Information

Krishnapatnam Node Tenders: ఏపీలో పుంజుకోనున్న పారిశ్రామిక రంగం, కృష్ణపట్నం నోడ్‌ పనులకు టెండర్లు, సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు

Hazarath Reddy

ఏపీ పారిశ్రామిక విస్తరణలో భాగంగా బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (CBIC)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్‌ (Krishnapatnam Node) పనులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో రానున్న సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం (AP Govt) కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Corona Caller Tune: విసిగిస్తోన్న కరోనా కాలర్ ట్యూన్, కాలయాపన తప్ప మరేమి లేదంటూ నెటిజన్ల గగ్గోలు, కాలర్‌ ట్యూన్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

ఈ మధ్య మీరు గమనించారో లేదో ఎవరికైనా ఫోన్ చేస్తే మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల పాటు మీకు రింగ్ టోన్ (Corona Caller Tune) వినిపిస్తూ ఉంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ వినియోగదారులకు కోవిడ్‌ వైరస్‌ (COVID 19) వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్‌ ట్యూన్‌ ఇది.

Debit and Credit Cards Alert: డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి, లేకుంటే పనిచేయవు, మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వాడని కార్డులు పనిచేయవన్న ఆర్‌బిఐ

Hazarath Reddy

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? అయితే వాటిని వెంటనే ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఉపయోగించండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ కార్డులు (Credit And Debit Cards Alert) పని చేయవు.

Bird Flu In Kerala: కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్, 13 వేల కోళ్ల కాల్చివేతకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు, కరోనా మరచిపోకముందే వణికిస్తున్న మరో వ్యాధి, ఈ వ్యాధికి 2016లో వేలాది బాతులు మృత్యువాత

Hazarath Reddy

కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం (Bird Flu Scare Hits Kerala) రేగింది. కోజికోడ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు (Chickens) బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు.ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu In Kerala) సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.

Advertisement

'Signing Off': సోషల్ మీడియాకు సెలవు ప్రకటించిన ప్రధాని మోదీ, నా అకౌంట్లను 7 మంది మహిళలు రన్ చేస్తారని ట్విట్టర్ ద్వారా వెల్లడి, తొలి ట్వీట్ చేసిన స్నేహా మోహన్‌దాస్‌

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) అనుకున్నట్లుగానే మహిళా దినోత్సవం రొజున (International Women's Day 2020) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై (PM Modi To Quit Social Media) చెప్పారు. సామాజిక మాధ్యమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

International Women's Day 2020: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు, అసలు ఇది ఎలా పుట్టింది, ఉమెన్స్‌ డే పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day 2020). ఈ రోజుని ప్రత్యేకంగా మహిళలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 8న ఉమెన్స్ డేని (Women's day) సెలబ్రేట్ చేసుకుంటారు. గూగుల్ డూడుల్ (Google Doodle) కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఓ వీడియోని రూపొందించింది. అందులో ఘనంగా మహిళల గురించి చాటి చెప్పింది.

AP SSC Exams New Schedule: ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్పు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ (SSC Exams New Schedule) ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది.

YES Bank Reconstruction: యస్ బ్యాంకులో 49 శాతం వాటాల కొనుగులుకు ఎస్‌బిఐ బోర్టు ఆమోదం, ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి, మీడియాకు వెల్లడించిన ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్ కుమార్

Hazarath Reddy

యస్‌ సంక్షోభం (Yes Bank Crisis), ఆర్‌బీఐ డ్రాప్ట్‌ ప్లాన్ల (RBI Draft Plan) తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్ కుమార్ ( Chairman Rajnish Kumar) శనివారం ఉదయం మీడియాకు తెలిపారు. యస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ బోర్డు (SBI Board) సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్‌బీఐ వద్దకు చేరిందని తెలిపారు.

Advertisement

YES Bank Reconstruction Scheme: యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్, ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డు సస్పెండ్

Hazarath Reddy

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పునరుద్దరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడనుందనే సంకేతాలు కనిపిస్తుండటంతో కేంద్రం, ఆర్‌బిఐ యస్ బ్యాంకును గట్టెక్కించడానికి కావాల్సిన అన్ని రకాలు చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డును సస్పెండ్ చేసిన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంకు పునరుద్ధరణకు ఆ కొత్త ఓ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ బ్యాంకుపై మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ఈ సరికొత్త ప్లాన్ ను ఆర్‌బిఐ ప్రకటించింది.

Coronavirus In India: కాటేస్తున్న కరోనా, ఆరు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ మెసేజ్, ఇండియాలో 29కి చేరిన కరోనా కేసులు, సిక్కింలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన సిక్కిం సర్కారు

Hazarath Reddy

చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan In China) పుట్టిన కరోనా వైరస్ (Coronavirus) మన దేశానికి కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం (Central Government) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ (Union Health Minister Harsh Vardhan) ఆదేశాలు జారీ చేశారు.

Justice S Muralidhar: బదిలీ గురించి ముందే తెలుసు, వివరణ ఇచ్చిన జస్టిస్ మురళీధర్, ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మురళీధర్ వీడ్కోలు సభ, హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు

Hazarath Reddy

జస్టిస్ మురళీధర్ (Justice S Muralidhar)...ఈ పేరు ఈ మధ్య వినే ఉంటారు. ఢిల్లీ అల్లర్లకు (Delhi Violence) కారణమైన విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారంటూ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కొలీజియం సిఫారసు చేసింది. ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇచ్చారు.

EPFO Interest Rate: పీఎఫ్ వడ్డీ రేట్లపై కోత, షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం, 6 కోట్ల మంది ఖాతాదారులపై ప్రభావం, ఇప్పుడు వడ్డీ రేటు 8.50 శాతం మాత్రమే

Hazarath Reddy

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు ఇది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై (EPFO Interest Rate) కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సం

Advertisement

COVID-19 Alert: కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు మేలంటున్న డాక్టర్లు

Hazarath Reddy

ఇప్పుడు ప్రపంచాన్ని కరోనావైరస్ (Coronavirus) పట్టి పీడిస్తోంది. జాగ్రత్తగా లేకుంటే అది మన ప్రాణాలనే హరించి వేయవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని మన నుండి తరిమేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు (COVID 19 Virus Alert) పాటించడం మంచిదంటున్నారు డాక్టర్లు. కరోనా వైరస్‌ (COVID-19) వ్యాప్తి, లక్షణాలు (COVID-19 Symptoms) , నివారణ చర్యలపై ప్రత్యేక కథనం ఇస్తున్నాం.

COVID-19 In India: ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్, షాక్‌కు గురయిన ఎయిమ్స్ వైద్యులు, ఆఘమేఘాల మీద ఐటీబీపీ కేంద్రానికి తరలింపు

Hazarath Reddy

చైనాలోని (China) వుహాన్‌లో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 (Coronavirus) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప‍్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్‌లను గుర్తించగా ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇటలీ దేశం నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిన 15 మంది పర్యాటకులకు కరోనా వైరస్ పాజిటివ్ (Coronavirus Outbreak) అని పరీక్షల్లో తేలడం సంచలనం రేపింది. 15 మంది ఇటాలియన్ టూరిస్టులకు (15 Italian Tourists) కరోనా వైరస్ సోకిందని బుధవారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు ప్రకటించారు.

Stand Up India Scheme: మహిళలకు రూ.17 వేల కోట్ల రుణాలు, ‘స్టాండప్‌ ఇండియా’ పథకం కింద గత నాలుగేళ్లలో రుణాలు, ఆరుపథకాలతో మహిళలు ఉన్నతంగా ఎదిగారని తెలిపిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మహిళలు (Womens) ఓ ఆర్థిక శక్తిగా ఎదిగారని ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance ministry) తెలిపింది. ఇందులో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిన ఆరు పథకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా మహిళలు ఉన్నతంగా ఎదిగారని ఆర్థిక శాఖ తెలిపింది.

IMD Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ ఎండలు కాస్తాయన్న వాతావరణ శాఖ, భూతాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే కారణం

Hazarath Reddy

భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూతాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే (Weather Forecast) దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

Advertisement

Godavari-Cauvery Link Project: గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి రూ.60 వేల కోట్లు అవసరం, ప్రతిపాదనను పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఎన్ఐటీ 6వ స్నాతకోత్సవంలో మంత్రి గడ్కరీ వెల్లడి

Hazarath Reddy

గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి (Godavari-Cauvery Link Project) రూ.60వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గోదావరి నదిలో నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న 1200 టీఎంసీల నీటిని ఈ రెండు నదుల అనుసంధానంతో (River-Linking project) సాగు అవసరాలకు మళ్లించుకోవచ్చని మంత్రి తెలిపారు. పుదుచ్చేరిలోని ఎన్ఐటీ 6వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు

Hazarath Reddy

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.

Leap Day 2020: లీపు సంవత్సరంలో లీపు రోజు, నాలుగేళ్లకు ఒకసారి ఎందుకు వస్తుంది?, అసలు దీని చరిత్ర ఏమిటీ?, ఎవరు దీనిని ప్రవేశపెట్టారు, ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

ఒక కాలెండరు సంవత్సరంలో (Year) అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల (Month) గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం (Leap Year) అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి (Calender Year) వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. ఇక ఫిబ్రవరి 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం లీపు సంవత్సరం లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వస్తుంది.లీప్ రోజుగా (Leap Day 2020) ఫిబ్రవరి 29ని పిలుస్తారు.ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి.

Petrol Price: పెట్రో బాదుడు షురూ, ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, మార్చి 1 నుంచి కొత్త ఇంధనం సప్లై

Hazarath Reddy

వాహనదారులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price) పెరగనున్నాయి. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికి కారణం BS-6 ఇంధనం. ప్రస్తుతం యూరో -4 లేదా భారత్ స్టేజ్ (BS-6) ఇంధానాన్ని వాడుతున్నాం. BS-6 వాహనాలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి BS-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగించడం జరుగుతోంది. కానీ కాలుష్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో నరేంద్ర మోదీ సర్కార్ ఏప్రిల్ 01 నుంచి దేశ వ్యాప్తంగా BS - 6 ఇంధనాన్ని అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement