Politics

Fact-Finding Committee: అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ, మహిళలపై పోలీసుల దాడిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు, ట్విట్లర్లో వెల్లడించిన జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

Hazarath Reddy

ఏపీ రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని(Fact-Finding Committee ) అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma)ట్విట్టర్ లో తెలిపారు.

AP Capital Issue: రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గ్రేటర్ రాయలసీమను ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల, రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు, నేతలు ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానులు అంశం (AP 3 Capital issue) వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (Minister Sriranganatha Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని (Rajamandri) 4వ రాజధాని చేయాలని. సాంస్కృతిక రాజధానిగా దాన్ని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళుతామని ఆయన అన్నారు.

Supreme Court: జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ బంద్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆంక్షలు సరికాదు, భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు, అన్ని ఆంక్షలను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలను సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌పై (Internet) అపరిమిత ఆంక్షలు సరికాదని, ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

Uttar Pradesh: యూపీ పోలీసుల అరాచకం, మొబైల్ దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని రాక్షసంగా హింసించారు, వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు, ముగ్గురు పోలీసులు సస్పెండ్‌

Hazarath Reddy

ఈ మధ్య పోలీసులు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. యూపీలోని పోలీసులు ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేశారు. మొబైల్‌ను దొంగిలించాడనే నెపంతో (Mobile Theft) ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు.

Advertisement

Jagananna Vidya & Vasathi Deevena: ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 30 వేలు, నేరుగా తల్లుల ఖాతాలో జమ, జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

ఏపీలో పరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ (CM Jagan) మరో రెండు కొత్త (Two New Schemes)శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’,(Jagananna Vidya Deevena) ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) అనే రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నారు.

AP CM YS Jagan: సీఎం హోదాలో తొలిసారిగా నాంపల్లి కోర్టుకు ఏపీ సీఎం జగన్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తెలంగాణా పోలీసులు, గత ఏడాది మార్చి 1న చివరి సారిగా సీబీఐ కోర్టుకు హాజరయిన ఏపీ సీఎం

Hazarath Reddy

అక్రమాస్తుల కేసుల విషయంలో ఏపీ (Andhra pradesh)సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP Cm YS Jagan)నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు (CBI court) వచ్చారు.

PM Modi on Indian Economy: భారత ఆర్థిక విధానాలు బలమైనవి, ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది, వచ్చే ఐదేళ్లలో భారత అర్థికవ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ఖాయం; బిజినెస్ లీడర్ల సమావేశంలో ప్రధాని మోదీ

Vikas Manda

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న యూనియన్ బడ్జెట్ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా మరియు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకునేలా ఉంటుందని మోదీ చెప్పారు. పర్యాటకం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తదితర రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ....

CJI on CAA: దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది! పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యలు, ఆందోళనలు తగ్గినపుడే ఆ పిటిషన్లపై విచారిస్తామని స్పష్టంచేసిన సుప్రీంకోర్ట్

Vikas Manda

పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు చట్టబద్దమైనదా.. కాదా? అనేది మేమేల నిర్ణయించగలం? ఒక న్యాయవాదిగా మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. ఒక చట్టం యొక్క ప్రామాణికత ఏంటి, అది అమలయ్యే విధానం కోర్ట్ ప్రశ్నిస్తుంది గానీ, చట్టాన్ని రాజ్యాంగ బద్ధమైనదిగా ప్రకటించడం కోర్ట్ పని కాదు....

Advertisement

Iran vs USA: ఇరాన్ దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదు, అమెరికా బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, ఇక ముందు ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడి

Vikas Manda

చమురు సరఫరా గురించి తమ దేశం ఎంతమాత్రం ఆందోళన చెందడం లేదని అన్నారు. ఆయిల్ మరియు సహజ వాయువు ఉత్పత్తిలో యూఎస్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. చమురు కోసం తమకు మధ్యప్రాచ్యంపై అవసరమే లేదని పేర్కొన్నారు...

AP 'Local' Polls: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్ట్ అనుమతి, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కోసం జనవరి 17 లోపు వెలువడనున్న నోటిఫికేషన్, పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమోదం తెలపడంతో ఏపీలో మళ్ళీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని 660 జెడ్‌పిటిసి, 660 మండల పరిషత్ మరియు 10,229 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,951 గ్రామ పంచాయతీ ఎన్నికలు....

Bharat Bandh 2020: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం, పలుచోట్ల వాహనాలు, రైళ్లు నిలిపివేత, కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం తీవ్రం, మరికొన్ని చోట్ల పాక్షికం, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకం

Vikas Manda

ముంబై, చెన్నై, భువనేశ్వర్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారుల దిగ్భందనం, రస్తారోకో, రైల్ రోకో వంటి కార్యక్రమాలతో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు.....

