సమాచారం

Unlock 3: నేటి నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లు ఓపెన్, పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, మాస్క్‌ తప్పనిసరి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా సెంటర్లు, జిమ్‌లు(Yoga Institutes and Gyms) మూతపడ్డాయి. అన్‌లాక్‌ 3.0లో (Unlock 3) భాగంగా వీటిని తిరిగి ఈ నెల 3 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం (Central) అనుమతిచ్చింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్‌ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్‌ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించింది.

Singh Rajput Death Case: సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్

Hazarath Reddy

బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య (Singh Rajput Death Case) ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల (Maharashtra vs Bihar Govt) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఖండించారు.

Ram Temple Invitation Card: భూమి పూజ ఇన్విటేషన్ కార్డ్ పస్ట్ లుక్ ఇదే, విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్, ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ

Hazarath Reddy

అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ (Ram Temple 'Bhoomi Pujan' Invitation Card) అయింది. కాషాయం రంగులో ఉన్న ఈ కార్డుపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ (Ram Temple 'Bhoomi Pujan') నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్ (Mohan Bhagwat) పేరుంది.

Microsoft Plan to Buy TikTok: టిక్‌టాక్‌పై మైక్రోసాఫ్ట్‌ కన్ను, అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు పావులు, ట్రంప్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం

Hazarath Reddy

చైనా వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు సంబంధించిన అమెరికా హక్కులు సొంతం (Microsoft Plan to Buy TikTok) చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ధ్రువీకరించింది. సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో (ByteDance) ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Advertisement

International Flights Suspended: అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ు రద్దు, ఆగస్టు 31 వరకు పొడిగించిన పౌర విమానయాన శాఖ, దేశంలో నాలుగు నగరాల పరిస్థితి ఆందోళనకరమన్న ఆరోగ్యమంత్రి

Hazarath Reddy

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని (International Flights Suspended) కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. క‌రోనా ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి భార‌త పౌర‌విమాన‌యాన శాఖ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై (International Commercial Passenger Flights) నిషేధాన్ని విడ‌త‌ల వారీగా పొడిగిస్తూ వ‌స్తున్న‌ది. చివ‌రిసారిగా జూలై 15 నుంచి 31 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. శుక్ర‌వారం నాటికి ఆ గడువు కూడా ముగియ‌డంతో ఏకంగా మ‌రో నెల రోజుల‌పాటు నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. అంతర్జాతీయ విమానాల సర్వీసుల రద్దు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (DGCA) శుక్రవారం ప్రకటించింది.

Rain Alert in Telugu States: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, ఆగస్టు 4న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం, వెల్లడించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రానున్న‌ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Rain Alert in Telugu States) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు.

SC Bans BS-IV Vehicles Registration: బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లకు ఆదేశాలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కాలంలో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు (SC Bans BS-IV Vehicles Registration) వేసింది. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. కరోనా లాక్​డౌన్​ సమయంలోనూ బీఎస్​-4 వాహనాల అమ్మకాలు (BS-IV Vehicles Solds) జరగడంపై సుప్రీంకోర్టుమండిపడింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం (Supreme Court) ఆదేశించింది.

LAC Face-Off: చైనాపై ఇండియా డేగ కన్ను, సరిహద్దుల్లో 35 వేల మందితో పహరా, ఇంకా ఫలితం తేలని ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు

Hazarath Reddy

పొరుగుదేశం చైనాతో ఇండియా జరుపుతున్న చర్చలు (LAC Face-Off) ఫలితం వచ్చే దిశగా కనపడటం లేదు. అందుకని ఇండియా ముందే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని ( India to add 35000 troops along China border) భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ( ladakh lac face off) ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్‌ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడంతో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోంది. చైనా ఏ మాత్రం నమ్మదగినది కాకపోవడంతో సరిహద్దులో అప్రమత్తమవుతోంది.

Advertisement

August Bank Holidays: ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, మొదటి మూడు రోజులు బ్యాంకులకు సెలవులే, లిస్ట్ మొత్తం ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఈ రోజుతో జూలై నెల ముగిసిపోతుంది. రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల అయినా డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది బ్యాంకు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆ నెలల బ్యాంకు సెలవులు (August Bank Holidays) ఏముంటాయో తెలుసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో కూడా బ్యాంకు సెలవులు (August 2020 Holidays) ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాల ప్రకారం ఆగస్ట్‌ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి.

Unlock 3 Guidelines: బార్లకు నో పర్మిషన్, ఆగస్టు 31 వరకు విద్యా సంస్థల మూసివేత, రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఎత్తివేత, అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

Hazarath Reddy

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో (Containment Zone) ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ (Coronavirus lockdown) ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్-3 (Unlock 3) మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది.

