తెలంగాణ

Nagarjuna Sagar By-Poll 2021: వేడెక్కిన సాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌, కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

Hazarath Reddy

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక (Nagarjuna Sagar By-Poll 2021) అనివార్యమైంది. నాగర్జున సాగర్‌ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah) కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.

Telangana's COVID19 Report: తెలంగాణలో కొత్తగా 403 మందికి కరోనా పాజిటివ్, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పండగలు- ఉత్సవాలు, బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం

Team Latestly

తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలోనూ విజృంభిస్తుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలలో, పనిచేసే చోట మరియు ప్రయాణ సమాయాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిచే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, సెక్షన్ 51.....

TS Covid: తెలంగాణలో కొత్త‌గా 535 కరోనా కేసులు, ముగ్గురు మృతితో 1,688కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154 మందికి క‌రోనా, రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 535 కరోనా కేసులు (New Covid Cases) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 278 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,156 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,688గా ఉంది.

India Covid Updates: కరోనాతో ఆరు రాష్ట్రాలు విలవిల, దేశంలో తాజాగా 62,714 మందికి కరోనా నిర్ధారణ, 312 మంది కరోనా కారణంగా మృతి, తెలంగాణలో తాజాగా 535 కోవిడ్ కేసులు, కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష, మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 28,739 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి (Covid Deathsw) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది.

Advertisement

Coronavirus in Telangana: ఒకరి నుంచి 8–9 మందికి కరోనా వ్యాప్తి, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు, సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ (Coronavirus Second Wave in Telangana) మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (telangana state government) నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Car Catches Fire in Hyd: ట్యాంక్‌బండ్‌ వద్ద అగ్ని ప్రమాదం, కారులో అకస్మాత్తుగా మంటలు, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఘటన, పోలీసులు సరిగా స్పందించలేదని తెలిపిన కారు యజమాని

Hazarath Reddy

ట్యాంక్ బండ్ సమీపంలో బోట్స్ క్లబ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళుతున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు (car catches fire in Hyd) చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు, పాదచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Coronavirus in TS: తెలంగాణలో మగవారికే ఎక్కువగా కరోనా వ్యాప్తి, సంచలన విషయాలు వెలుగులోకి, మొత్తం 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు కరోనా బారీన పడ్డారని వెల్లడించిన తెలంగాణ ఆరోగ్య శాఖ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లోనే అధికంగా కరోనా కేసులు (COVID-19 and gender equality) వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వారు జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటమేనని తెలుస్తోంది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ (Telangana State Medical and Health Department ) వెల్లడించింది.

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదు, ఇద్దరు మృతితో 1,685 చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 142 మందికి క‌రోనా, ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 247 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,878 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,685గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,241 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,870 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 142 మందికి క‌రోనా సోకింది.

Advertisement

Wine Shops Closed in TS: రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్, తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు

Hazarath Reddy

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం దుకాణాలు (Wine Shops Closed in TS) మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ (Cyberabad Police Commissioner Sajjanar) ఆదేశాలు జారీ చేశారు.

Telangana Budget 2021-22: తెలంగాణ బడ్జెట్‌కి అసెంబ్లీ ఆమోదం, ముగిసిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు, మొత్తం 9 రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు, తమకు తగిన సమయం ఇవ్వలేదని విపక్షాలు అసంతృప్తి, సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్

Hazarath Reddy

ఈ నెల 15న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. విరామ దినాలు పోగా, మొత్తం 9 రోజులు మాత్రమే ఈ సారి సమావేశాలు జరిగాయి. అధికార, విపక్షాల సభ్యులు 47.44 గంటల పాటు మాట్లాడారు. బడ్జెట్‌పై (Telangana Assembly Budget, 2021-22) చర్చించేందుకు తమకు తగిన సమయం ఇవ్వలేదని విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికార పక్షం మాత్రం కొవిడ్‌ పరిస్థితుల్లోనూ సవివరమైన చర్చ జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సమావేశాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ .2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది.

No Lockdown in TS: లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదు, అన్ని యధాతథంగానే జరుగుతాయి, కరోనాను నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.విద్యా సంస్థలను తాత్కాలికంగానే మూసివేశామని అది కూడా కరోనా వ్యాప్తి పట్ల ముందు జాగ్రత్త చర్యగా చేపట్టామని అన్నారు.

