ప్రమాదం ముంచుకు రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగారు.

COVID-19 Pay-cut: తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు, వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వాలు, తొలి అడుగు వేసిన మహారాష్ట్ర సర్కార్

Vikas Manda

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలతో మరియు ఇతర ప్రతినిధుల జీతాలలో ఈ మార్చి నెలకు సంబంధించి 60 శాతం కోత విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన జీతాలలో 25-50 శాతం వేతన కోతను ప్రకటించింది.

Nizamuddin Markaz Congregation: టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు, దిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయులను బ్లాక్ లిస్టులో చేర్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

100 విదేశీ మత పెద్దలు వీరితో పాటుగా మరో 200 మంది కలిసి దిల్లీలోని సమావేశానికి హాజరయ్యారు. వస్తూ వస్తూ వారితో పాటుగా కరోనావైరస్ ను మోసుకొచ్చారు. అంతేకాకుండా ఆ సమావేశం అనంతరం ఈ విదేశీయులంతా బృందాలుగా విడిపోయి రైలు మార్గం, రోడ్డు మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాలకు, అక్కడ్నించి వివిధ నగరాలకు చేరుకొని అక్కడ కూడా మసీదుల్లోకూడా ప్రచారం నిర్వహించారు......

Advertisement
Advertisement