Politics

Bharat Bandh 2020: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం, పలుచోట్ల వాహనాలు, రైళ్లు నిలిపివేత, కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం తీవ్రం, మరికొన్ని చోట్ల పాక్షికం, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకం

Vikas Manda

ముంబై, చెన్నై, భువనేశ్వర్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారుల దిగ్భందనం, రస్తారోకో, రైల్ రోకో వంటి కార్యక్రమాలతో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు.....

Deepika Padukone: ఢిల్లీ జేఎన్‌యూలో దీపికా పదుకొనె, జేఎన్‌యూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు, 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపిన బాలీవుడ్ ముద్దుగుమ్మ, మండిపడుతున్న బీజేపీ నేతలు, ఆమె సినిమాలు బహిష్కరించాలని పిలుపు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో( Jawaharlal Nehru University) విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అందరూ ఈ దాడిని ఖండిస్తున్నారు. వీరిలోకి దీపికా పదుకొనె (Deepika Padukone) కూడా చేరారు.

JNU Violence: దాడి చేసింది మేమే, యూనివర్సిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటేనే దాడి చేసాం, ప్రకటించిన హిందూ రక్షా దళ్, దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ వీడియోను విడుదల చేసిన సంస్థ చీఫ్ పింకీ చౌదరీ

Hazarath Reddy

ఈ నెల 5న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటిలో( Jawaharlal Nehru University (JNU)) ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడికి పాల్పడింది తమ కార్యకర్తలేనని హిందూ రక్షా దళ్(Hindu Raksha Dal) ప్రకటించింది. యూనివర్శిటీలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నందునే దాడి చేశామని ఆ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ(Pinky Chaudhary) ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం యూనివర్శిటి కమ్యూనిజం-సంబంధిత కార్యకలాపాల కేంద్రంగా మారింది.

AP Capital: అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ, వైయస్సార్సీపీ నేతపై రాళ్ల దాడి, ప్రతిగా సవాల్ విసిరిన పిన్నెల్లి, నారా లోకేష్ అరెస్ట్, హైవేను దిగ్బంధించిన అమరావతి రైతులు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు రాజధానిపై యుద్ధం(AP Capital War) నడుస్తోంది. 3 రాజధానుల ఉండవచ్చంటూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనను టీడీపీ(TDP) పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానిని (AP Capital Change)ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు అక్కడ నిరసన (farmers protest) కొనసాగిస్తున్నారు.

Advertisement

Iran vs America: అమెరికాకు చావే, 52 కాదు 290 టార్గెట్లు రెడీగా ఉన్నాయి, ట్రంప్ ట్వీటుకు కౌంటర్ ఇచ్చిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ ఎయిర్‌ ఫ్లైట్‌ 655 కూల్చివేతను మళ్లీ గుర్తు చేసిన హసన్‌ రౌహానీ

Hazarath Reddy

అమెరికా, ఇరాన్ దేశాల (Iran vs America War) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం వస్తోందా..(World War 3 Fears Erupt)అన్నంతగా వార్ నడుస్తోంది. ఈ రెండు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

AP Fishermen Released By PAK: 14 నెలల తరువాత స్వదేశానికి, పాక్ చెర నుండి బయటకు వచ్చిన ఆంధ్రా జాలర్లు, ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు, సరిగ్గా తిండి కూడా పెట్టలేదంటూ ఆవేదన

Hazarath Reddy

గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న 20 మంది ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా గుజరాత్‌ (Gujarat)తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ (Pakistan) ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ సైన్యానికి బందీగా చిక్కారు.

Bharat Bandh 2020: రేపు భారత్ బంద్, డబ్బులు ముందే తీసి పెట్టుకోండి, 14 డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ వ్యాప్త సమ్మె, 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం, ప్రధాని మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకమైన 10 కార్మిక సంఘాలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు (10 central trade unions) ఏకమయ్యాయి. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాయి.

Telangana Municipal Polls: నోటిఫికేషన్‌కు స్పీడ్ బ్రేకర్! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన హైకోర్ట్, ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పిటిషన్

Vikas Manda

విచారణ పూర్తయ్యే వరకు రేపు విడుదల కావాల్సిన నోటిఫికేషన్ పై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ విచారణల నేపథ్యంలో ....

Advertisement

Delhi Assembly Elections 2020: ఢిల్లీలో ఈ సారి పాగా వేసేదెవరు?, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది, 2వసారి ఆప్ అధికారంలోకి వస్తుందా?,బీజేపీ చరిత్రను తిరగరాస్తుందా?, ఫిబ్రవరి 8న పోలింగ్, 11న ఎన్నికల ఫలితాలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా(Delhi Assembly Elections 2020) మోగింది. వచ్చే నెల 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా(EC Chief Sunil Arora) ప్రకటించారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

Iran Bounty Offer: ట్రంప్ తల తీయండి..రూ.570 కోట్లు గెలుచుకోండి, సంచలనం రేపుతున్న వీడియో, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర రూపం దాల్చిన వార్

Hazarath Reddy

అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మేజర్ జనరల్ కసీమ్ సోలెమన్‌(Iranian Major General Qaseem Soleimani) యొక్క అంత్యక్రియలు( funeral ceremony) సోమవారం జరిగాయి. మషద్ నగరంలో (Mashhad city)జరిగిన ఊరేగింపులో ఓ వీడియో (Video) సంచలనం రేపుతోంది. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను(US President Donald Trump) హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని చెబుతోంది. కాగా ఇరాన్ అధికారిక ఛానల్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్రికత్తలను మరింతగా రేపుతోంది.

