ఆంధ్ర ప్రదేశ్
AP Local Body Elections 2020: జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తు, పంతొమ్మిది రాజకీయ పార్టీలకే గుర్తులు, స్థానిక ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
Hazarath Reddyఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి (AP local Body Elections 2020) మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు 19 రాజకీయ పార్టీల గుర్తుల నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది.
AP Local Body Election Nomination: గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచే, నామినేషన్‌కు కావాల్సిన అర్హతలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా (Andhra Pradesh local Body Elections 2020) మోగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు (MPTC, ZPTC) నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
AB Venkateswara Rao: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీవీకి కేంద్రం షాక్, సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసని తెలిపిన వెంకటేశ్వర రావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (AP former intelligence chief AB Venkateswara Rao) కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ (Home Ministry) ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 7 లోపు ఏబీ వెంకటేశ్వర రావు పై (AB Venkateswara Rao) నమోదు చేసిన అభియోగాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి (AP Goverment) కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Maruthi Rao Suicide: మారుతి రావు ఆత్మహత్య, అసలేం జరిగింది?, అమృత తండ్రి ఆత్మహత్యకు కారణమేంటి ?, ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా మారుతీరావు, కేసుల ఒత్తిడే కారణమంటున్న ఆయన భార్య
Hazarath Reddyరెండు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో (Pranay Murder Case) నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య (Maruthi Rao Suicide) చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో (Arya Vaishya Bhavan) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
AP SSC Exams New Schedule: ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్పు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ (SSC Exams New Schedule) ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది.
Tirumala Tirupati Temple: తిరుమల కొండపై మద్యం తాగుతూ, చికెన్ తింటూ.., 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌, తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు
Hazarath Reddyప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు (Tirumala) అందరూ దైవ దర్శనం కోసం వెళుతుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి చోట ఆకతాయిలు మరీ పేట్రేగిపోతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తూ వస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై (Venkateswara Temple) కూడా మద్యం తాగుతూ, మాంసం తింటూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.
Election Code In AP: ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్, ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు, హింసకు తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకోండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడి
Hazarath Reddyఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections 2020) సమరానికి వేళయింది. దీంతో అక్కడ తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ (State Election Commissioner, N Ramesh Kumar) ప్రకటించారు. ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ (Model Code of Conduct (MCC)) అమల్లోకి వచ్చేసింది. ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో క్లియర్‌గా స్పష్టం చేస్తుంది.
AP CM YS Jagan: కరోనాపై ప్రజలను ఆందోళనకు గురి చేయకండి, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, కాల్ సెంటర్ ఏర్పాటుచేయాలని ఆదేశాలు
Hazarath Reddyసీఎం జగన్ సమీక్షలో ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానిత కేసులుంటే వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
TS ICET-2020 Schedule: తెలంగాణ ఐసెట్-2020 పరీక్ష షెడ్యూల్ విడుదల, మార్చి 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ, మే 20 మరియు 21వ తేదీలలో పరీక్ష, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaడ్యూల్ ప్రకారం, మార్చి 9వ తేదీ నుంచి ఐసెట్ 2020 కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ మార్చి 30. అయితే , రూ. 500 అపరాధ రుసుముతో మే 14 వరకు, అయితే రూ. 5000 అపరాధ రుసుముతో మే 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు....
AP Local Body Election Schedule: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 29న కౌంటింగ్
Hazarath Reddyఏపీలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ (AP Local Body Election Schedule) (MPTC, ZPTC Electons) విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి.
Rajya Sabha Elections Notification: ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్, తెలంగాణా నుంచి రెండు సీట్లు ఖాళీ, మార్చి 26న ఓటింగ్
Hazarath Reddy2020 రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ (Rajya Sabha Elections Notification) విడుదల చేశారు. మార్చి 6 నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
Drinking Water to TN: తమిళనాడు రాష్ట్ర ప్రజల దాహార్థి తీర్చనున్న తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు తాగునీరు ఇవ్వడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకారం, ఏపీ సీఎం జగన్‌తో సంప్రదింపులు
Vikas Mandaరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. అయితే ఎన్ని టీఎంసీలు కేటాయించాలి, నీటి పంపిణీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దీనిపై అడుగు ముందుకు పడనుంది....
AP IPS Transfers and Promotions: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారు కీలక నిర్ణయం
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలు జరగనున్న వేళ వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, ఇంటిలిజెన్స్‌తో పాటూ మరికొన్ని కీలక స్థానాల్లో మార్పులు, చేర్పులు (AP IPS Transfers) చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.
Polavaram Project: పోలవరంపై కేంద్రం తీపికబురు, 2021కల్లా పూర్తి చేస్తామని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, వందశాతం పోలవరం ప్రాజెక్ట్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుందని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Construction) 2021 డిసెంబర్‌నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ (Gajendra singh shekhawat) చెప్పారు.
IMR AG Meets AP CM: కడపలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదన, సహకరించాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఐఎంఆర్‌ ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఎలాంటి సహకారానికైనా సిద్ధమన్న ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఆ దిశగా ఏపీ సర్కారు (AP Govt) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో (YSR Kadapa) మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ (IMR AG) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు (IMR Company Representatives) గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసారు. వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
Amaravati Metro Rail Corporation: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్యాలయం, డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్ల ఆహ్వానం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ మున్సిపల్ శాఖ
Hazarath Reddyవిశాఖపట్నంను ( Visakhapatnam) పరిపాలన రాజధానిగా నిర్ణయించాక ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (Amaravati Metro Rail Corporation) ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ జగన్ సర్కారు (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
Uttarakhand: ఏపీ బాటలో ఉత్తరాఖండ్, అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం రావత్, వేసవి రాజధానిగా గైర్సైన్‌, రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్‌, న్యాయ రాజధానిగా నైనిటాల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ బాటలో ఇప్పుడు మరో రాష్ట్రం కూడా నడుస్తోంది. ఉత్తరాఖండ్‌కు ఇకపై మూడు రాజధానులు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్, బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనిటాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో ముందుకు దూసుకుపోనుంది.
TDP Leader Suicide Attempt: కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం, పార్టీ పట్టించుకోలేదంటూ ఆవేదన, గతంలో కర్నూలు మేయర్‌గా సేవలందించిన బంగి అనంతయ్య
Hazarath Reddyకర్నూలు టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య (TDP leader Bangi Anantaiah) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Coronavirus Scare: కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు, మైండ్ స్పేస్ ఐటీ పార్క్ పాక్షికంగా మూసివేత
Vikas Mandaనెలరోజుల క్రితం దుబాయిలో హాంకాంగ్ కు చెందిన కంపెనీ ప్రతినిధులను కలవడం ద్వారా వారి నుంచి ఇతడికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో 2 రోజులు ఆఫీసుకు వెళ్లడంతో పాటు వైరస్ నిర్ధారణ అయి గాంధీ ఆసుపత్రిలో చేరేంత వరకు సుమారు వారం రోజుల పాటు కాలనీలోనే ఉన్నాడు. దీంతో.....
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా పోడూర మండలం జగన్నాధపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లడంతో (Car Fell Into Canal) ముగ్గురు చనిపోయారు. బాధితులు కారులో నరసాపురం మచ్చసిరి నుంచి రాజమహేంద్ర వరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.