Politics

YS Jagan: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్, నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ, అనంతరం సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్

Advertisement

Politicsசெய்திகள்

Bihar Assembly Elections 2025 Date: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, రెండు దశల్లో పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు, మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు

Team Latestly

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశంలో, నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.

Jubilee Hills By-poll Schedule: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, నవంబర్‌ 11 వ తేదీన ఉప ఎన్నిక, 14వ తేదీన కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు విడుదల

Team Latestly

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయి 21వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

SC on OBC Reservation: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం

Team Latestly

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9పై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

Advertisement

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌, 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు.

Rajya Sabha By-Election 2025: మోగిన రాజ్యసభ ఉప ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్‌లో 4 రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, పంజాబ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, అక్టోబర్ 24న పోలింగ్

Team Latestly

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది, జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) చాలా కాలంగా ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు త్వరలో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ స్థానాలు దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్నాయి.

Dussehra Holidays in Telugu States: ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 దసరా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు

474 Parties De-Listed by EC: ఈసీ సంచలన నిర్ణయం, 474 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు, ప్రస్తుతం దేశంలో ఎన్ని గుర్తింపు పార్టీలు ఉన్నాయో తెలుసుకోండి

Team Latestly

దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 18న ప్రకటించింది. ఈ చర్య గత ఆరేళ్లలో ఎన్నికలలో పాల్గొనని పార్టీలను పరిగణలోకి తీసుకుంది.

Advertisement

Telangana Rajyadhikara Party: తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో నూతన పార్టీ, TRP అధికార ప్రతినిధిగా ఏఐ

Team Latestly

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల ఆత్మ గౌరవం, హక్కుల కోసం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన అధికారికంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ను స్థాపించారు.

Waqf Act 2025: వక్ఫ్‌ చట్టం-2025పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ఓ ప్రొవిజన్‌ నిలిపివేస్తూ కీలక తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం

Team Latestly

వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025లోని ముఖ్యమైన ప్రావిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ప్రావిజన్ ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్‌ ఆస్తిని చేయగలరనే అంశాన్ని అత్యున్నత ధర్మాసనం నిలిపివేసింది.

France Political Turmoil: ఫ్రాన్స్‌లో 'బ్లాక్ ఎవ్రీథింగ్' నిరసన, పారిస్‌లో 200 మందికి పైగా వ్యక్తులు అరెస్ట్, నిరసనల అల్లకల్లోలం

Team Latestly

ప్రజాదరణ లేని కారణంగా ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన రెండు రోజుల తర్వాత కూడా ఫ్రాన్స్‌లోని నిరసనకారులు “బ్లాక్ ఎవ్రీథింగ్” ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడంలో 200 మందికి పైగా వ్యక్తులను ఫ్రెంచ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.

KP Sharma Oli Resigns: హిమాలయ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రధాని పదవికి రాజీనామా చేసిన కె.పి. శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధంపై వెలువెత్తుతున్న నిరసనలు

Team Latestly

సైన్యం సూచన మేరకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెపాల్‌లో కొత్త ప్రధాన మంత్రి ఎవరో ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement

K Kavitha Suspension: కవిత సస్పెండ్ వెనుక ఇంత కథ దాగుందా.. వరుస షాకులతో బీఆర్ఎస్ పార్టీ విలవిల, తట్టుకోలేక క్రమశిక్షణ పేరుతో సస్పెన్షన్ విధిస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం

Team Latestly

పార్టీ ఎంఎల్‌సీ, కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇటీవలి కాలంగా కవిత పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మాటలు, ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్నాయని, క్రమశిక్షణా విరుద్ధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం భావించింది.

US India Trade Dispute: భారత్ పూర్తిగా ఏకపక్షంగా వెళుతోంది, ప్రధాని మోదీ చైనా పర్యటన వేళ మళ్లీ ఆక్రోశాన్ని వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Team Latestly

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Team Latestly

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఆదోని కేసులో బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది.

Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Hazarath Reddy

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు

Advertisement

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Hazarath Reddy

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు (TGPSC Group 1 Results)విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది.

SVSN Varma on Chandrababu: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ రాకపోవడంపై స్పందించిన పిఠాపురం వర్మ, లోకేష్‌కు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన

Hazarath Reddy

రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి అధ్యక్షుల వారికి. ఇవన్నీ అర్ధం చేసుకొని మనం పార్టీకి, చంద్రబాబు గారికి, భవిష్యత్తు రథ సారథి లోకేష్ గారికి అండగా ఉండాలని కోరారు. తన ప్రసంగంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, చంద్రబాబు సీఎం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ దయ వల్లనే, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అంటూ మరోసారి హీట్ ఎక్కించారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ స్పందించలేదు.

Advertisement
Advertisement