Viral

Accident Caught on Camera: మృత్యువు ఎలా వెంటాడుతుందో తెలిపే వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న ఓవర్‌లోడ్ ట్రక్కు బైక్ మీద పడటంతో ఇద్దరు మృతి

Hazarath Reddy

విధిరాతను మార్చలేమనే దానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. ధోల్పూర్ రోడ్డుపై ఓవర్‌లోడ్ తో కూడిన ట్రక్కు ఊగుతూ వచ్చి అదే రోడ్డులో ట్రక్కు ముందు వెళుతున్న బైక్ రైడర్లపై బోల్తా పడింది.

Maha Shivaratri Celebrations: కాశీలో నాగ‌సాధువుల ఊరేగింపు వీడియో ఇదిగో, సాధువుల‌పై పూల వ‌ర్షం కురిపించిన యూపీ ప్ర‌భుత్వం, కాశీ విశ్వేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న సాధువులు

Hazarath Reddy

మ‌హాశివ‌రాత్రి పండుగల వేళ‌.. నాగ‌సాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వ‌రుడి ఆలయాన్ని ద‌ర్శించుకున్నారు. శైవ సంప్ర‌దాయానికి చెందిన ఏడు అకాడాలతో పాటుగా గంగా ఘాట్ల నుంచి నాగసాధువులు విశ్వ‌నాథుడి ఆల‌యానికి ఊరేగింపుగా వెళ్లారు.

Maha Kumbh Mela 2025: మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు (Devotees) వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో కుంభ్‌ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది.

Sea Turtles in Rushikulya Beach: వీడియో ఇదిగో, గుడ్లు పెట్టేందుకు రుషికుల్య బీచ్‌కు చేరుకున్న 7 లక్షల ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన అధికారులు

Hazarath Reddy

ఒడిశాలోని కేంద్రపడ జిల్లా పరిధిలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వచ్చాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు Rushikulya Beach కు చేరుకున్నాయి.

Advertisement

'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

‘పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూప్‌లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా నోటీసులు ఇచ్చింది.

Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్‌వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..

Hazarath Reddy

షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు

Kerala Shocker: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలోనే ఆరు హత్యలు, ప్రియురాలితో పాటు తన తల్లిని చంపేసిన కిరాతకుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు.. అదీ గంటల వ్యవధిలోనే.. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది . తిరువనంతపురంలో అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

కుంభమేళాలో భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహా కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్‌ చేసింది.

Advertisement

Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, బాక్సింగ్ చేస్తూ రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ మృతి, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన

Hazarath Reddy

జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల వుషు ఆటగాడు మోహిత్ శర్మ చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఛాంపియన్‌షిప్ సందర్భంగా విషాదకరంగా మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కెమెరాలో రికార్డైంది, ఆట మధ్యలో మోహిత్ అకస్మాత్తుగా మ్యాట్‌పై కుప్పకూలిపోతున్నట్లు వీడియో చూపించింది.

Andhra Pradesh: శభాష్ ఏపీ పోలీస్, గుండెపోటుకు గురైన RTC డ్రైవర్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

French Horror: ఆడా లేదు మగా లేదు, 299 మంది పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం, ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలకు మత్తు మందు ఇచ్చి దారుణంగా రేప్

Hazarath Reddy

299 మంది బాధితులపై అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్జన్ సోమవారం ఫ్రాన్స్‌లో విచారణకు వచ్చాడు. వారిలో ఎక్కువ మంది అతని రోగులు పిల్లలే ఉన్నారు.

YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్

Hazarath Reddy

విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి నడిరోడ్డు మీద మూవీ ఆర్టిస్ట్ పాడు పని, అడిగినందుకు మహిళా హోంగార్డ్‌పై దాడి

Hazarath Reddy

మద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి నానా రభస చేసింది యువతి. తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతిని చూసి స్థానికులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మధురానగర్లో నడి రోడ్డుపై పుల్లుగా తాగి మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత పోలీసులకు చుక్కలు చూపించింది.

Telangana: వీడియో ఇదిగో, పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన రూ.20 లక్షల నగదు, తీరా అవి నకిలీవని తెలిసాక..

Hazarath Reddy

పంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు తన పొలంలో రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Rudra

ఔషధాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Rudra

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.

Advertisement

Elephant Attack Update: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)

Rudra

ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది.

World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!

Rudra

యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌ ను అభివృద్ధి చేశారు.

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.

Advertisement
Advertisement