Information

Women Born With 20 Toes And 12 Fingers: శాపంగా మారిన పుట్టుక లోపం, 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించిన ఒడిశా మహిళ నయక్‌ కుమారి, మంత్రగత్తె అంటూ నిందలు, చేయానికి పాపానికి వివక్షకు గురవుతున్నానంటూ ఆవేదన

Hazarath Reddy

పుట్టుకతో వచ్చిన లోపం ఆ వృద్ధురాలికి శాపంగా మారింది. తను అందరిలాంటి మనిషే అయనప్పటికీ పుట్టుకతోనే ఆ మహిళ లోపంతో పుట్టడంతో అందరూ ఆమెను అదోలా చూస్తున్నారు. మంత్రాలు చేస్తున్నావంటూ అవహేలనకు గురిచేస్తున్నారు. నాలుగు గోడల మధ్యనే బంధించి ఆమెను చిత్రవధకు గురిచేస్తున్నారు. దీనికి తోడు పేదరికం ఆమెపాలిట శాపంగా మారింది.

Coats For Cows In Ayodhya: అయోధ్యలో ఆవులకు చలికోట్లు, మున్సిపల్ కార్పోరేషన్ సంచలన నిర్ణయం, 700 ఎద్దులతో సహా మొత్తం 1200 పశువులకు కోట్లు, మొత్తం మూడు,నాలుగు దశల్లో అమలు చేస్తామన్న మున్సిపల్ కమిషనర్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ (Ayodhya Municipal Corporation) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అయోధ్య మునిసిపల్ అధికారులు పట్టణంలోని ఆవులను చలి నుంచి కాపాడేందుకు వాటికి చలికోట్లు కుట్టిస్తున్నారు. జనపనారతో వీటిని తయారు చేస్తున్నారు.

Kishan Reddy: పాక్ చెర నుంచి తెలుగు యువకుడ్ని విడిపిస్తాం, ఎంత కష్టమైనా ప్రశాంత్‌ని ఇండియాకు తీసుకువస్తాం, విదేశాంగశాఖ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామన్న కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Hazarath Reddy

తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ప్రశాంత్ (Prashanth) అనే తెలుగు యువకుడ్ని పాకిస్థాన్(Pakistan) భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) స్పందించారు. ప్రశాంత్ ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పాకిస్థాన్ లోని భారత దౌత్య కార్యాలయం(Indian embassy in Pakistan)తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

Mann Ki Baat: నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో సంయమనం చూపారు, విద్యార్థులు పుస్తకాలు వదిలేసి గూగుల్ వెంట పడుతున్నారు,మనసులో మాట కార్యక్రమంలో ప్రధాని మోడీ

Hazarath Reddy

మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రధాని మోడి దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తానని తన బాల్యంలో అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. తాను ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని మన్ కీ బాత్(Mann Ki Baat)లో చెప్పారు.

Advertisement

GOVT Of AP Regulated Onion Prices: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, కిలో ఉల్లి 25 రూపాయలు మాత్రమే, ఏపీ రైతు బజార్లలో ప్రారంభమైన ఉల్లి విక్రయాలు, ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh)లోని అన్ని రైతు బజార్లలో నేటి నుంచి ఉల్లి విక్రయాలు ( Onion sale) ప్రారంభమయాయి. బయట మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల )(AP Rythu Bazars Sell Onions ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే (Onion for Rs 25 per Kg) ఏపీ ప్రభుత్వం (Ap govt) విక్రయించనున్నట్లు తెలిపింది.

Who Is Ajit Pawar: అజిత్ పవార్ ఎవరు? అతని ప్రస్థానం ఏంటీ? అతనిపై ఉన్న ఆరోపణలు,కేసులు ఏంటీ? మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

అజిత్ పవార్ (Ajit Pawar).. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ (COngress) పార్టీలకు షాకిస్తూ బీజేపీ(BJP)ని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన 60 ఏళ్ల అజిత్ పవార్ ఎన్సీపీ నేత, శరద్ పవార్ (Sharad Pawar) అన్న కుమారుడు. ట్విస్టుల మధ్య సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీ రోల్ పోషించి బీజేపీకి అధికారాన్ని అందించాడు. తమ అధినేత శరద్ పవార్‌ను ధిక్కరించి బీజేపీకి జై అన్నాడు.

