Information

RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

Free Drop Service For Women: రాత్రి 10 దాటితే ఉచితంగా డ్రాప్ సర్వీసు, అత్యాచార ఘటనల నేపథ్యంలో కర్ణాటకలోని గదగ్ పోలీసులు కీలక నిర్ణయం, మహిళలు రాత్రి పది దాటితే హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేయండి, వివరాలు వెల్లడించిన గదగ్ ఎస్పీ శ్రీనాథ్ జోషి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతోన్న దాడులు, అత్యాచారాల ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో దిశ రేప్ అండ్ మర్డర్ కేసు( Disha murder case), ఉన్నావ్ బాధితురాలి సజీవ దహనం (Unnao Rape Case) కేసులతో దేశంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. మహిళలకు రక్షణ (Women's Protection) ఎక్కడ అంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Delhi Fire Incident: ఢిల్లీ అగ్ని ప్రమాదం, బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు అదేశాలు

Hazarath Reddy

ఢిల్లీ(Delhi)లోని అనాజ్ మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం(Delhi Fire Incident)లో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) సందర్శించారు.

Father Of The Year: ఈ తండ్రి రియల్ హీరో, కూతుర్ల చదువు కోసం రోజూ 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు, బడి చివరి గంట కొట్టే వరకు అక్కడే ఉంటాడు, బాంబుల మోత మోగే ఆప్ఘనిస్తాన్‌లోని మియా ఖాన్ గురించి తెలిస్తే ఆయనకు సెల్యూట్ చేస్తారు

Hazarath Reddy

ఆప్ఘనిస్తాన్..ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కడ నిత్యం ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. అలాంటవి చోట ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్ల కోసం పడుతున్న కష్టాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ఆశ్చర్యపోవడమే కాదు ఆయనకు సెల్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది.

Advertisement

Flipkart Bumper Offer: విద్యార్థులకు బంపర్ ఆఫర్‌, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ పూర్తిగా ఉచితం, ఉత్పత్తులు ఉచితంగా వేగవంతమైన డెలివరీ, ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) విద్యార్థు(Students)లకు బంపర్ ఆఫర్‌(Flipkart Stunning Offer)ను ప్రకటించింది. తన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌(Flipkart Plus Membership)ను స్టూడెంట్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. వయస్సుతో సంబంధం లేదు. విద్యార్థి అయితే చాలు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు.

Jio New Plan: జియో రూ.1776 ప్లాన్ వచ్చేసింది, 336 రోజుల వాలిడిటీ, ఒక ప్లాన్ పూర్తి కాగానే మరో ప్లాన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్, అలాగే కొత్త ప్లాన్ల గురించి కూడా తెలుసుకోండి

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నూతన ప్లాన్ రూ. 1776 (Jio Rs 1,776 All-in-One plan)ను తాజాగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Cyclone Pawan Alert: వణికిస్తున్న అరేబియా మహాసముద్రం, పవన్ తుఫాను స్టార్టయింది. ఇప్పటికే మహా, క్యార్‌ తుఫాన్లతో జనజీవనం అతలాకుతలం, ఇండియాకు పవన్ సైక్లోన్ వల్ల అంత ప్రమాదం లేదంటున్న వాతావరణ శాఖ అధికారులు

Hazarath Reddy

తుఫాన్లు తమ స్థావరాన్ని మార్చుకున్నాయి. ఇప్పటిదాకా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడేవి. అయితే ఈ సారి అలా కాకుండా అరేబియా సముద్రం(Arabian Sea)లో అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి అరేబియాలో ఆఫ్రికా తీరంలో ‘పవన్‌’ తుఫాన్‌ (Cyclone pawan) కొనసాగుతుండగా, కర్ణాటక (Karnataka) తీరానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.

Jasmine Flowers: కిలో మల్లెపూలు కావాలంటే రూ.3 వేలు చెల్లించాలి, వర్షాల దెబ్బకు అమాంతంగా పెరిగిన మల్లెపూల ధరలు, తమిళనాడులో సామాన్యులకు తప్పని ఇబ్బందులు

Hazarath Reddy

ఆయా సీజన్ కు అనుకూలంగా పండ్లు, పూలకు గిరాకీ ఉంటుంది. గిరాకీ తగ్గట్టుగానే ధర కూడా ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం మల్లెపూల ధర ఊహించని రీతిలో భారీగా పెరిగింది. వందల్లో కాదు ఏకంగా వేలల్లో పెరిగింది. కిలో మల్లెపూల ధర ఏకంగా రూ. 3వేల రూపాయలకు చేరింది.

Advertisement

Telugu Girl Wins RS.53 Lakh Scholarship: తెలుగు రాష్ట్ర విద్యార్థినికి అరుదైన అవకాశం, రూ.53 లక్షల ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్ గెలుచుకున్న స్రష్టవాణి కొల్లి, ఆస్ట్రేలియాలో ఉచితంగా న్యాయవాద విద్యను అభ్యసించనున్న తెలంగాణా అమ్మాయి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రానికి చెందిన న్యాయవాద విద్యార్థిని అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. విదేశాల్లో ఉచితంగా న్యాయవాద విద్యను అభ్యసించే అవకాశాన్ని అందిపుచుకున్నారు. ఆస్ట్రేలియా(Australia)లోని వోలాంగాంగ్ యూనివర్సిటీ(University of Wollongong)లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు తెలంగాణా(Telangana) రాష్ట్రానికి చెందిన స్రష్టవాణి కొల్లి ఎంపికైంది.

