News

Bomb Threat: ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధింపు

Hazarath Reddy

సెప్టెంబర్ 30, మంగళవారం ఉదయం ముంబై నుండి దేశ రాజధానికి వెళ్తున్న ఇండిగో విమానం 6E 762 లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు PTI నివేదించింది. సెప్టెంబర్ 30, 2025న ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం 6E 762 లో భద్రతా బెదిరింపు కనిపించింది.

ఆసియా కప్ హీరో Tilak Varma చిన్నప్పటి కోచ్ Salam Bayash గురించి ఎవరికైనా తెలుసా ? తిలక్ వర్మని టీమిండియా భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దిన చిన్నప్పటి గురువును ఓ సారి కలిసొద్దాం పదండి

Team Latestly

తిలక్ వర్మకు క్రికెట్ లో మొదటి కోచ్ సలాం బయాష్ అని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ క్రికెటర్ కు అయినా జీవితంలో మొదటి కోచ్ అంటే చాలా ముఖ్యుడు. వాళ్లే ఆటగాడి ప్రతిభను గుర్తించి, సరైన దిశలో నడిపిస్తారు. హైదరాబాద్‌కు చెందిన సలాం బయాష్ చిన్న వయసులో తిలక్ వర్మను గుర్తించి, అతన్ని లీగాలా క్రికెట్ అకాడమీలో తీసుకున్నారు.

Dussehra Messages in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

భారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు.

Dussehra Wishes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుగులో చక్కగా చెప్పేయండి

Team Latestly

హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.

Advertisement

Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..

Team Latestly

దసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

PM Modi’s ‘Operation Sindoor’ Post: ఆసియా కప్ విజేతగా భారత్, ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Team Latestly

ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మీడియా పోస్ట్‌లో "ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ కేంద్ర సైనిక చర్యతో సరిపోల్చి, క్రికెటర్లు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అది సుమారు 1,07,000 రీట్వీట్‌లు, 25 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు పొందింది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌, 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు.

Advertisement

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఎస్సార్‌నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ప్రయాణికులు సేఫ్, మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం

Team Latestly

హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్‌ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Bengaluru: బెంగుళూరులో దారుణం, చీరలు చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టిన షాపు యజమాని, మహిళతో పాటు యజమానికి కూడా అరెస్ట్

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాప్‌లో చీరలు దొంగిలించిందని ఆరోపణతో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. మాయా సిల్క్స్‌ శారీస్ అనే దుకాణంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు రూ.91,500 విలువైన 61 చీరలను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

Team Latestly

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Kidney Health Alert: మీ కిడ్నీ ప్రమాదంలో పడిందంటే కారణం ఈ ఆహార పదార్థాలే, వెంటనే మీ మెనూ నుండి వీటిని తీసేయపోతే అనారోగ్యంతో విలవిలలాడిపోతారు..

Team Latestly

కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలుగా పనిచేస్తాయి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఉప్పు, ఖనిజాలు, వ్యర్థాలను బయటకి పంపడం వంటి ప్రాథమిక పనులను నిర్వహిస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యంగా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Rain Alert: మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు, ఇంటి దగ్గర నుండే పని చేయండి, నగర ఉద్యోగులకు పోలీసులు ఆదేశాలు, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌

Team Latestly

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు నగర జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. రహదారులు జలమయమవగా, ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

Kidnapping Caught on Camera: వీడియో ఇదిగో.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్,తమిళనాడులోని వెల్లూరులో సంఘటన, మొత్తం దృశ్యం CCTVలో రికార్ట్

Team Latestly

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని గుడియాతం ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 ఏళ్ల బాలుడిని ఇంటి బయట నుంచి అపహరించారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీడియో ఫుటేజ్ ప్రకారం, కర్ణాటక లైసెన్స్ ప్లేట్ ఉన్న కారు నుండి హెల్మెట్ ధరించిన యువకుడు దిగాడు.

OG Fans Chaos: పవన్ ఫ్యాన్స్ రచ్చ.. ‘OG' సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు, బెంగళూరులో KR పురంలో ఘటన , షో నిలిపివేత

Team Latestly

బెంగళూరులోని KR పురం థియేటర్లో ‘OG’ సినిమా ప్రీమియర్ షోలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో షో చూడటానికి వచ్చారు. అయితే షో ప్రారంభానికి ముందు కొంత మంది అభిమానులు తగిన నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. కొంతమంది కత్తులతో స్క్రీన్‌ను చింపేయడంతో థియేటర్ యాజమాన్యం షోను నిలిపివేయవలసి వచ్చింది.

Advertisement

Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..

Team Latestly

భారత రక్షణ రంగంలో మరో మిస్సైల్ చేరింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని రక్షణ రంగం విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగం విజయంతో.. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.

Backward Walking: రోజూ 10 నిమిషాలు వెనుకకు నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవిగో, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి అన్నీ మాయమయిపోతాయి..

Team Latestly

మన ఇంట్లో పెద్దలు భోజనం చేసిన తర్వాత కాస్త నడవమని ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే ఆరోగ్య నిపుణులు కూడా అదే సలహా ఇస్తారు. ఎందుకంటే భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌కి చేరిన భారత్, బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య రసవత్తర పోరు..గెలిచిన టీం ఫైనల్‌కు

Team Latestly

ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌, స్పిన్నర్ల మాయాజాలం తోడవడంతో మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

OG Ticket Price Hike Suspension: విడుదలకు ముందే ఓజీ మూవీకి బిగ్ షాక్, టికెట్ ధరల పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు

Team Latestly

తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు నిర్వహించడం, టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం ఆదేశాలను నిలిపివేసింది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement