ఆంధ్ర ప్రదేశ్

Sand Door Delivery In AP: ఇకపై ఇసుక నేరుగా మీ ఇంటికే, ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు, జనవరి 20 నాటికి అన్ని జిల్లాలకు డోర్‌ డెలివరీ

Hazarath Reddy

ఇసుకను సామాన్యలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం (AP GOVT) మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ (Sand Door Delivery In AP) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో (Krishna District) పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, (East Godavari) వైఎస్సార్‌ కడప (YSR Kadapa) జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నారు.

Indian Navy Bans Smartphones: సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేవీ, స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌పై నిషేధం, నేవీ స్థావరాల్లో సోషల్ మీడియాను ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసిన నేవీ ఉన్నతాధికారులు

Hazarath Reddy

భారత నౌకాదళం (Indian Navy) తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది ఇకపై సోషల్‌ మాధ్యమాలు (Social Media Apps) అయిన ఫేస్‌బుక్‌,(Facebook) ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు (WhatsApp) వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Visakha Utsav 2019-Highlights: ముగిసిన విశాఖ ఉత్సవ్, మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం, ఎక్కడా వ్యతిరేకత కానరాని వైనం, పూల వర్షం ద్వారా ప్రతిపక్షాలకు ఝలక్, ఈ విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?

Hazarath Reddy

అశేష జనసందోహం హర్షాతిరేకాల మధ్య విశేష కార్యక్రమాల మేళవింపుతో విశాఖ ఉత్సవ్‌ (Visakha Utsav 2019)ఘనంగా ముగిసింది. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌(Daggubati Venkatesh), సినీ నేపధ్య గాయకులు గీతామాధురి, సింహా, ఆదిత్య , వెంకీ మామ డైరెక్టర్‌ బాబీ, సినీ సంగీత దర్శకుడు థమన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ (Anchor Sma) వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. విశాఖ వాసులు అశేషంగా తరలిరావడంతో బీచ్‌ రోడ్‌ కిక్కిరిసిపోయింది.

AP Capital Shifting Row: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం, బుగ్గన నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైవపర్ కమిటీ, ఫిబ్రవరి 1న కీలక ప్రకటన వచ్చే అవకాశం, ఇన్‌సైడర్ ట్రైడింగ్‌పై కొనసాగుతోన్న వార్

Hazarath Reddy

ఏపీలో (AP) మూడు రాజధానుల అంశంపై ( 3 Capital Issue) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మొత్తం 16 మంది సభ్యులతో రాజధానిపై హైపవర్ కమిటీని (High Power Committee) ఏర్పాటు చేసింది. పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్,బుగ్గన, పేర్ని నాని, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.

Advertisement

TTD plans Temple In Jammu: జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు, కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పాలక మండలి, స్థల కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్న టీటీడీ ట్రస్ట్ బోర్డ్

Hazarath Reddy

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD trust board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.

Bomb Blast At Tirupati: తిరుపతిలో బాంబు పేలుడు, ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పేలిన బాంబు, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Hazarath Reddy

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati) బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలుడు (Bomb blast at Tirupati government hospital) జరిగింది. కాగా నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు (Dogs)లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Visakha Utsav 2019: రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, రాజధానిపై ఆచితూచి అడుగులు, విశాఖ ఉత్సవ్ 2019పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Andhra Pradesh Chief Minister YS Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు(Visakhapatnam) వెళ్లారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురుకాగా.. ఈసారి విశాఖవాసులు పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి (Chief Minister)సాదరస్వాగతం పలికారు.

AP Cabinet Meet Highlights: అమరావతిపై సస్పెన్స్ కొనసాగింపు, ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తే, వేరే నగరాలతో ఎన్నటికి పోటీపడగలమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్య, చంద్రబాబు హయాంలోని అవినీతిపై విచారణ, కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు

Vikas Manda

గత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ...