Rafale Fighters: రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా

Hazarath Reddy

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు (Rafale Fighter Aircrafts) కాస్సేపట్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఇవి ల్యాండ్ కాబోతున్నాయి. రాఫెల్‌ ల్యాండింగ్ కోసం భారత్ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ (Ambala airbase) వద్ద రఫాలే ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' (Water Salute ) ఇవ్వబడుతుంది.

Rajasthan Political Crisis: గుజరాత్‌, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం గుజరాత్ ను తాకింది. బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు (Congress workers) గాంధీనగర్‌లోని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌ కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన (Gujrath Congress protest) ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా (Gujarat Congress president Amit Chavda), ప్రతిపక్ష నేత పరేశ్ ధానాని (Paresh Dhanani) సహా దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

APJ Abdul Kalam Death Anniversary: ఏ.పి.జె.అబ్దుల్ కలాం 5వ వర్థంతి, ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, స్ఫూర్తినిచ్చే కొటేషన్లు మీకోసం

Hazarath Reddy

నేడు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీబీ అబ్దుల్ కలాం 5వ వర్ధంతి. ఆయన వర్థంతి (APJ Abdul Kalam 5th Death Anniversary) సంధర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా హోం మంత్రి అమిత్ షా (Amit Shah) , రవిశకంర్ ప్రసాద్, రాష్ట్రపతి, బిజెపి పార్టీ ఇలా పలువురు ఆయనకు నివాళి అర్పించారు. అబ్దుల్ కలాం జీవితం (APJ Abdul Kalam Biography) ఎంతో మందికి స్ఫూర్తి. ఇక ఆయన ప్రసంగాలు (Abdul Kalam Most Inspirational Messages) కుర్రాళ్లకు జీవిత పాఠాలు. అబ్దుల్ కలాం పేరు వింటే గుర్తొచ్చేవి స్ఫూర్తినిచ్చే ఆయన మాటలు. యువతలో ఆయన ప్రసంగాలకు, కొటేషన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

India Coronavirus: గుజరాత్‌లో మిస్టరీగా మారిన కరోనా మరణాలు, దేశంలో 14 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

భారత్‌లో కరోనావైరస్ కేసులు (India Coronavirus Pandemic), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు (COVID-19 Deaths) కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases) ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది.

Permanent Commission for Women Officers: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రక్షణ శాఖ

Hazarath Reddy

ఇండియన్ ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను (Permanent Commission for Women Officers) ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (SSC) కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు (Supreme court) చరిత్రాత్మక తీర్పు చెప్పిన సంగతి తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు, ఉపరితల ద్రోణికి నైరుతి రుతుపవనాలు తోడు, రానున్న రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

చత్తీస్‌ఘఢ్‌ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి నైరుతి రుతుపవనాల ప్రభావం (Southwest Monsoon) కూడా తోడయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Rains In Telugu States) కుండపోతగా వానలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States RainFall) గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

EC Defers By-polls in 7 States: ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా, కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్

Hazarath Reddy

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా (EC Defers By-polls in 7 States) వేసింది. కరోనా వైరస్‌, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప​ ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి.

Thyrocare Survey: భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్‌ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

భారత్‌లో 18 కోట్ల మందికి (18 crore Indians) కరోనా భయమే లేదు. దీనికి ప్రధాన కారణం వారంతా ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా (Thyrocare Survey) పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కోవిడ్-19 వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies Against Coronavirus) కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని సర్వే తెలియజేసింది.

India-China Border Tensions: చైనా మళ్లీ బరి తెగించింది, 40,000 మంది సైనికులని సరిహద్దుల్లో మోహరించింది, కఠిన పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపు

Hazarath Reddy

సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటూ చైనా ఓ పక్క చెబుతూనే మరోపక్క తన జిత్తులమారితనాన్ని బయటపెట్టుకుంటూ వస్తోంది. సరిహద్దుల నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరం చైనా బలగాలు వెనక్కి వెళ్లాయనే వార్తలు ఈ మధ్య వినిపించగా..అవి ఒట్టి పుకారులేనని తేలిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం తూర్పు లఢక్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి దాదాపు 40 వేల సైనిక దళాలను (40,000 Chinese Troops on Ladakh Front) మోహరించింది.

Gold Price: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు, తొలిసారిగా రూ.50 వేల మార్కుకు చేరుకున్న గోల్డ్, రూ. 60 వేలు దాటిన వెండి

Hazarath Reddy

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price) బుధవారం భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా (Gold Price Hits Rs 50,000) రూ. 50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది.

Advertisement
Advertisement