తాజా వార్తలు

Om Prakash Chautala Dies: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా తన 89వ ఏట మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు మరియు చౌదరి దేవి లాల్ జీ యొక్క పనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అతని కుటుంబ సభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Om Prakash Chautala Dies: గుండెపోటుతో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి.

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ వచ్చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ చాలా తప్పుడు పద్ధతులని, వీటి వల్ల సమాజం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ కావడానికి ప్రమాదకర స్టంట్లు, గచ్చిబౌలిలో షాకింగ్ స్టంట్...వీడియో ఇదిగో

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు యువకులు. గచ్చిబౌలి వైపు ORR వద్ద గురువారం రోజు రాత్రి ఓ యువకుడు ప్రయాణం చేస్తున్న కారులో నుండి బయటకు వచ్చి ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Formula E Case Updates: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం...తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ, FIR కాపీతో పాటు నగదు బదిలీ వివరాలను అడిగిన ఈడీ

Arun Charagonda

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరింది ఈడీ. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని...అలాగే ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది ఈడీ.

Uttar Pradesh: యూపీలో బస్తీ రైల్వేస్టేషన్లో తెరుచుకోని రైలు తలుపులు, రాళ్లతో కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు వెళ్లిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల బృందం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ తలుపులు లాక్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూపిస్తుంది. వైరల్ క్లిప్‌లో, కోపంతో ఉన్న ప్రయాణీకులు రైలు ప్రవేశ ద్వారం అద్దాలు పగలగొట్టడానికి రాళ్లను ఉపయోగించడం చూడవచ్చు

Advertisement

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్

Arun Charagonda

తిరుమల శ్రీవారిని గురువారం శ్రీనివాస్ గౌడ్ దర్శించుకునన్ సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు..గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

Surat Bank Robbery: బ్యాంకు గోడ పగులగొట్టి రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, ఘటనా స్థలంలో దోసకాయ, ఆపిల్ ముక్కలు, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సూరత్‌లోని కిమ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలోడ్ శాఖలో బ్యాంక్ లాకర్ గదిని, మార్బుల్ పాలిషింగ్ యూనిట్‌ను వేరు చేసే గోడకు రంధ్రం చేసి దొంగలు INR 40.36 లక్షల విలువైన నగదు, ఆభరణాలను దోచుకున్నారు.

Dead Body In Parcel: ఆర్థిక సాయం కోసం అప్లై చేస్తే డెడ్ బాడీ వచ్చింది... ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం, భయాందోళనకు గురైన స్థానికులు..వీడియో

Arun Charagonda

పశ్చిమగోదావరి - యండగండిలో పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు.

Mufasa: The Lion King Telugu Review: ముఫాసాః ది లయన్ కింగ్ తెలుగు రివ్యూ ఇదిగో, సినిమాను పైకి లేపిన మహేష్ బాబు వాయిస్‌తో పాటు ఇతర నటుల వాయిస్, ఎలా ఉందంటే..

Hazarath Reddy

ది లయన్ కింగ్ కు హీరో నాని డబ్బింగ్ చెప్పడం కూడా ఇంకా క్యూరియాసిటిని రేపింది. ఇంకా తెలుగు నటులు బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు,సత్యదేవ్, అయ్యప్ప శర్మ, ఆర్.సి.ఎం రాజు వంటి వారు ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఇది చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి

Advertisement

KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు

Arun Charagonda

ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.

Hyderabad: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు...సికింద్రాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై దాడులు, హోటళ్లపై కేసులు నమోదు

Arun Charagonda

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని హోటళ్ళపై కేసులు నమోదు చేశారు.

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా- ఈ రేస్ అంశం కుదిపేసింది.ఈ అంశంపై వెంటనే సభలో చర్చ నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

CIU On Formula E Race Case: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ వ్యవహారంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్ ఏర్పాటు, పలు శాఖల నుండి కీలక ఫైల్స్ తెప్పించుకుని విచారించనున్న ఏసీబీ

Arun Charagonda

ఫార్ములా ఈ-కార్ రేస్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ( CIU) ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోండగా ఇవాళ HMDA తో పాటు పలు శాఖల నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకొనుంది ఏసీబీ.

Advertisement

Delhi: అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి...పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన, అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..వీడియో

Arun Charagonda

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

Lagacharla Farmers: సంగారెడ్డి జైలు నుండి లగచర్ల రైతులు రిలీజ్, 37 రోజుల తర్వాత బెయిల్..కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు, వీడియో ఇదిగో

Arun Charagonda

37 రోజుల తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు లగచర్ల రైతులు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై పోలీసులు రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేయగా రైతులకు స్వాగతం పలికారు గిరిజన సంఘాల నేతలు.

CM Revanth Reddy: గెలిచిన వారు రాసుకున్నదే చరిత్ర కాదు...వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కవులు ముందుకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభం

Arun Charagonda

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Fire Accident in Jaipur: సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను ఢీకొట్టిన ట్రక్కు.. పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం మరో 35 మందికి గాయాలు.. జైపూర్ లో ఘటన (వీడియో)

Rudra

రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది.

Advertisement
Advertisement