HDFC Bank Network Down: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్‌వర్క్ డౌన్, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్‌‌లో సాంకేతిక సమస్యలు, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్న కస్టమర్లు, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపిన బ్యాంక్

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కస్టమర్లు (HDFC Bank Ltd customers) సమస్యలు ఎదుర్కొంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నెట్‌ బ్యాంకింగ్‌(HDFC Net Banking), మొబైల్‌ యాప్ (HDFC Mobile App)ల్లో 24 గంటలుగా వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

Chandrayaan-2: విక్రమ్ ల్యాండర్ ఇదిగో.. ఇక్కడే ల్యాండ్ అవుతూ క్రాష్ అయింది, శకలాలను కనిపెట్టిన నాసా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది కూడా ఇండియన్ శాస్త్రవేత్తే..

Hazarath Reddy

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ విక్రమ్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా పడినట్లు గుర్తించింది.

Tamil Nadu Rains: తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు, నాలుగు భవనాలు కూలి 15 మంది మృతి, శిథిలాల కింద మరికొందరు, కొనసాగుతున్న సహాయక చర్యలు, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

తమిళనాడు(Tamil Nadu)ను భారీ వర్షాలు(Heavy Rains HIt Tamil Nadu) వణికిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. భారీ వర్షాలకు తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నాలుగు భవనాలు కూలి (Four houses collapsed)15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Heavy Rain Alert: తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు, మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, మధురైలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల పలు చోట్ల స్వల్ప ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో వికలాంగరాలితో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. తంజావూర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో గోడ కూలి మీద పడటంతో దురైకన్ను అనే వ్యక్తి మృతి చెందాడు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు(Warning for fishermen) జారీ చేశారు.

Google Pay Good News: గూగుల్ పే వాడేవారికి శుభవార్త, యూజర్లు గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ (Google) తన గూగుల్ పే(Google Pay) కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.

Rajnath Singh: పాకిస్తాన్‌కు దక్కేది ఓటమే, 1848 నుంచే ఆ దేశానికి తెలుసు, పరోక్ష యుద్ధంలోనూ దాయాది దేశంకు పరాజయం తప్పదన్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Hazarath Reddy

గత కొంత కాలం నుంచి దాయాది దేశం(Pakistan) మనదేశం మీద ఆగ్రహంతో ఉన్న సంగతి విదితమే. ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత పాకిస్తాన్ మరింత కోపంతో రగిలిపోతోంది. ఎప్పుడు దాడులు చేద్దామా అని కాచుకూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence Minister Rajnath Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Dog Turns Into A Tiger: పులిలా మారిన కుక్క, పరారవుతున్న కోతులు, ఇదంతా తోటను రక్షించుకోవడానికే అంటున్న కర్ణాటక రైతు, ఆయన బాటలో పయనిస్తున్న మరికొందరు రైతులు

Hazarath Reddy

ఈ ఫోటోలో కనిపిస్తున్నది పులి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది ఓ కుక్క..మరి దీనికి పులి చర్మం ఉంది ఏంటి అనుకుంటున్నారా..అయితే అక్కడే ఓ ట్విస్టు ఉంది. ఓ రైతు తన పెంపుడు కుక్కని ఇలా పెద్దపులి(Dogs painted as tigers )లా తయారు చేశాడు. అయితే ఆ రైతు(Farmer) ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి.

Advertisement

UP Govt School English Teacher: పేరుకే ఇంగ్లీష్ టీచర్, రెండు ముక్కలు ఇంగ్లీష్ చదవడం రాదు, బిత్తరపోయి వెంటనే సస్పెండ్ చేసిన అధికారులు, ఉత్తరప్రదేశ్‌లో ఘటన

Hazarath Reddy

దేశంలో ప్రభుత్వ స్కూళ్లలో (government schools) విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం కొంత అయితే టీచర్ల వైఫల్యం మరికొంత అని చెప్పవచ్చు. అడ్డదారిలో జాబు తెచ్చుకున్న కొంతమంది టీచర్లు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు.

Mobile Tariff Hike: యూజర్లకు టెల్కోల షాక్, డిసెంబర్ నుంచి మొబైల్ కాల్ రేట్స్ భారీగా పెంపు, ట్రాయ్ టెలికాం విభాగాల మధ్య విఫలమైన చర్చలు

Hazarath Reddy

డిసెంబర్ నుంచి మొబైల్ వినియోగదారులకు చుక్కలు కనపడనున్నాయి. మొబైల్‌ కాల్‌ చార్జీ ధరలు (Mobile Call Tariffs Hike) భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు డిసెంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల (Users) జేబులు గుల్ల కానున్నాయి.

VoWi-Fi Calls: నెట్‌వర్క్‌తో పనిలేకుండా ఉచిత కాల్స్, వోవైఫై కాలింగ్ సపోర్ట్‌ను తీసుకువచ్చిన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఎలా వాడాలో తెలుసుకోండి ?

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో(Bharti Airtel, Reliance Jio)లు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ రెండు కంపెనీల యూజర్లు సిగ్నల్ అవసరం లేకుండానే ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

‘Aye Watan’ On Russian Cadets Lips: రష్యా సైనికులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఇండియా దేశభక్తి గీతం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న మహమ్మద్ రఫీ హామ్‌కో తేరి కసం సాంగ్, 1965లో వచ్చిన షహీద్ మూవీని ఆలపించిన రష్యన్ మిలిటరీ

Hazarath Reddy

అలనాటి బాలీవుడ్ మధుర గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆయన పాడిన దేశభక్తి గీతం Ae watan, ae watan, hamko teri kasam సాంగ్ అప్పడూ ఎప్పుడూ ఆణిముత్యమే. 1965లో వచ్చిన బాలీవుడ్ మూవీ Shaheedలో ఈ పాటను రఫీ సాబ్ ఆలకించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటారా..ఈ పాట ఇప్పుడు రష్యాలో మారు మోగుతోంది.

Advertisement
Advertisement