టెక్నాలజీ

PSLV-C51: 2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి, ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 నింగిలోకి

Hazarath Reddy

నింగిలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపుతూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో 2021లో తొలి విక్టరీని సాధించేందుకు రెడీ అయింది. పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

New JioPhone 2021 Offer: జియో నుంచి మరో సంచలన ఆఫర్, రెండేళ్ల పాటు ఉచిత కాల్స్, నెలకు 2 గిగాబైట్ల డేటా ఉచితం, కొత్త జియో ఫోన్ రూ.1,999కే, ఆఫర్‌పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ (New JioPhone 2021 Offer) ప్రకటించింది, అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అంతే కాదు, ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ (Unlimited Voice calls) ఇస్తామని చెప్పింది.

WhatsApp's Privacy Policy: వాట్సప్, ఫేస్‌బుక్‌లకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు, వినియోగదారుల గోప్యత చాలా ముఖ్యం, నాలుగు వారాల్లో దీనిపై మీ స్పందన తెలపాలని ఆదేశాలు

Hazarath Reddy

సోషల్‌ మీడియా దిగ్గజాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీ కంపెనీ ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. ప్రజల గోప్యత అనేది చాలా ముఖ్యమైనది. దానిని కాపాడటం మా కర్తవ్యమంటూ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది.

FASTag Update: రేపటి నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి, ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు హైవేల‌పైకి..లేకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే, ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి (FASTag Update) రానుంది. ఇకపై వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే డబుల్ టోల్ చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి (FASTags Mandatory) వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచి దీన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

Advertisement

Farmers Protest: పాకిస్తాన్ - ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖా‌తాలను బ్లాక్ చేయండి, ట్విట్టర్‌కు నోటీసులు పంపిన కేంద్ర ప్రభుత్వం, 1,178 అకౌంట్ల నుంచి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ట్వీట్లు వస్తున్నాయంటూ ఆగ్రహం

Hazarath Reddy

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతు ఆందోళన (Farmers Protest) నేపథ్యంలో సోషల్‌ మీడియాపై గుర్రుగా ఉన్న కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రా‍క్టర్‌ ర్యాలీలో హింస తరువాత ట్విటర్‌ ఖాతాలపై మరింత కన్నేసిన సర్కార్‌ ఖలీస్తాన్ సానుభూతి పరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు తాజాగా నోటీసు ఇచ్చింది.

Telegram: వాట్సాప్‌కు చుక్కలు చూపిస్తున్న టెలిగ్రాం, డౌన్‌లోడ్ల పరంగా తొమ్మిది నుంచి నంబర్ వన్ స్థానంలోకి యాప్, వాట్స్‌యాప్‌ను భారీగా దెబ్బ కొట్టిన ప్రైవసీ పాలసీ

Hazarath Reddy

నిన్నమొన్నటి దాకా టాప్ లో దూసుకుపోతున్న వాట్సాప్‌ కు టెలిగ్రాం (Telegram) షాకిచ్చింది. యూజర్లపై ప్రైవసీ పాలసీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ వాట్సాప్ పై (WhatsApp) విమర్శలు వచ్చిన నేపథ్యంలో అందరూ టెలిగ్రామ్‌ బాట పట్టారు.

Airtel 5G Netowrk: జియోకి భారీ షాక్, 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఎయిర్‌టెల్, ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ కు మరో దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ భారీ షాక్ ఇచ్చింది. జియో కంటే ముందుగానే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించించింది. ఈ ప్రయోగంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది.

Budget 2021: సెస్ అంటే ఏమిటి..పెరిగే ధరలు, తగ్గే ధరలు ఏంటో తెలుసా, మద్యం కొనాలంటే ఇక చుక్కలే, ముబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం, సెస్ ద్వారా రూ. 30 వేల కోట్ల ఆదాయం, పెరిగే తగ్గే వాటిపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ పై (Budget 2021) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సెస్‌ అంశం కలవరపెడుతోంది.

Advertisement

WhatsApp New Feature: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్, ఇకపై వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావచ్చు, ఫేస్‌బుక్ ఆటోమేటిక్ లాగౌట్

Hazarath Reddy

ఇన్ స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ ( WhatsApp New Feature) తీసుకురాబోతుంది.

59 Chinese Apps Banned: చైనా యాప్‌లకు భారీ షాక్, టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై శాశ్వత నిషేధం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద వీటిపై నిషేదం

Hazarath Reddy

చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరోసారి కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం (59 Chinese Apps Banne) విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గ‌తేడాది జూన్‌లో వీటిపై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించ‌గా.. ఇప్పుడు వాటిని శాశ్వ‌త నిషేధం దిశగా కేంద్రం తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Digital India Sale: రిలయన్స్ అదిరే ఆఫర్లు, డిజిటల్‌ ఇండియా సేల్‌’’ పేరుతో రిపబ్లిక్ డే సేల్ ప్రకటించిన రిలయన్స్, ఈ నెల 26 వరకు అందుబాటులో..

