Technology

Chandrayaan-3: చంద్రయాన్ -3 వచ్చేస్తోంది, 2022 మధ్య నాటికి నింగిలోకి దూసుకు వెళుతుందని చెప్పిన ఇస్రో ఛైర్మెన్ కె శివన్, గగన్‌యాన్ డిజైన్ కూడా తుది దశలో ఉందని చెప్పిన శివన్

Hazarath Reddy

చంద్రయాన్ -3 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ కె. శివన్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో ఏరోస్పేస్, ఏవియానిక్స్ యొక్క భవిష్యత్తు పై యూపీఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2022 మధ్య నాటికి చందయన్ -3 ప్రయోగం (Chandrayaan-3) ఉంటుందని తెలిపారు.

Gautam Adani Beats Elon Musk: గౌతం అదానీ దెబ్బకు ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్‌ అవుట్, 2021లో అత్యధికంగా సంపాదించిన వారిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్‌ వ్యాపార వేత్త , అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరిక

Hazarath Reddy

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా (Gautam Adani beats Elon Musk) నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు. అదాని సంపద ( biggest wealth surge) ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

BSNL Offers: కొత్త ఆఫర్లతో దూసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించిన టెలికం దిగ్గజం, కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి 4జీ సిమ్‌ ఉచితం

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను (BSNL BroadBand Plan Offers) సవరించింది.

Redmi Note 10 Series: షియోమి అభిమానులకు శుభవార్త, రెడ్‌మి నోట్‌ 10 సీరిస్ వచ్చేశాయి, ధర రూ.11,999 నుంచి ప్రారంభం, రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లను విడుదల చేసిన కంపెనీ

Hazarath Reddy

షియోమి యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ను చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి ఇండియాలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో (Redmi Note 10 Series) రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు (Xiaomi Redmi Note 10 Pro Max, Note 10 Pro, Note 10) లాంచ్‌ చేసింది.

Advertisement

WhatsApp Mute Video Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్, ఇకపై ఇతరులకు ఆడియో మ్యూట్ చేసి కేవలం వీడియో మాత్రమే పంపవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. ఆ వీడియోలో ఏవైనా అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు.

CoWIN Registration: కో–విన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా? ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

BSNL New Plan: అత్యంత తక్కువ ధరకే ఇంటర్నెట్, సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్, 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి

Hazarath Reddy

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి.

PSLV-C51: 2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి, ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 నింగిలోకి

Hazarath Reddy

నింగిలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపుతూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో 2021లో తొలి విక్టరీని సాధించేందుకు రెడీ అయింది. పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

Advertisement

New JioPhone 2021 Offer: జియో నుంచి మరో సంచలన ఆఫర్, రెండేళ్ల పాటు ఉచిత కాల్స్, నెలకు 2 గిగాబైట్ల డేటా ఉచితం, కొత్త జియో ఫోన్ రూ.1,999కే, ఆఫర్‌పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ (New JioPhone 2021 Offer) ప్రకటించింది, అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అంతే కాదు, ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ (Unlimited Voice calls) ఇస్తామని చెప్పింది.

WhatsApp's Privacy Policy: వాట్సప్, ఫేస్‌బుక్‌లకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు, వినియోగదారుల గోప్యత చాలా ముఖ్యం, నాలుగు వారాల్లో దీనిపై మీ స్పందన తెలపాలని ఆదేశాలు

Hazarath Reddy

సోషల్‌ మీడియా దిగ్గజాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీ కంపెనీ ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. ప్రజల గోప్యత అనేది చాలా ముఖ్యమైనది. దానిని కాపాడటం మా కర్తవ్యమంటూ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది.

FASTag Update: రేపటి నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి, ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు హైవేల‌పైకి..లేకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే, ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి (FASTag Update) రానుంది. ఇకపై వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే డబుల్ టోల్ చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి (FASTags Mandatory) వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచి దీన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

Farmers Protest: పాకిస్తాన్ - ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖా‌తాలను బ్లాక్ చేయండి, ట్విట్టర్‌కు నోటీసులు పంపిన కేంద్ర ప్రభుత్వం, 1,178 అకౌంట్ల నుంచి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ట్వీట్లు వస్తున్నాయంటూ ఆగ్రహం

Hazarath Reddy

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతు ఆందోళన (Farmers Protest) నేపథ్యంలో సోషల్‌ మీడియాపై గుర్రుగా ఉన్న కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రా‍క్టర్‌ ర్యాలీలో హింస తరువాత ట్విటర్‌ ఖాతాలపై మరింత కన్నేసిన సర్కార్‌ ఖలీస్తాన్ సానుభూతి పరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు తాజాగా నోటీసు ఇచ్చింది.

Advertisement

Telegram: వాట్సాప్‌కు చుక్కలు చూపిస్తున్న టెలిగ్రాం, డౌన్‌లోడ్ల పరంగా తొమ్మిది నుంచి నంబర్ వన్ స్థానంలోకి యాప్, వాట్స్‌యాప్‌ను భారీగా దెబ్బ కొట్టిన ప్రైవసీ పాలసీ

Hazarath Reddy

నిన్నమొన్నటి దాకా టాప్ లో దూసుకుపోతున్న వాట్సాప్‌ కు టెలిగ్రాం (Telegram) షాకిచ్చింది. యూజర్లపై ప్రైవసీ పాలసీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ వాట్సాప్ పై (WhatsApp) విమర్శలు వచ్చిన నేపథ్యంలో అందరూ టెలిగ్రామ్‌ బాట పట్టారు.

Airtel 5G Netowrk: జియోకి భారీ షాక్, 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఎయిర్‌టెల్, ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ కు మరో దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ భారీ షాక్ ఇచ్చింది. జియో కంటే ముందుగానే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించించింది. ఈ ప్రయోగంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది.

Budget 2021: సెస్ అంటే ఏమిటి..పెరిగే ధరలు, తగ్గే ధరలు ఏంటో తెలుసా, మద్యం కొనాలంటే ఇక చుక్కలే, ముబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం, సెస్ ద్వారా రూ. 30 వేల కోట్ల ఆదాయం, పెరిగే తగ్గే వాటిపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ పై (Budget 2021) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సెస్‌ అంశం కలవరపెడుతోంది.

WhatsApp New Feature: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్, ఇకపై వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావచ్చు, ఫేస్‌బుక్ ఆటోమేటిక్ లాగౌట్

Hazarath Reddy

ఇన్ స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ ( WhatsApp New Feature) తీసుకురాబోతుంది.

Advertisement

59 Chinese Apps Banned: చైనా యాప్‌లకు భారీ షాక్, టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై శాశ్వత నిషేధం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద వీటిపై నిషేదం

Hazarath Reddy

చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరోసారి కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం (59 Chinese Apps Banne) విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గ‌తేడాది జూన్‌లో వీటిపై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించ‌గా.. ఇప్పుడు వాటిని శాశ్వ‌త నిషేధం దిశగా కేంద్రం తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Digital India Sale: రిలయన్స్ అదిరే ఆఫర్లు, డిజిటల్‌ ఇండియా సేల్‌’’ పేరుతో రిపబ్లిక్ డే సేల్ ప్రకటించిన రిలయన్స్, ఈ నెల 26 వరకు అందుబాటులో..

Hazarath Reddy

రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘‘డిజిటల్‌ ఇండియా సేల్‌’’ (Digital India Sale) పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులపై లభించే ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటాయి.

Xiaomi Republic Day Sale: షియోమి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, జనవరి 20 నుండి జనవరి 24 వరకు రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించిన చైనా దిగ్గజం

Hazarath Reddy

ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్ ‌ప్రకటించింది. ప్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ లాంటి దిగ్గజాలకు పోటీగా షియోమి (Xiaomi) కూడా రిపబ్లిక్ డే సేల్‌ను (Xiaomi Republic Day Sale) ప్రకటించింది.

IT Summons to Facebook&Twitter: ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం భారీ షాక్, ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు జారీ

Hazarath Reddy

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, నివారణపై చర్చించడానికి ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సీరియస్ అయింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు (IT Summons to Facebook&Twitter) జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement
Advertisement