తాజా వార్తలు

‘War 2’ OTT Release Date: అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో వార్ 2 స్ట్రీమింగ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి..

Team Latestly

వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.

Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో భారత వ్యాపారిని గన్‌తో తలపై కాల్చి చంపిన దుండగుడు

Team Latestly

అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.

Nobel Prize in Physics 2025 Winners: ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి, ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు అవార్డు

Team Latestly

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్. దేవరేట్‌, జాన్ ఎం. మార్టినిస్‌లకు సంయుక్తంగా అవార్డు ప్రకటించబడింది. వారు ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు పొందారు.

Crocodile Drags Woman Into River: వీడియో ఇదిగో, నదిలో బట్టలు ఉతుక్కుంటున్న మహిళను లాక్కెళ్లిన మొసలి, ఎంత భయంకరంగా ఉందంటే..

Team Latestly

ఒడిశాలో ఖరాస్రోటా నదీ తీరం వద్ద శనివారం ఒక భయంకర సంఘటన వెలుగుచూసింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో, నదీ తీరానికి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన 55 ఏళ్ల సౌదామినీ మహాలా అనే మహిళపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. మహిళను నోట కరిచి, ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ దారుణం స్థానికులను షాక్‌కి గురిచేసింది.

Advertisement

Bihar Assembly Elections 2025 Date: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, రెండు దశల్లో పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు, మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు

Team Latestly

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశంలో, నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.

Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న ఇద్దరు వ్యక్తులు, బిత్తరపోయి చూస్తుండిపోయిన ఇతర ప్రయాణికులు

Team Latestly

ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు ఘోరంగా తన్నుకున్న వీడియో వైరల్ అవుతోంది. అనుచిత మాటలతో ఇద్దరూ ఘర్షణ పడిన వీడియో కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన 23 సెకన్ల వీడియోను ఘర్ కే కలేష్ అనే వ్యక్తి X (మునుపటి ట్విట్టర్) లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.

Khandwa Tragedy: దుర్గామాత నిమ‌జ్జ‌నం కోసం వెళుతుండగా చంబాల్ న‌దిలో పడిపోయిన ట్రాక్టర్, ఊపిరాడక 16 మంది మృతి, వీడియో ఇదిగో..

Team Latestly

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జన వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంబాల్ నదిలో దుర్గామాత నిమజ్జనం కోసం భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు.

Sudden Death in Sitapur: షాకింగ్ వీడియో ఇదిగో, ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో డ్రమ్స్ వాయిస్తూ కుప్పకూలి పడిపోయిన కార్యకర్త, చికిత్స పొందుతూ మృతి

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో విషాదకరమైన సంఘటన జరిగింది. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన మార్చ్‌లో ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త డ్రమ్ వాయిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అంకిత్ సింగ్ అనే స్వచ్ఛంద సేవకుడు డ్రమ్స్ వాయిస్తుండగా అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోయి కుప్పకూలి పడిపోయాడు,

Advertisement

Realme 15x 5G Launched in India: రియల్‌మీ 15x 5G భారత మార్కెట్లో విడుదల, 7,000mAh బ్యాటరీతో పాటు 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా, ధర ఎంతంటే..

Team Latestly

ప్రముఖ చైనా దిగ్గజం రియల్ మీ తన తాజా స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 15x 5G ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 7,000mAh బ్యాటరీతో వస్తుంది, అది 60W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కెమెరా వ్యవస్థలో 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వినియోగదారుకు స్పష్టమైన, ప్రొఫెషనల్-క్వాలిటీ ఫోటోలు, సెల్ఫీలు అందించేలా డిజైన్ చేశారు.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతి వేగంగా వెళుతూ ట్రక్కును ఢీకొట్టిన కారు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్న నివేదికలు

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు, వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్యాన్సర్‌తో మరణించిన స్థానిక మహిళ భర్త చితాభస్మ నిమజ్జనం కోసం బాధితులు హరిద్వార్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.

Bomb Threat: ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధింపు

Hazarath Reddy

సెప్టెంబర్ 30, మంగళవారం ఉదయం ముంబై నుండి దేశ రాజధానికి వెళ్తున్న ఇండిగో విమానం 6E 762 లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు PTI నివేదించింది. సెప్టెంబర్ 30, 2025న ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం 6E 762 లో భద్రతా బెదిరింపు కనిపించింది.

Advertisement

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

PM Modi’s ‘Operation Sindoor’ Post: ఆసియా కప్ విజేతగా భారత్, ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Team Latestly

ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మీడియా పోస్ట్‌లో "ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ కేంద్ర సైనిక చర్యతో సరిపోల్చి, క్రికెటర్లు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అది సుమారు 1,07,000 రీట్వీట్‌లు, 25 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు పొందింది.

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఎస్సార్‌నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ప్రయాణికులు సేఫ్, మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం

Team Latestly

హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్‌ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Advertisement

Bengaluru: బెంగుళూరులో దారుణం, చీరలు చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టిన షాపు యజమాని, మహిళతో పాటు యజమానికి కూడా అరెస్ట్

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాప్‌లో చీరలు దొంగిలించిందని ఆరోపణతో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. మాయా సిల్క్స్‌ శారీస్ అనే దుకాణంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు రూ.91,500 విలువైన 61 చీరలను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

Team Latestly

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Kidnapping Caught on Camera: వీడియో ఇదిగో.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్,తమిళనాడులోని వెల్లూరులో సంఘటన, మొత్తం దృశ్యం CCTVలో రికార్ట్

Team Latestly

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని గుడియాతం ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 ఏళ్ల బాలుడిని ఇంటి బయట నుంచి అపహరించారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీడియో ఫుటేజ్ ప్రకారం, కర్ణాటక లైసెన్స్ ప్లేట్ ఉన్న కారు నుండి హెల్మెట్ ధరించిన యువకుడు దిగాడు.

OG Fans Chaos: పవన్ ఫ్యాన్స్ రచ్చ.. ‘OG' సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు, బెంగళూరులో KR పురంలో ఘటన , షో నిలిపివేత

Team Latestly

బెంగళూరులోని KR పురం థియేటర్లో ‘OG’ సినిమా ప్రీమియర్ షోలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో షో చూడటానికి వచ్చారు. అయితే షో ప్రారంభానికి ముందు కొంత మంది అభిమానులు తగిన నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. కొంతమంది కత్తులతో స్క్రీన్‌ను చింపేయడంతో థియేటర్ యాజమాన్యం షోను నిలిపివేయవలసి వచ్చింది.

Advertisement
Advertisement