Hazarath Reddy

రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘‘డిజిటల్‌ ఇండియా సేల్‌’’ (Digital India Sale) పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులపై లభించే ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటాయి.

Xiaomi Republic Day Sale: షియోమి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, జనవరి 20 నుండి జనవరి 24 వరకు రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించిన చైనా దిగ్గజం

Hazarath Reddy

ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్ ‌ప్రకటించింది. ప్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ లాంటి దిగ్గజాలకు పోటీగా షియోమి (Xiaomi) కూడా రిపబ్లిక్ డే సేల్‌ను (Xiaomi Republic Day Sale) ప్రకటించింది.

Advertisement

IT Summons to Facebook&Twitter: ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం భారీ షాక్, ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు జారీ

Hazarath Reddy

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, నివారణపై చర్చించడానికి ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సీరియస్ అయింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు (IT Summons to Facebook&Twitter) జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

WhatsApp: యూజర్ల దెబ్బకి వెనక్కి తగ్గిన వాట్సప్, నూతన ప్రైవసీ విధానం అప్‌డేట్‌ మరో మూడు నెలల పాటు వాయిదా, మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోమని వెల్లడి

Hazarath Reddy

వాట్సాప్‌ తాజాగా తీసుకువచ్చిన నూతన ప్రైవసీ విధానంపై వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. కాగా పది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ( new privacy policy) నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్‌ మొబైల్‌ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది.

Signal App: సిగ్నల్ యాప్ ఉపయోగించడం ఎలా? కొత్త స్నేహితులను యాడ్ చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ గైడ్ మీకోసం..

Hazarath Reddy

మెసెంజేర్‌ యాప్‌ వాట్సాప్‌కు సిగ్నల్ యాప్ గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అయింది. ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌తో ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు అంతా ‘సిగ్నల్‌’వైపు (WhatsApp users begin moving to Signal) వెళుతున్నారు.

Signal App: వాట్సాప్ ఢమాల్, సిగ్నల్ యాప్ వైపై వెళుతున్న యూజర్లు, మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ, వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని తెలిపిన వాట్సాప్

Hazarath Reddy

సిగ్నల్ యాప్ లో మామూలు మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ ఉండడం కూడా దీనికి అదనపు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మీ ఐపీ అడ్రస్‌ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

Advertisement

Upcoming Smartphones: మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది మీకోసం కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి, ఓసారి వాటిపై లుక్కేసుకోండి

Hazarath Reddy

ఐఫోన్ 13 వంటి హై-ప్రొఫైల్ హ్యాండ్‌సెట్‌ల నుంచి ఎల్‌జి రోలబుల్ వంటి మొబైల్స్ కూడా రానున్నాయి. ఈ ఏడాదిలో మొబైల్ సంస్థలు తీసుకురాబోయే కొన్ని ఆసక్తికరమైన 10 స్మార్ట్‌ఫోన్స్ గురించి అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Jio Free Voice Calls: జియో కొత్త సంవత్సరం గిఫ్ట్, ఇకపై జియో కాల్స్ ఉచితం, ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీలు ఉండవు, దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ నంబర్లకు ఫ్రీ కాల్స్

Hazarath Reddy

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు కొత్త సంవత్సం కానుకను ప్రకటించింది. ఇకపై 2021 జనవరి 1 నుంచి జియో కస్టమర్లు దేశీయంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ నంబర్లకు అపరిమిత ఉచిత కాలింగ్‌ (Jio Free Voice Calls) చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారంతో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల (ఐయూసీ) హయాం ముగిసిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Android 11 Update: ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందుకునే ఫోన్ల జాబితా ఇదే, మోటోరోలా నుంచి 22 ఫోన్లు, లెనోవో నుంచి ఇక ఫోన్. 2021లో ఆండ్రాయిడ్ 11 మార్కెట్లోకి వచ్చే అవకాశం

Hazarath Reddy

ఆండ్రాయిడ్ 11 కొన్ని ఫోన్లకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే మోటరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకోబోయే ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను (Android 11 Update) అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది.

Oppo India: దేశంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లోనే.. చైనా తర్వాత ఇండియాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో, మరో మూడు ఫంక్షనల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు

Hazarath Reddy

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (5G innovation lab) ఏర్పాటు చేస్తోంది. దాయాది దేశం చైనా తరువాత , భారతదేశంలోని​ హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ (5G innovation lab in in Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది.

Advertisement
Advertisement