రాజకీయాలు
TMC Leader Kalyan Banerjee: వక్ఫ్ బిల్లుపై టీఎంసీ, బీజేపీ ఎంపీల మధ్య వాగ్వాదం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేతికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఈ రోజు వక్ఫ్ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త పార్లమెంటరీ సంఘం మీటింగ్ జరిగింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ మీటింగ్ జరిగింది.రిటైర్డ్ జడ్జీలు, లాయర్లు ప్యానల్ ఇచ్చిన అభిప్రాయాలను ఆ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) గాయపడ్డారు.
Bihar: పోలీస్ నియామకాలు త్వరగా చేపట్టండి, డీజేపీకి చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం నితీష్ కుమార్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పోలీస్ రిక్రూమ్మెంట్ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kashmir Will Never Become Pakistan: కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్గా మారబోదు,టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన ఫరూక్ అబ్దుల్లా
Hazarath Reddyజమ్మూకశ్మీర్ లోని Ganderbalలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు
Navya Haridas: వయనాడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రాతో తలపడనున్న నవ్య హరిదాస్
Arun Charagondaవయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ని ప్రకటించింది బీజేపీ. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోరాఉ నవ్య. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007లో బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ గా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.
Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి
Hazarath Reddyమంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.
Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.
Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??
Rudraమాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyటీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyజగన్ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.
Nayab Singh Saini Sworn In: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీతో సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరు..
Hazarath Reddyహర్యానాలో (Haryana)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.
Omar Abdullah Takes Oath as J&K CM: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం, కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్
Hazarath Reddyజమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ కు తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా చరిత్రకెక్కారు.
BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vikas Mబీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
Bye-Elections 2024: 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాహుల్ గాంధీ వదిలిన వయనాడ్ ఎంపీ స్థానానికి నవంబర్ 13న పోలింగ్
Hazarath Reddyదేశంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలు రెండు విడతల్లో జరుపుతున్నట్టు ప్రకటించింది. తొలివిడతలో భాగంగా నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
Assembly Elections 2024: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyమహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు, నవంబర్ 23న ఫలితాలు
Hazarath Reddyజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు
Hazarath Reddyమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
Can EVMs Be Hacked or Tampered With? ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు, ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదని తోసిపుచ్చిన ఈసీ
Hazarath Reddyఈవీఎంలు లేదా వాటి చిప్ లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మరోసారి తోసిపుచ్చారు. వక్రీకరణ అంచనాలను నివారించడానికి ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఎంచుకున్న నమూనా అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
SC on Freebies Plea: ఎన్నికల వేళ ఉచితాలు..దీని సంగతేంటో చెప్పండి, కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ పిటిషన్
Hazarath Reddyఎన్నికల సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలన్నీ వరుసగా ఉచిత హామీలు గుప్పించడం సర్వసాధారణం అయిపోయింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసుపై స్పందించిన ఏపీ డీజీపీ, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వెల్లడి
Hazarath Reddyబాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.