COVID in TS: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా, కొత్తగా 518 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకటి ,రెండు వారాల వ్యవధిలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య శుక్రవారం 5 వందల మార్కును క్రాస్ చేసింది. మరోవైపు రికవరీల సంఖ్యలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండటం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది....

Advertisement

Bharat Bandh: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు, పలు రాష్ట్రాల్లో నిలిచిపోయిన రవాణా సేవలు, ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణంగా కొనసాగుతున్న బంద్

Team Latestly

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. రైతు సంఘాల యూనియన్ 'సమ్యుక్త్ కిసాన్ మోర్చా' ఇచ్చిన 12 గంటల భారత్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది....

COVID in TS: తెలంగాణలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా, కొత్తగా మరో 495 పాజిటివ్ కేసులు మరియు 4 కోవిడ్ మరణాలు నమోదు

Team Latestly

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే ఒక వారంలోనే రోజూవారీ కేవిడ్ కేసుల సంఖ్య మూడు రేట్లు పెరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.....

CM Review on Irrigation System: నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.. ఆర్డీఎస్ పథకంలో తెలంగాణ హక్కు కోసం స్వయంగా కర్ణాటక వెళ్తా! రాష్ట్రంలో నీటి నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

Team Latestly

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 88 వేల ఎకరాలకు సాగునీరందించే ఆర్డీఎస్ స్కీం పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో కేటాయించిన ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టిఎంసీల నీటిని సాధించుకుంటామన్నారు.....

Hyderabad Shocker: నాతో పడుకో..లేకుంటే నీకొడుకు, భర్తను లేపేస్తా, వైద్యురాలికి బెదిరింపులు, కారుకు జీపీఎస్ తగిలించి మరీ వేధింపులు, తట్టుకోలేక జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు, నిందితులు అరెస్ట్

Hazarath Reddy

నాతో పడుకో..లేకుంటే నీకొడుకు, భర్తను లేపేస్తానంటూ జూబ్లీ హిల్స్‌లో వైద్యురాలిని బెదింరిచాడో ఓ కామాంధుడు (Hyderabad Shocker). ఏకంగా ఆమె కారుకు జీపీఎస్ పరికరాన్ని అమర్చి ఆమె కదలికలను గుర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

TS Cinema Theaters Closed Row: తెలంగాణలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌, ఖండించిన సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, థియేట‌ర్లు మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని సూచన

Hazarath Reddy

తెలంగాణలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. క‌రోనా కేసుల తీవ్ర‌త నేప‌థ్యంలో తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసివేస్తార‌ని (TS Cinema Theaters Closed) వ‌స్తున్న వార్త‌ల‌ను సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఖండించారు. రాష్ర్టంలో సినిమా థియేట‌ర్ల‌ను మూసివేయ‌డం లేద‌ని (cinema theaters will not be closed) తేల్చిచెప్పారు. థియేట‌ర్లు మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని సూచించారు.

Cyberabad Traffic Police: నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న, ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

సైబరాబాద్ పోలీసులు కొత్తగా ముందుకు వెళుతున్నారు. సినిమా పోస్టర్లను వాడుకుంటూ ట్రాఫిక్ మీద ప్రతి ఒక్కరికీ పోలీసులు (Cyberabad Traffic Police) అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని జెర్సీ మూవీని (Awareness With Using Jersey Poster) వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్‌ పట్టుకుని ముఖాన హెల్మెట్‌ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్‌.. "నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు. హెల్మెట్‌ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే!

Corona in Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, కొత్తగా మరో 431 పాజిటివ్ కేసులు నమోదు, మళ్లీ రాష్ట్రంలో ఆంక్షలు విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

Team Latestly

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,04,298కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 111 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 31 కేసులు, మేడ్చల్ నుంచి 37, జగిత్యాల మరియు మంచిర్యాల.....

MHA Fresh Guidelines: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నూతన మార్గదర్శకాలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచి కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన

Team Latestly

ఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి మరియు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. MHA జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి....

Advertisement
Advertisement