తెలంగాణ

Covid in TS: హైదరాబాద్‌లో సెకండ్ వేవ్ మొదలైందా? ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో నలుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ

Hazarath Reddy

గత కొంత కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన హైదరాబాద్ నగరంలో మళ్లీ కరోనా కలకలం (Coronavirus Second Wave in Telangana) రేపింది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో (SR Nagar police station) నలుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా (Four SI's and constables tested positive for coronavirus) తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. గత జూన్ నెలలో వచ్చిన వారికి మరోసారి పాజిటివ్ రావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

Rythu Bandhu Scheme: తెలంగాణలో ఈనెల 27 నుంచి రైతుబంధు సాయం పంపిణీ, పది రోజుల్లో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

Team Latestly

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది...

Vijayashanti Joins BJP: కేసీఆర్‌ని గద్దె దింపేది మేమే, కాంగ్రెస్ పార్టీ పోరాడలేని స్థితికి చేరుకుంది, బీజేపీలో చేరిన విజయశాంతి, చేరిన వెంటనే తెలంగాణ సీఎంపై మాటల తూటాలు పేల్చిన రాములమ్మ

Hazarath Reddy

తెలంగాణ రాములమ్మ.. సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ తీర్థం (Vijayashanti Joins BJP) పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన తరువాత సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.

Kamareddy DSP Arrested: తెలంగాణలో బెట్టింగ్ కేసు మళ్లీ తెరమీదకు, ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు, కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో గతంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ వార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ (Kamareddy DSP Arrested) చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Advertisement

PET Candidates Protest at Pragathi Bhavan: సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు, పోస్టులు భర్తీ చేయండి లేదా కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులు, ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ (PET Candidates Protest at CM Camp Office) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని లేదా తమకు కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని గురుకుల పీఈటీ అభ్యర్థులు (PET Candidates) డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు.

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 517 మందికి కరోనా పాజిటివ్, మరో 800 పైగా రికవరీ, రాష్ట్రంలో 7,778గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 264,606 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,778 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

CM KCR Supports Bharat Bandh: రైతుల ఉద్యమానికి సీఎం కేసీఆర్ మద్ధతు, డిసెంబర్ 8న భారత్ బంద్, టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలంగాణ సీఎం పిలుపు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు (CM KCR Supports Bharat Bandh) ఇస్తుందని ఆ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు (Bharat Bandh) ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయ‌మైన పోరాటాన్ని కేసీఆర్ స‌మ‌ర్థించారు.

Telugu States Covid: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కోవిడ్, ఏపీలో తాజాగా 599 కేసులు నమోదు, తెలంగాణలో 596 మందికి కరోనా, కోవిడ్‌పై యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు (Telugu States Covid) తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీలో గత 24 గంటల్లో 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది.

Advertisement

GHMC Election Results 2020: కారు జోరుకు బీజేపీ బ్రేక్, 56 సీట్లకే పరిమితమైన టీఆర్ఎస్, 48 సీట్లతో సత్తా చాటిన బీజేపీ, 44 సీట్లతో ఎంఐఎం, రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

Hazarath Reddy

ఎట్టకేలకు గ్రేటర్ ఫలితాల ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు (GHMC Election Results 2020) వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ (TRS) 56 డివిజన్లలో గెలుపొందింది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సారి అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది.

GHMC Election Results 2020: దూసుకెళ్తున్న కారు, గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, ఎంఐఎం పార్టీలు, చతికిల పడిన కాంగ్రెస్, జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పోలింగ్ ఫలితాలు వెలువడే కొద్ది టీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంటో పోతోంది. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 57 డివిజన్‌లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 22, ఎంఐఎం అభ్యర్థులు 31 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

GHMC Election Results 2020: ఎన్నికల కమీషనర్ సర్క్యులర్ కు హైకోర్ట్ బ్రేక్, గ్రేటర్ ఫలితాల్లో ట్విస్ట్, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం, రెండో స్థానంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

Team Latestly

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా పోస్టల్ బ్యాలెట్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఆధిక్యం లభిస్తుంది. ఉదయం 10:30 వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యత కనబరచగా, తెరాస 34 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది....

Telangana COVID Bulletin: తెలంగాణలో కొత్తగా మరో 631 మందికి కరోనా పాజిటివ్, మరో 802 పైగా రికవరీ, రాష్ట్రంలో 8 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 261,830 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,826 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.....

Advertisement

GHMC Election Results 2020: గ్రేటర్‌లో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్, బ్యాలెట్ ఓటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

Team Latestly

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకోగా, ఈసారి కూడా 100 స్థానాలు పక్కా అంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తెరాసకు 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది, బీజేపీకి 20-25 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి...

Corona in TS: తెలంగాణలో కొత్తగా మరో 603 మందికి పాజిటివ్, మరో 873 మంది రికవరీ, రాష్ట్రంలో 9 వేల దిగువకు పడిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

బుధవారం సాయంత్రం వరకు మరో 873 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 261,028 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో....

Telangana's COVID Bulletin: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కొవిడ్19 వ్యాప్తి, కొత్తగా మరో 565 మందికి పాజిటివ్, మరో 925 మంది రికవరీ, రాష్ట్రంలో 9,266కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 106 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 42, రంగారెడ్డి నుంచి 43 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. చాలా జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా నమోదయ్యే కేసులు భారీగా తగ్గాయి...

Chevella Road Accident: హైదరాబాద్ శివార్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు, మృతులను తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Road Accident) జరిగింది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ సమీపంలో బోర్‎వెల్ లారీ-ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో (Telangana Road Accident) ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ రహదారిపై (Hyderabad-Bijapur road) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

GHMC Election Polling Over: దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం, ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 3న ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో రీపోలింగ్, డిసెంబర్ 4న ఫలితాలు

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Election Polling Over) ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది.

GHMC Election 2020: వెలవెలబోతున్న ఓటింగ్ కేంద్రాలు, బయటకు రాని ఓటరు, 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (GHMC Election 2020) ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections) అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది.

TRS MLA Nomula Narsimhaiah Dies: టీఆర్ఎస్ పార్టీలో విషాదం, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో కన్నుమూత, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) గుండెపోటుతో (TRS MLA Nomula Narsimhaiah Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.

Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా మరో 502 మందికి పాజిటివ్, మరో 894 రికవరీ, రాష్ట్రంలో 9 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 259,230 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,627 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

Advertisement
Advertisement