రాజకీయాలు

JR NTR Political Entry Row: నా పొలిటికల్ ఎంట్రీ మీ చేతుల్లో, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని దాటవేత

Hazarath Reddy

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. ‘మీ పోలిటికల్‌ ఎంట్రీ ఎప్పడు’అని (JR NTR Political Entry Row) ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ సమాధానం చెబుతానో కూడా మీకు తెలుసు’ అంటూ ప్రశ్న దాటేశారు.

Tirupati By Election: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీనుంచి తప్పుకున్న జనసేన, బీజేపీ అభ్యర్థికి మద్దతు, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ కుస్తీలు

Hazarath Reddy

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

AP Municipal Polls 2021 Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత, రేపు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు, విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు (AP Municipal Polls 2021 Counting) చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.

Yashwant Sinha Joins TMC: అట‌ల్‌జీ పాల‌న వేరు..మోదీ పాలన వేరు, బీజేపీకీ భారీ ట్విస్ట్ ఇస్తూ తృణ‌మూల్ పార్టీలో చేరిన య‌శ్వంత్ సిన్హా, అన్ని వ్యవస్థలు నేడు బలహీనం అయ్యాయని ఆవేదన

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడేకొద్ది అక్కడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. దీదీ పార్టీ నేతలను లాగేసుకుంటున్న బీజేపీ పార్టీకి అక్కడ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా నేడు మమతా బెనర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో (Yashwant Sinha Joins TMC) చేరారు. కాగా గ‌తంలో మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాయ్‌పేయి ప్ర‌భుత్వంలో య‌శ్వంత్ సిన్హా (Former BJP leader Yashwant Sinha) ఆర్థిక మంత్రిగా చేశారు. 83 ఏళ్ల య‌శ్వంత్ సిన్హా 2018లో బీజేపీ పార్టీకి స్వ‌స్తి ప‌లికారు.

Advertisement

MLA Subash Chandra Panigrahi: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యా ప్రయత్నం, ఒడిశా అసెంబ్లీలో కలకలం రేపిన ఘటన, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్చ జరుగుతుండగా శానిటైజర్ తాగేందుకు ప్రయత్నించిన దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి

Hazarath Reddy

ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కలకలం రేపింది. శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ దేవ్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే (MLA Subash Chandra Panigrahi) ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఒడిశా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో (Odisha Assembly) మాట్లాడుతున్నారు.

Nandigram 'Attack': మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల, వీల్‌ఛైర్‌లోనే ప్రచారం చేస్తానని తెలిపిన దీదీ, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపు, దాడిపై రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన ఈసీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లో‌ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి (Nandigram Attack) జరిగిందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి.

Kollu Ravindra Arrest: టీడీపి నేత కొల్లు రవీంద్ర అరెస్ట్, బెయిల్‌పై విడుదల; అరెస్టును తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, బీసీల పట్ల జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం

Team Latestly

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం మచిలిపట్నంలో పోలీసు సిబ్బంది విధులకు అంతరాయం కలిగించారనే అభియోగంపై మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్రను మచిలిపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు....

PC Chacko Quits Congress: కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, పార్టీకి రాజీనామా చేసిన పీసీ చాకో, వర్గ విభేదాలు, నాయకత్వ లేమితో కొనసాగలేని పరిస్థితి నెలకొని ఉందని తెలిపిన మాజీ ఎంపీ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి లిస్టును ప్రకటించిన సీపీఎం

Hazarath Reddy

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా (PC Chacko Quits Congress) చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందన్నారు. పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

Advertisement

Haryana Floor Test: రైతుల ఆందోళన బీజేపీ పట్టించుకోవడం లేదు, అందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని తెలిపిన హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భూపింద‌ర్ సింగ్ హుడా, బల పరీక్షను ఎదుర్కోనున్న సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌

Hazarath Reddy

హర్యానాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌పై (Manohar Lal Khattar-Led Government) కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భూపింద‌ర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం (no-confidence motion) ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తూ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో 250 మంది రైతులు మృతి చెందార‌ని చెప్పారు.

Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా, 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన తీరత్ సింగ్ రావత్

Hazarath Reddy

ఉత్తరాఖండ్ ముఖ‍్యమంత్రి పీఠాన్ని ​ఎవరు అధిరోహించనున్నారనే అనేక అంచనాల మధ్య ఈ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం రాజీనామా చేయడంతో బుధవారం నాటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Uttarakhand Political Crisis: సీఎం రావత్ రాజీనామాతో చిక్కుల్లో బీజేపీ, హర్యానా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆందోళనతో బీజేపీ వర్గాల్లో గుబులు

Hazarath Reddy

హర్యానా రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమి చిక్కుల్లో పడింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని (No-confidence motion in Haryana assembly) ప్రవేశపెట్టిడంతో నేడు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది.

TS Assembly Budget-2021 Session: మార్చి 15 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, గ‌త బ‌డ్జెట్ కంటే మెరుగ్గా ఈసారి బ‌డ్జెట్‌, 18న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. 2021-2022 బడ్జెట్‌కు (TS Assembly Budget Sessions 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget sessions 2021) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Farmers' Protest: భారత రైతు ఉద్యమంపై బ్రిటీష్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ, అంశాలపై చర్చను తప్పు బట్టిన భార‌తీయ హై క‌మీష‌న్, అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంపై అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

సోమ‌వారం రోజున బ్రిటీష్ పార్ల‌మెంట్ సుమారు 90 నిమిషాలు భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు నిర‌స‌న‌ల‌పై చ‌ర్చించింది. దీంతో పాటుగా ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చ‌ర్చించారు. రైతు నిర‌స‌న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును లేబ‌ర్ పార్టీ, లిబ‌ర‌ల్ డెమోక్రాట్స్‌, స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీ ఎంపీలు ఖండించారు.

Hyderabad Rename Row: హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, భాగ్యనగర్‌గా మారుస్తామని..దీనిని ఎవరూ అడ్డుకోలేరన్న బీజేపీ నేత

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటే ప్రపంచపటంలో ఓ ఐకాన్..అయితే అది ఇప్పుడు పేరు మార్చుకుని (Hyderabad Rename Row) కొత్త పేరుతో మన ముందుకు రానుందా..అంటే అవుననే అంటున్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు (BJP leader P Muralidhar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

West Bengal Polls 2021: బంగారు బంగ్లాని ప్రజలు కోరుకుంటున్నారు, బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మమత సర్కారుపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ, నిరసనగా ర్యాలీ చేపట్టిన మమతా బెనర్జీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా..తాజాగా ప్రధాని మోదీ కలకత్తాలో టీఎంసీపై విరుచుకుపడ్డారు.

Mithun Chakraborty Joins BJP: తాను మాములు పాము కాదు, కోబ్రా అంటూ.. కాషాయం కండువా కప్పుకున్న తృణమూల్ మాజీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

తృణమూల్ మాజీ నేత, హిందీ, బెంగాలీ సినిమాల్లో పేరు పొందిన నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో (Mithun Chakraborty Joins BJP) చేరారు.

Advertisement

MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని

Hazarath Reddy

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు.

Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కొలిక్కి వచ్చిన కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ, కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే ( DMK- Congress) మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో పాటు ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది.

Tamil Nadu Polls 2021: అర్థరాత్రి సీట్ల ఒప్పందం, తమిళనాడులో 20 సీట్లలో బీజేపీ పోటీ, కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ నుంచి పొన్‌ రాధాకృష్ణన్‌ బరిలో..

Hazarath Reddy

తమిళనాడులో బీజేపీ- ఏఐఏడీఎంకే సీట్ల పంపకంలో గత కొద్ది రోజులుగా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ ప్రతిష్ఠంభన తొలగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కివచ్చింది. కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly elections 2021) 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది.

Assembly Polls 2021: కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని మోదీ ఫోటో ఉండటాన్ని తప్పుపట్టిన టీఎంసీ పార్టీ, ఎన్నికల నియమావళి అమలులో ఉన్న రాష్ట్రాలలో ప్రధాని ఫోటో తొలగించాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం

Team Latestly

కో-విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ చేయబడుతున్న టీకా సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో ఉండటాన్ని తప్పు పట్టిన టీఎంసీ పార్టీ ఎన్నికల విధివిధానాల ఉల్లంఘనకు సంబంధించి పోల్ ప్యానెల్‌ను సంప్రదించింది. టీఎంసి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ...

Advertisement
Advertisement