‘Modi Hai Toh Mumkin Hai’: మోడీ ఉంటే అన్నీ సాధ్యమే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

HYD Car Accident Video: ఒళ్లు గగుర్పొడిచేలా సీసీ పుటేజీ వీడియో, హైదరాబాద్‌లో బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం, మహిళ అక్కడికక్కడే మృతి, ఆరుగురుకి తీవ్రగాయాలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌ (Biodiversity flyover)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు.ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

Advertisement

Thought Modi Was Giving Money: ప్రధాని మోడీ డబ్బులు వేస్తున్నారని తీసుకున్నా, నాకు ఇంకేం తెలియదు, అమాయకంగా సమాధానం ఇచ్చిన అకౌంట్ హోల్డర్, మిస్టరీ డిపాజిట్లపై తలపట్టుకున్న ఎస్‌‌బీఐ అధికారులు

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద జాతీయ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి డొల్లతనం బయటపడింది. బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాటుకు ఖాతాదారుడు రూ. 89 వేల వరకు లాస్ అయ్యాడు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా(Madhya Pradesh’ Bhind district)లో గల స్టేట్ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అకౌంట్ ఓపెన్ చేశారు.

Sathya Sai Baba Birthday: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గురువు, సేవకు ప్రతిరూపం, సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

Fadnavis Takes Oath As 'MAHA' CM: రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు, మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Hazarath Reddy

గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలకు ఎండింగ్ కార్డు పడింది. అక్కడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాత్రికి రాత్రే పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ నుంచి విబేధాలతో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న శివసేనకు ఎన్సీపీ భారీ షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో జట్టు కట్టిన బీజేపీ ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు 9Sarileru Neekevvaru)’. రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి (Vijayashanthi) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలయింది.

Advertisement

Indian Army Daring Operation: ఇండియన్ ఆర్మీ సాహసోపేత ఆపరేషన్, సిలిండర్ ఆకారంలో ఉన్న ఐఈడి బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ టీమ్, అవి పేలితే భారీ నష్టమే..

Hazarath Reddy

ఇండియన్ ఆర్మీ డేరింగ్ ఆపరేషన్ (Indian Army Daring Operation) చేపట్టింది. భార‌త ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ రెండు భారీ ఐఈడీ బాంబుల‌( Improvised Explosive Device)ను నిర్వీర్యం చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌(Jammu and Kashmir)లోని కుద్వానీ బ్రిడ్జ్ వ‌ద్ద భారత ఆర్మీ ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సిలిండ‌ర్ ఆకారంలో ఉన్న రెండు ఐఈడీ బాంబు బాక్సుల‌ను తొవ్వి తీసి.. వాటిని విజ‌య‌వంతంగా నిర్వీర్యం చేశారు.

Gold Tulsi Leaves: సింహాద్రి అప్పన్నకు 50 బంగారు తులసీ ఆకులను కానుకగా సమర్పించిన భక్తుడు, సింహగిరిపై రాజగోపురం దర్శనాలకు బ్రేక్, తూర్పు కనుమల పర్వతంపై కొలువుతీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నాని(Visakhapatnam)కి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతంపై కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతం సింహాచలం (Simhachalam Temple). సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అమూల్యమైన కానుకలను సమర్పించుకుంటారు.

Maharashtra Vikas Aghadi: 'మహా'లో మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడి కూటమి, అధికార ఏర్పాటుకు తెరుచుకున్న దారులు, పదవుల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటు(Maharashtra government formation)కు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌(Shiv Sena, NCP and Congres) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుదిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నాలుగైదు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం ఉన్నది.

Redmi Note 7S Explodes: పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందన్న కస్టమర్ కేర్, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టలేదన్న కస్టమర్

Hazarath Reddy

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Advertisement

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

Hazarath Reddy

స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

ఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది....

English Medium Introduction: ఒకటి నుంచి ఆరు వరకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి, ప్రతి ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంపు, పదోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ(Andhra Pradesh)లో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనే అంశం బాగా ట్రెండ్ అయింది. చాలామంది దీనిని స్వాగతిస్తుండగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు భాష దెబ్బతింటుందని చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం (The Government of Andhra Pradesh) దీనిపై కొన్ని సవరణలు చేస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు.

Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

Hazarath Reddy

గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement