తెలంగాణ

TS Coronavirus: నిజామాబాద్‌లో కరోనా విశ్వరూపం, పెళ్లి వేడుకకు వెళ్లిన 86 మందికి కరోనా పాజిటివ్, షాపింగ్‌ మాల్‌లో 75 మందికి కోవిడ్ నిర్ధారణ, 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్, అప్రమత్తమైన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో పెళ్లి వేడుకల్లో కరోనా కలకలం (Coronvirus in Nizamabad) సృష్టించింది. గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా (coronavirus positive) నిర్థారణ అయ్యింది.

Hyderabad Shocker: అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య, భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామల అవమానం, తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు, అవమానాలు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య (Man End His Life) చేసుకున్నాడు. భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామలు కొట్టడమే కాకుండా అవమానానికి గురి చేశారని మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య (Man Commits Suicide) చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TS Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం, అయినా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని తెలిపిన ప్రభుత్వం, తాజాగా 1,321 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 1,717కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు (TS Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి (TS Coronavirus) చేరింది.

TS Covid Update: తెలంగాణలో తాజాగా 1,321 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 320 మందికి క‌రోనా, ఐదుగురు మృతితో 1,717కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,207 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,717గా ఉంది.

Advertisement

TS ICET 2021: తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు, ఈనెల 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ (TS ICET 2021) నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్‌ పరీక్షలు (Telangana ICET 2021 notification) నిర్వహించనున్నారు.

Sunil Nayak Dies: ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, అందుకే చచ్చిపోతున్నా, కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగిన విద్యార్థి సునీల్‌ నాయక్‌ చికిత్స పొందుతూ మృతి, ప్రభుత్వం చేసిన హత్య అంటూ భగ్గుమన్న తెలంగాణ

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగిన విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌(25) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి (Sunil Nayak Dies) చెందారు.

Teppalamadugu Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యం..తెలంగాణలో సర్పంచ్ కుటుంబం మొత్తం దుర్మరణం, నిడమనూరులో ఘోర రోడ్డు ప్రమాదం, పరారీలో లారీ డ్రైవర్

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్క శుక్రవారం రోజే ఉమ్మడి జిల్లాలో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం మొత్తం చనిపోయింది. తెలంగాణ నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Teppalamadugu Road Accident) తెప్పలమడుగు సర్పంచ్ కుటుంబం మృత్యువాత పడింది.

COVID19 in TS: తెలంగాణలో వెయ్యి మార్కును దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు, రాష్ట్రంలో 7 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య, సెకండ్ వేవ్ కట్టడి కోసం ప్రజలు సహకరించాలని కోరిన ఆరోగ్యశాఖ

Team Latestly

తెలంగాణలో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి రోజూవారి కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. 2021లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది....

Advertisement

Telangana: హైదరాబాద్‌తో సమానంగా రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలు వృద్ధి చెందాలి, స్థానిక నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష, శివారు జిల్లాల సమీకృత అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు

Team Latestly

ఇందులో భాగంగా షాద్ నగర్, పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకర్ పల్లి, తుక్కుగూడ, ఆమన్ గల్ వంటి మున్సిపాలిటీలు, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట్, జిల్లెలగూడ వంటి మున్సిపల్ కార్పొరేషన్లు మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట వంటి మున్సిపల్ కార్పొరేషన్లు...

River Tragedy: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన, గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ఆరుగురు గల్లంతు, మృతదేహాలు లభ్యం

Team Latestly

నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మెండోరా వద్ద గల పుష్కరఘాట్ నుంచి గోదావరి నదిలో శుక్రవారం పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా బయటపడగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి, మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి....

Corona in Telangana: తెలంగాణలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, కొత్తగా మరో 965 మందికి పాజిటివ్; సెకండ్ వేవ్ పరిస్థులను యుద్ధ వాతావరణంగా పేర్కొన్న మంత్రి ఈటల

Team Latestly

తెలంగాణలో ఒకవైపు హీట్ వేవ్, మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. ఇది గంభీరమైన సమయం...

Heatwaves Over AP & TS: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాబోయే మూడు రోజుల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ

Team Latestly

రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం ఉండడం వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో

Advertisement

COVID19 in Telangana: తెలంగాణలో కోవిడ్19 విజృంభన, కొత్తగా 887 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 17 వందలు దాటిన కోవిడ్ మరణాలు, 5 వేలు దాటిన ఆక్టివ్ కేసులు, మంత్రి ఈటల అత్యవసర సమావేశం

Team Latestly

తెలంగాణలో ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు కరోనా వైరస్ తన తడఖా చూపిస్తుంది. రోజురోజుకి కేసులు పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అధికారులతో వరుసగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గురువారం, కోవిడ్ ఆస్పత్రుల....

Heatwave Hits Telugu States: బయటకు రాకండి..వస్తే మాడిపోతారు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఎండలు, మే నెల రాకముందే మొదలైన వడగాడ్పులు, మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు (Heatwave Hits Telugu states) వీస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

Visakapatnam Shocker: భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య, మరో చోట కాపురానికి పనికిరాని భర్త, భార్యను వదిలించుకునేందుకు వేధింపులు, అత్తింటి ఎదుట బాధితురాలు ధర్నా

Hazarath Reddy

భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని చనిపోయాడు. మరోచోట కాపురానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి అత్తింటి ముందు ధర్నాకు దిగింది.

Corona Hot Spots in Hyd: హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్ ప్రదేశాలను గుర్తించిన అధికారులు, మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో జీహెచ్ఎంసీ, పెరుగుతున్న కేసులతో వణుకుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం

Hazarath Reddy

జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా (Corona hot spots in Hyderabad) ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 684 కోవిడ్ కేసులు నమోదు, గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో విజృంభిస్తున్న వైరస్, కరోనా సోకే అవకాశం ఉండే వారందరికీ వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రానికి టీఎస్ ప్రభుత్వం ప్రతిపాదన

Team Latestly

నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 184 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 61 కేసులు,నిజామాబాద్ నుంచి 48, రంగారెడ్డి 45 మరియు నిర్మల్ జిల్లా నుంచి 30 ...

Hyderabad Shocker: పెళ్లి పేరుతో యువతిని గర్భవతిని చేశాడు, ఆ తర్వాత దూరం పెట్టాడు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో పరిచయం పెళ్లిగా మారి చివరకు ఆత్మహత్యకు దారి తీసింది. ప్రియురాలిని గర్భవతిని చేయడమే కాకుండా ఆ గర్భాన్ని తీసివేసి ఆమెను దూరం పెట్టడంతో తట్టుకోలేని యువతి ఆత్మహత్య (Young girl died by suicide) చేసుకుంది. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Coronavirus Awareness Program: కరోనాతో యుద్ధం చేస్తున్నాం, జాగ్రత్తలు పాటించండి, కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాచకొండ పోలీసులు, ట్విట్టర్‌లో వీడియో పోస్ట్

Hazarath Reddy

రాచకొండ పోలీసులు ఈ రోజు కరోనావైరస్ అవేర్ నెస్ పోగ్రాం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని కోరారు. అలాగే శానిటైజర్లను వాడాలని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

COVID19 in TS: కోవిడ్ నిబంధనలను విస్మరిస్తున్న ప్రజలు, తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, కొత్తగా 463 మందికి కోవిడ్ పాజిటివ్, రాష్ట్రంలో 4,678కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో మతపరమైన వేడుకలు, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడటంపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బయటకు వెళ్తే, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అయినప్పటికీ ఇవేమి పట్టనట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.....

Advertisement
Advertisement