Politics

MAHA Govt Suspence: మహాలో మరో కీలక మలుపు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి, రాష్ట్రపతి పాలన అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్న శివసేన

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఫలితాలు ప్రకటించి వారం దాటినా అక్కడ గవర్నమెంట్ ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. బిజెపి దాని మిత్రపక్షం శివసేన మధ్య చర్చలు ఓ పట్టాన తేలకపోవడంతో అధికార ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్సీపీ సరికొత్త ఎత్తుగడకి తెరలేపిందని తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్‌ 8న ముగిసిపోనుంది.

Karakatta Illegal Issues: కరకట్ట అక్రమ నిర్మాణదారులకు మరోసారి నోటీసులు, విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు, విచారణ ఆరువారాలకు వాయిదా

Hazarath Reddy

కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆ నిర్మాణాల యజమానులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.

Pakistan Biggest Issues: కాశ్మీర్ సమస్య కానే కాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తున్నాయి, పాక్ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన, గల్లప్‌ అండ్‌ గిలానీ ఇంటర్నేషనల్‌ అధ్యయనపు నిజాలు

Hazarath Reddy

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌లో కశ్మీర్‌ సమస్య కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాకిస్తాన్‌ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్‌ సమస్య కాదని గల్లప్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.

Polavaram Project Mission @2021: పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు.

Advertisement

Jharkhand Assembly Elections 2019: అక్కడ కూడా బీజేపీకి షాక్ తప్పదా? నవంబర్ 30 నుంచి ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, ఐదు దశల్లో జరగనున్న పోలింగ్, హర్యానా-మహారాష్ట్ర సీన్ ఝార్ఖండ్ లోనూ రిపీట్ అవుతుందని పార్టీల అంచనా

Vikas Manda

ఇటీవల వెలువడిన మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి, రెండు చోట్ల ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీని సాధించలేకపోయింది. వీటి ఫలితం ఝార్ఖండ్ లోనూ ప్రభావం చూపిస్తుందని...

Telangana RTC Strike: కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదు, ఎంపీని అని చూడకుండా పోలీసులు మెడపట్టి తొసేశారు, డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత, హైకోర్టులో కేసు మరోసారి వాయిదా

Vikas Manda

హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పూర్తి నివేదికను సమర్పించారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించామని నివేదికలో పేర్కొన్నారు. ఈసారి కూడా నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది....

AP Incarnation Day Ceremony: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు, రాష్ట్ర విభజన తరువాత తొలిసారి, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం, ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన పలువురు నేతలు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతున్నారు. కాగా విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా నిర్వహిస్తున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Farmer Asks 'Make Me MAHA CM': నన్ను‘మహా’ సీఎం చేయమంటున్న రైతు, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రైతు శ్రీకాంత్ విష్ణు గడాలే లేఖ, బీజేపీ-శివసేన మధ్య కుదరని పొత్తుకు నిరసనగా నిర్ణయం

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది. అయితే బీజెపీ మాత్రం అయిదేళ్లు మేమే సీఎంగా ఉంటాం. మీకు 16 మంత్రి పదవులిస్తాం అని చెబుతోంది. దీంతో ఇప్పట్లో సీఎం పీఠముడి అక్కడ వీడేలా లేదు. ఈ నేపథ్యంలో ఓ రైతు నన్ను సీఎంగా చేయమంటూ ముందుకొచ్చాడు.

Advertisement

YS Jagan VS CBI Verdict: జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ కోర్టు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న జగన్, తీర్పును స్వాగతించిన టీడీపీ

Hazarath Reddy

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

'MAHA' Suspense: కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, పట్టు విడవని శివసేన, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ భేటీ, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలు

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటుపై ఇంకా ఎటువంటి స్పష్టత రావడం లేదు. సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్‌ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన మరోసారి స్పష్టం చేసింది.

AP Formation Day Celebrations: ఐదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు, మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు పూర్తి, శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్

Hazarath Reddy

Andhra Pradesh Government, Andhra Pradesh Formation Day, YS Jagan Mohan Reddy,Formation Day celebrations,Amaravati,Indira Gandhi Municipal Stadium,Vijayawada,Chief Minister YS Jagan Mohan Reddy,Governor Biswabhusan Harichandan

Advertisement

India Strong Warning: చైనాకు వార్నింగ్ ఇచ్చిన భారత్, జమ్మూ కాశ్మీర్‌ను యూటీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చైనా, తమ వ్యవహారాల్లో చైనా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించమని ఘాటుగా స్పందించిన భారత్

Vikas Manda

జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ యూటీలకు చెందిన చాలా భూభాగాన్ని చైనా దురాక్రమణ చేపట్టింది. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా చైనా స్వాధీనం చేసుకుంది....

Pawan Kalyan on RTC strike: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానంటున్న పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్న జనసేన అధినేత

Vikas Manda

సీఎం కేసీఆర్ పై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్, ఒకవేళ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు....

Telangana RTC: టీఎస్ ఆర్టీసీ భవితవ్యంపై తేల్చేయనున్న సీఎం కేసీఆర్, నవంబర్ 02న కేబినేట్ భేటీ, ముందుగా అనుకున్నట్లే కొత్త ఆర్టీసీ పాలసీ వైపే మొగ్గు, సమ్మెపై డోంట్ కేర్

Vikas Manda

ఉద్యోగాల్లో చేరాలనుకునే కార్మికులు డిపోలో దరఖాస్తు పెట్టుకొని తిరిగి ఉద్యోగాల్లో చేరొచ్చనే ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ సమ్మె, కార్మిక సంఘాల నాయకులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు....

Jammu Kashmir UT Formation: భారతదేశంలో మరో చారిత్మాత్మక ఘట్టం ఆవిషృతం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్, నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అధికారికంగా గుర్తింపు

Vikas Manda

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తుఫానుకు ముందు కనిపించే నిశబ్దంలా పరిస్థితి కనిపిస్తుంది. కాశ్మీర్ లోని నాయకులు ఇప్పటికే ఇదొక నిర్బంధమైన, నిరంకుశమైన అవతరణ దినోత్సవంగా అభివర్ణిస్తున్నారు....

Advertisement

Sakala Janula Samarabheri: సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు, ఆయనకు రాజ్యాంగం మీద ఏమాత్రం అవగాహన లేదు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటూ 'సకల జనుల సమరభేరి' వేదికగా నాయకుల విమర్శలు

Vikas Manda

తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు తమ సంపూర్ణ మద్ధతు తెలియజేశారు. 26 రోజులుగా సమ్మె జరుగుతున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని....

Maharashtra: మరో ఐదేళ్ల వరకు నేనే ముఖ్యమంత్రిని! సీఎం కుర్చీని పంచుకునేది లేదంటూ తేల్చిచెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్, మహరాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై వీడని సందిగ్ధత

Vikas Manda

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి 98 సీట్లు సాధించింది. ఇందులో కాంగ్రెస్ సాధించినవి 44 సీట్లు కాగా, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ సాధించిన సీట్లు 54. ఒకవేళ ఈ కూటమికి శివసేన మద్ధతు తెలిపితే 154 (44+54+56) స్థానాలతో ఒక కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది....

Gannavaram Politics: 'వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ ఆయన ఎక్కడికి వెళ్లరు, కాదు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయం'. గన్నవరం చుట్టూ తిరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు

Vikas Manda

వంశీ రాకను వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆయన తమ అధినేత జగన్ ను కలిసేందుకు వెళ్లినా, ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన యార్లగడ్డ, ఒకవేళ వంశీకి వైసీపీ....

Adventurer CM Pema Khandu: 15వేల 600అడుగుల ఎత్తులో సీఎం రైడ్‌, వైరల్ అవుతున్న అరుణాచల ప్రదేశ్ సీఎం సాహస రైడ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు సాహసం, జవాన్లతో కలిసి దివాళీ వేడుకలు జరుపుకున్న సీఎం పెమా ఖండు

Hazarath Reddy

అపురూపమైన పర్యాటక ప్రదేశాలకు పేరుపొందిన ఈశాన్యరాష్టం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఇదే ఘాట్‌ రోడ్డులో బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సీఎం తాజాగా మరో సాహసం చేశారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ(ఆల్‌ టెరైన్‌ వెహికల్‌) రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు

Advertisement
Advertisement