Maha Padayatra In Amaravathi: అమరావతిలో 20వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు, 10 వేల మంది రైతులతో మహా పాదయాత్ర, జాతీయ జెండాలతో రోడ్డు మీదకు వచ్చిన రైతులు, సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు

Hazarath Reddy

మూడు రాజధానుల ప్రకటనకు( 3 Capital Issue) నిరసనగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు(Farmers Protest) కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని(Amaravathi)కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు మహా పాదయాత్రను(Maha Padayatra) నిర్వహించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు.

JNU Violence: జెఎన్‌యూ యూనివర్సిటీపై గూండాల దాడి, ముసుగు వేసుకుని మరీ తలలు పగలకొట్టారు, దాడిని ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హోమంత్రి అమిత్ షా, అసలు అక్కడ ఏం జరిగింది ?

Hazarath Reddy

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో (Jawaharlal Nehru University) మాస్క్ ధరించిన గూండాలు క్యాంపస్ లోకి ప్రవేశించి ఎక్కడివారిని అక్కడే ఇష్టమొచ్చినట్లుగా(JNU Attack) కొట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌(Aishe Ghosh) సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

CM KCR-Municipal Polls: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం, గెలుపోటములకు ఎమ్మెల్యేలదే బాధ్యత, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి, టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణా సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో(Telangana Municipal Polls) టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే(TRS) ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Chief Minister K Chandrasekhar Rao)అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు(MLAs and Ministers,) ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు.

Amit Shah-Booth Karyakarta Sammelan: ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?, సీఏఏపై ప్రభుత్వాన్ని ఆప్ తప్పుదారి పట్టిస్తోంది..?,ఢిల్లీలో నిప్పులు చెరిగిన హోమంత్రి అమిత్ షా

Hazarath Reddy

ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు,(BJP President) కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah) అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన 'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు(Booth Karyakarta Sammelan) హాజరైన అమిత్‌ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్,(Congress) ఆమ్ ఆద్మీ పార్టీలు(AAP) దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు.

Muslims Million March In HYD: జాతీయ జెండాతో ముస్లీం మిలియన్ మార్చ్, సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కదం తొక్కిన ముస్లీంలు..ముస్లీమేతరులు, అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ముస్లింలు మిలియన్ మార్చ్ (Muslims Million March) నిర్వహించారు. పౌర సవరణ చట్టం (CAA), జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC) లపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

World War III Threats: కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ఇరాన్‌ను బూడిద చేస్తామంటున్న అమెరికా, 52 సైట్లను భస్మీ పటలం చేస్తామంటూ హెచ్చరికలు, బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రాకెట్ దాడులు చేసిన ఇరాన్, ప్రతీకారం తీర్చుకుని తీరుతామంటున్న ఇరాన్ మద్దతుదారులు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump)ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు. ఎవరైనా అమెరికన్లను లేదా అమెరికన్ ఆస్తులను(Americans or American assets) తాకినట్లయితే, 52 ఇరానియన్ సైట్‌లను హిట్ చేస్తామని ప్రకటించారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చాలా వేగంగా.. తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు.

Advertisement

Maharashtra Government: కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో..,కలకలం రేపుతున్న రాజీనామాలు, ఆర్థిక శాఖతో అజిత్ పవార్, పర్యాటక శాఖతో ఆదిత్య ఠాక్రే, హోం మంత్రిత్వ శాఖతో దేవ్ ముఖ్, మొత్తం మంత్రిత్వ శాఖల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని (Maha Vikas Aghadi)మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.

Gurdwara Attack: పాక్‌లో గురుద్వారాపై దాడి, ఇది భారత్ కుట్రే అంటున్న దాయాది దేశం, తీవ్రంగా ఖండించిన భారత్, పాక్ ఎంబసీ ఎదుట సిక్కుల ధర్నా, దాడికి వ్యతిరేకంగా ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ అసలేం జరిగింది ?

Hazarath Reddy

పాకిస్తాన్‌లోని (Pakistan)చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై (attack on Nankana Sahib Gurdwara) జరిగిన రాళ్ల దాడి దేశంలో ప్రకంపనలే రేపుతోంది. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ (Protests) చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్‌ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Bank Strike On Jan 8: ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు అన్నీ బంద్, ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ బంద్ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, 8వ తేదీ ఎవరూ విధులకు హాజరు కావద్దని ఉద్యోగులకు తేల్చి చెప్పిన బ్యాంకు యూనియన్లు

Hazarath Reddy

నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా అదే బాటలోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central GOVT) అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

AP Capital-Political Row: దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని, బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టమన్న చంద్రబాబు, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement