రాజకీయాలు
Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్
Team Latestlyఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...
Dalit Bandhu Scheme: నలుదిక్కులా దళితబంధు అమలు, మరో నాలుగు మండలాలకు పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి
Team Latestlyహుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం...
NEET Exam Scrapped In Tamil Nadu: నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళనాడు అసెంబ్లీ, భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు
Hazarath Reddyనీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సోమవారం నీట్ వ్యతిరేక బిల్లును (Neet Exam Scrapped In Tamil Nadu) ఆమోదించారు.
Bhupendra Patel Swearing-in: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం, పాటిదార్లు ఈ సారి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారా?, భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌ పూర్తి బయోగ్రఫీ ఇదే..
Hazarath Reddyగుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) గుజరాత్ 17 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రమాణం (Bhupendra Patel Swearing-in) చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
Arvind Kejriwal: ముచ్చటగా మూడోసారి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌గా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్, ఏకగ్రీవంగా ఆమోదించిన 34 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ బాడీ
Hazarath Reddyఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)జాతీయ కన్వీనర్‌గా ముచ్చటగా మూడోసారి (Third Consecutive Term) ఎన్నికయ్యారు. ఆదివారం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు.
Bhupendra Patel: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌, ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ శాసనసభాపక్షం, 2022లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు
Hazarath Reddyగుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర భాయ్ పటేల్‌ను (Bhupendra Patel) ఎంపికచేశారు. విజయ్ రూపానీ రాజీనామా అనంతరం నేడు గాంధీనగర్‌లో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా (Bhupendra Patel to replace Vijay Rupani ) ఎన్నుకుంది.
Who Will Be The Next Gujarat CM?: గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే..
Hazarath Reddyచ్చే ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి (ujarat Chief Minister) విజయ్‌ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
Gujarat CM Vijay Rupani Resigns: అందుకేనా..గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా, నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని తెలిపిన విజయ్ రూపానీ, మ‌రో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు
Hazarath Reddyగుజరాత్‌ రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా (Gujarat CM Vijay Rupani Resigns) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శనివారం గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌కు సమర్పించారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి; రాష్ట్రంలో కొత్తగా 1,439 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,311 మంది రికవరీ, 14,624కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 22 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పటికీ ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 44 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత...
Bharat Bandh on September 27: సెప్టెంబ‌ర్ 27న భారత్ బంద్, రైతు సంఘాల పిలుపుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు
Hazarath Reddyకేంద్రం తీసుకువచ్చిన వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సెప్టెంబ‌ర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భార‌త్ బంద్‌కు (Bharat Bandh on September 27) మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని (Congress to extend full support ) కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది.
West Bengal Assembly Bypolls: ఉపఎన్నికల్లో భ‌వానీపూర్ నుంచి పోటీ చేయనున్న మమతాబెనర్జీ, సెప్టెంబ‌ర్ 30న ఉప ఎన్నిక‌లు, అక్టోబ‌ర్ 3న ఫలితాలు
Hazarath Reddyప‌శ్చిమ‌బెంగాల్లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక‌ల (West Bengal Assembly Bypolls) బ‌రిలో దిగ‌నున్న అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేసింది. బంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జి భ‌వానీపూర్ (TMC candidate from Bhabanipur) నుంచి బ‌రిలో దిగ‌నున్నారు.
TRS Office in New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయ భవనానికి భూమి పూజ చేసిన కేసీఆర్, మూడు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న టీఎస్ సీఎం
Team Latestlyపార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది దసరా నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి వివిధ జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు....
CM Stalin Warns DMK MLAs: స్టాలిన్ మార్క్ మొదలైంది..నన్ను ఎవరైనా పొగిడితే వారిపై చర్యలు తప్పవని తెలిపిన తమిళనాడు సీఎం, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యేలకు సూచన
Hazarath Reddyసీఎం స్టాలిన్‌ అభ్యంతరం పలుకుతూ.. నా గురించి పొగడ్తల ప్రసంగాలు వద్దని శుక్రవారమే చెప్పాను, అయినా సభ్యులు మానుకోలేదు, ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మాని, బడ్జెట్‌, సమస్యలపై చర్చించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అంతేకాదు.. సభా సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.
Cash for Vote Scam: ఓటుకు నోటు కేసు, రేవంత్‌రెడ్డికి సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు, అక్టోబర్‌4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, ఈడీ ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ధర్మాసనం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో (2015 Cash for Vote Scam) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు శనివారం సమన్లు (nampally court Issues summons) జారీ చేసింది. ఓటుకు కోట్ల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.
Sonu Sood as Brand Ambassador: సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించున్న ఢిల్లీ ప్రభుత్వం, 'దేశ్ కే మెంటర్' కార్యక్రమం విశేషాలు చెప్పిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని స్పష్టత
Team Latestlyఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటానికి సోనూ సూద్ అంగీకరించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సెప్టెంబర్ మధ్య నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు...
Syed Ahmed Shah Sadat: నాడు ఐటీ శాఖ మంత్రి..నేడు పిజ్జా డెలివరీ బాయ్, జర్మనీలో ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్న ఆప్ఘనిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌, పొట్టకూటి కోసం తప్పదంటున్న రాజకీయ నేత
Hazarath Reddyఅఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు ఐటీ శాఖా మంత్రిగా (Afghanistan’s Former IT Minister) పనిచేసిన రాజకీయ నేత ఇప్పుడు జర్మనీలో పిజ్జాలు డెలివరీ (PIzza Delivery Boy in Germany) చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. మొన్నటిదాకా అధికారంలో ఉండి కూడా పొట్టకూటి కోసం ఇప్పుడు పిజ్జాబాయ్ అవతారమెత్తాడు.
Narayan Rane Arrested: చెంప దెబ్బ ఎఫెక్ట్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు, ముందస్తు బెయిలు విజ్ఞప్తిని తిరస్కరించిన రత్నగిరి కోర్టు
Hazarath Reddyమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను (Narayan Rane Arrested) రత్నగిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న నారాయణ్ రాణే సీఎం ఉద్ధవ్‌ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో భారీ భూకంపం, చెన్నైలో స్వల్పంగా కంపించిన భూమి, ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపిన రాష్ట్ర విపత్తులశాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.