Advertisement

AP Cabinet Meet: నేడు అమరావతి భవితవ్యం తేలిపోనుందా? కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, అమరావతి ప్రాంతంలో ఉధృతమైన ఆందోళనలు, జీఎన్ రావు కమిటీపై చర్చించనున్న కేబినేట్, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కూడా చర్చ

Vikas Manda

వెలగపూడిలో రోడ్డుకు అడ్డంగా మహిళలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి, ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, ఆ సమయంలో వచ్చిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలకు గాయాలయ్యాయి....

Amaravathi Protests: 'మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు, మందడం వద్ద ఉద్రిక్తత, టీడీపి నేతల హౌజ్ అరెస్ట్, రేపటి ఏపీ కేబినేట్ భేటీపై ఉత్కంఠత

Vikas Manda

డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిపై ఏం తేలుస్తారు? అంతకుముందు చెప్పినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?...

AP Cabinet Meeting: 3 రోజుల్లో తేలిపోనున్న ఏపీ రాజధాని భవిష్యత్తు, ఈ నెల 27న విశాఖలో క్యాబినెట్ మీటింగ్, స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా, చంద్రబాబుకి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని, అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు

Hazarath Reddy

మరో మూడు రోజుల్లో ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Ap Cabinet Meeting) డిసెంబర్ 27న విశాఖలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఏపీ రాజధాని అంశంపై ఓ స్పష్టత రానుంది. విశాఖలో(Visakhapatnam) కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.

NRC-AP CM YS Jagan: ఎన్‌ఆర్సీపై బీజేపీకి ఏపీ సీఎం షాక్, రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు, మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం వైయస్ జగన్, కడపలో నీటిపారుదల ప్రాజెక్టులకు, ఉక్కు పరిశ్రమకు శంకు స్థాపన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి (National Register of Citizens)వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు.

Advertisement

AP Capital Political Row: తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటున్న అమరావతి రైతులు, ఆడపడుచులు రోడ్డెక్కారంటున్న చంద్రబాబు, కొనసాగుతున్న రైతుల ధర్నాలు, ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని అంశం

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.

AP Capital Suspense: ఏపీ రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా తేలని ప్రభుత్వ నిర్ణయం, ఎవరివాదనలు వారివే, తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి, ఈ నెల 27న క్యాబినెట్ మీటింగ్‌లో సస్పెన్స్ కి తెరపడే అవకాశం

Hazarath Reddy

అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మూడు రాజధానులు (3 Capitals) అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు( AP POlitics) పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు దీన్ని సమర్ధిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

YSR Netanna Nestam Scheme: చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు

Hazarath Reddy

చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో (dharmavaram) వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు.

AP Capital Row: ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజధాని అంశం, ఎవరి వాదనలు వారివే, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

Hazarath Reddy

మొన్నటి దాకా ఇసుక వార్ మీద నడిచిన ఏపీ రాజకీయాలు (Andhra pradesh politics) ఇప్పుడు రాజధాని (AP Capital Row) మీదకు తిరిగాయి. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) ఏపీ రాజధానిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Happy Birthday AP CM YS Jagan: ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 47వ ఒడిలోకి అడుగుపెట్టిన వైయస్సార్ తనయుడు, ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా..,ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు, ఆయనపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు(Happy Birthday AP CM YS JAGAN) జరుపుకొంటున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party)నుండి బయటకు వచ్చి నాన్న ఆశయాల సాధన కోసం వైయస్సార్సీపీ పార్టీని( YSRCP)స్థాపించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు.

AP Capital-Breaking News: ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన

Hazarath Reddy

ఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు.

AP Capital Report: రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై అతి త్వరలోనే సస్పెన్స్ వీడబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

MP Gorantla Madhav: నిన్ను బజారుకీడ్చిన సంగతి గుర్తించుకో, నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీనయ్యాను, జేసీ దివాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల బూట్లు తుడిచి, ముద్దాడిన వైసీపీ ఎంపీ

Hazarath Reddy

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై (JC Diwakar Reddy) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ మాదవ్ (YSRCP MP Gorantla Madhav) జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు.

Advertisement
Advertisement