Deepika Padukone: ఢిల్లీ జేఎన్‌యూలో దీపికా పదుకొనె, జేఎన్‌యూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు, 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపిన బాలీవుడ్ ముద్దుగుమ్మ, మండిపడుతున్న బీజేపీ నేతలు, ఆమె సినిమాలు బహిష్కరించాలని పిలుపు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో( Jawaharlal Nehru University) విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అందరూ ఈ దాడిని ఖండిస్తున్నారు. వీరిలోకి దీపికా పదుకొనె (Deepika Padukone) కూడా చేరారు.

Advertisement

JNU Violence: దాడి చేసింది మేమే, యూనివర్సిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటేనే దాడి చేసాం, ప్రకటించిన హిందూ రక్షా దళ్, దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ వీడియోను విడుదల చేసిన సంస్థ చీఫ్ పింకీ చౌదరీ

Hazarath Reddy

ఈ నెల 5న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటిలో( Jawaharlal Nehru University (JNU)) ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడికి పాల్పడింది తమ కార్యకర్తలేనని హిందూ రక్షా దళ్(Hindu Raksha Dal) ప్రకటించింది. యూనివర్శిటీలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నందునే దాడి చేశామని ఆ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ(Pinky Chaudhary) ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం యూనివర్శిటి కమ్యూనిజం-సంబంధిత కార్యకలాపాల కేంద్రంగా మారింది.

AP Capital: అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ, వైయస్సార్సీపీ నేతపై రాళ్ల దాడి, ప్రతిగా సవాల్ విసిరిన పిన్నెల్లి, నారా లోకేష్ అరెస్ట్, హైవేను దిగ్బంధించిన అమరావతి రైతులు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు రాజధానిపై యుద్ధం(AP Capital War) నడుస్తోంది. 3 రాజధానుల ఉండవచ్చంటూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనను టీడీపీ(TDP) పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానిని (AP Capital Change)ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు అక్కడ నిరసన (farmers protest) కొనసాగిస్తున్నారు.

Iran vs America: అమెరికాకు చావే, 52 కాదు 290 టార్గెట్లు రెడీగా ఉన్నాయి, ట్రంప్ ట్వీటుకు కౌంటర్ ఇచ్చిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ ఎయిర్‌ ఫ్లైట్‌ 655 కూల్చివేతను మళ్లీ గుర్తు చేసిన హసన్‌ రౌహానీ

Hazarath Reddy

అమెరికా, ఇరాన్ దేశాల (Iran vs America War) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం వస్తోందా..(World War 3 Fears Erupt)అన్నంతగా వార్ నడుస్తోంది. ఈ రెండు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

AP Fishermen Released By PAK: 14 నెలల తరువాత స్వదేశానికి, పాక్ చెర నుండి బయటకు వచ్చిన ఆంధ్రా జాలర్లు, ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు, సరిగ్గా తిండి కూడా పెట్టలేదంటూ ఆవేదన

Hazarath Reddy

గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న 20 మంది ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా గుజరాత్‌ (Gujarat)తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ (Pakistan) ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ సైన్యానికి బందీగా చిక్కారు.

Advertisement

Bharat Bandh 2020: రేపు భారత్ బంద్, డబ్బులు ముందే తీసి పెట్టుకోండి, 14 డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ వ్యాప్త సమ్మె, 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం, ప్రధాని మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకమైన 10 కార్మిక సంఘాలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు (10 central trade unions) ఏకమయ్యాయి. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాయి.

Telangana Municipal Polls: నోటిఫికేషన్‌కు స్పీడ్ బ్రేకర్! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన హైకోర్ట్, ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పిటిషన్

Vikas Manda

విచారణ పూర్తయ్యే వరకు రేపు విడుదల కావాల్సిన నోటిఫికేషన్ పై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ విచారణల నేపథ్యంలో ....

Delhi Assembly Elections 2020: ఢిల్లీలో ఈ సారి పాగా వేసేదెవరు?, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది, 2వసారి ఆప్ అధికారంలోకి వస్తుందా?,బీజేపీ చరిత్రను తిరగరాస్తుందా?, ఫిబ్రవరి 8న పోలింగ్, 11న ఎన్నికల ఫలితాలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా(Delhi Assembly Elections 2020) మోగింది. వచ్చే నెల 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా(EC Chief Sunil Arora) ప్రకటించారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

Iran Bounty Offer: ట్రంప్ తల తీయండి..రూ.570 కోట్లు గెలుచుకోండి, సంచలనం రేపుతున్న వీడియో, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర రూపం దాల్చిన వార్

Hazarath Reddy

అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మేజర్ జనరల్ కసీమ్ సోలెమన్‌(Iranian Major General Qaseem Soleimani) యొక్క అంత్యక్రియలు( funeral ceremony) సోమవారం జరిగాయి. మషద్ నగరంలో (Mashhad city)జరిగిన ఊరేగింపులో ఓ వీడియో (Video) సంచలనం రేపుతోంది. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను(US President Donald Trump) హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని చెబుతోంది. కాగా ఇరాన్ అధికారిక ఛానల్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్రికత్తలను మరింతగా రేపుతోంది.

Advertisement
Advertisement