Politics

YS Jagan on Sharmila: చెల్లి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ..

Hazarath Reddy

అసెంబ్లీకి వెళ్లనప్పుడు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసింది కదా అని అడిగిన మీడియా ప్రతినిధికి జగన్ సమాధానమిస్తూ.. చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్

Hazarath Reddy

జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు

YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

Hazarath Reddy

బీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Jharkhand Elections 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు,ఓటేసిన ప్రముఖులు..తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Arun Charagonda

జార్ఖండ్ తొలి విడత ఎన్నికల సమరం ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్‌ నమోదు కాగా జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గవర్నర్ సంతోష్​ కుమార్ గంగ్వార్.

Vijayasai Reddy Slams CM Chandrababu: అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

ఏపీలో కూటమి సర్కార్‌ పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు . సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Raghurama Krishnam Raju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

AP Assembly Budget Session 2024: రెండో రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయం, పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రులు

Hazarath Reddy

రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

Advertisement

KTR Slams Congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చిన కేటీఆర్, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్

Hazarath Reddy

ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణకు చెందిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) స్కీమ్ టెండర్లలో జరిగిన అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలించాలని కెటి రామారావు (కెటిఆర్) డిమాండ్ చేశారు.

YS Sharmila on Jagan: వీడియో ఇదిగో, జగనన్నను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన షర్మిల, సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది ఆయనేనని మండిపాటు

Hazarath Reddy

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

Hazarath Reddy

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.

Advertisement

Perni Nani Slams TDP: తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది, టీడీపీ కూటమిపై మండిపడిన పేర్ని నాని

Hazarath Reddy

టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. ఫేక్‌పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

YS Jagan on Opposition Status: ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు, కష్టాలు అనేవి శాశ్వతం కాదని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్‌ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు.

AP Assembly Budget Session 2024: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.

AP Assembly Budget Sessions 2024: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రూ. 2,94,427.25 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్, శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.

Advertisement

Telangana: సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి పరామర్శ

Vikas M

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.

Putin Heaps Praise on PM Modi: ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌పై మరోసారి ప్రశంసలు వర్షం కురిపించారు.ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన దేశాల జాబితాలో చేర్చేందుకు ఇండియాకు ఆ అర్హ‌త ఉంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు.

Andhra Pradesh: అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.

Yadadri Now as Yadagirigutta: యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన

Hazarath Reddy

యాదాద్రిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు

Advertisement
Advertisement