Cricket

Krunal Pandya Tests Positive: భారత్ టీంలో కరోనా కలకలం, కోవిడ్ బారీన పడిన ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, రెండో టీ20 జూలై 28కి వాయిదా, ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన రెండు జట్లు

Hazarath Reddy

శ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి.

IND vs SL 1st T20I 2021: లంక బ్యాట్స్‌మెన్ల భరతం పట్టిన భువీ, తొలి టి20లో శ్రీలంకపై 38 పరుగులతో భారత్ గెలుపు, రేపు రెండో టి20 మ్యాచ్

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం

Hazarath Reddy

మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది.

Fight Breaks Out in Charity Match: బ్యాట్లతో తలలు పగలకొట్టుకున్న క్రికెట్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌లోని పేదల వైద్యం కోసం లండన్‌లో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో విషాద ఘటన, ఇద్దరు ఆటగాళ్లకు తీవ్రగాయాలు

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్ అంటేనే స్పిరిట్ తో కూడుకున్నది. గెలుపైనా ఓటమైనా హుందాగా స్వీకరించాలి. అయితే ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా బ్యాట్లతో దాడి (Fight Breaks Out in Charity Match) చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

India vs Sri Lanka 2nd ODI 2021: దీపక్ బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ఈనెల 23న చివరిదైన మూడో వన్డే

Hazarath Reddy

మంగళవారం జరిగిన రెండో వన్డేలో (India vs Sri Lanka 2nd ODI 2021) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై (India vs Sri Lanka) భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

IND vs SL 1st ODI Stat Highlights: ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం

Hazarath Reddy

శ్రీలకంతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం (IND vs SL 1st ODI Stat Highlights) సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

WTC 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌, నూతన పాయింట్ల విధానాన్ని ప్రకటించిన ఐసీసీ, ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు, ప్ర‌తి మ్యాచ్‌కు 12 పాయింట్లు

Hazarath Reddy

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ షెడ్యూల్‌, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని (ICC Confirms New Point System) ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇంట‌ర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ స్ప‌ష్టం చేసింది.

Yashpal Sharma Dies: గుండెపోటుతో కన్నుమాసిన 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ, 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించిన యశ్‌పాల్

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ(Yashpal Sharma Dies) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా యశ్‌పాల్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో ఆయన కీలకపాత్ర పోషించాడు.

Advertisement

India vs Sri Lanka New Schedule: భారత్‌, శ్రీలంక టీ20, వన్డే సిరీస్‌ కొత్త షెడ్యూల్, ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం, 25, 27, 29న టీ20లు, కోవిడ్ నుంచి కోలుకున్న లంక ఆటగాళ్లు

Hazarath Reddy

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య త్వరలో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు (IND vs SL) కొత్త షెడ్యూల్ వచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా లంక ఆటగాళ్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను (India vs Sri Lanka New Schedule) సోమవారం ప్రకటించింది.

Anil Kumble Meets CM Jagan: సీఎం జగన్ ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

New Zealand Win WTC 21: తొలి టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో భారత్‌పై 8 వెకెట్ల తేడాతో ఘన విజయం

Team Latestly

తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి....

Cheteshwar Pujara: తొలి ప‌రుగు చేయ‌డానికి 36 బంతులు వాడేశాడు, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసిన చెటేశ్వ‌ర్ పుజారా, బోర్ కొట్టిస్తున్నాడంటూ ట్విట్టర్లో పేలుతున్న జోకులు

Hazarath Reddy

ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆటగాడు చెటేశ్వ‌ర్ పుజారా ఈ మ‌ధ్య మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోపాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు.

Advertisement

ICC WTC Final 2021 Day 3: పీకలోతు కష్టాల్లో భారత్, ప్రస్తుతం ఆరువికెట్లకు 182 పరుగులు చేసిన టీం ఇండియా, 49 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగిన రహానే, కొనసాగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజు ఆట

Hazarath Reddy

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (ICC World Test Championship 2021 Finals) మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. ఇక రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది.

WTC 2021 Finals: తొలిసెషన్ ఆట రద్దు! మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సిద్ధం, ఉల్లాసంగా-ఉత్సాహంగా టీమిండియా ఆటగాళ్లు, మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

బ్యాటింగ్- బౌలింగ్ రెండింటి పరంగా టీమిండియా బలంగా కనిపిస్తోంది. అటు న్యూజిలాండ్ కూడా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ 1-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉంది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి ఉంది....

May’s ICC Player of the Month Awards: మే నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులు, భారత క్రికెటర్లకు దక్కని చోటు, టాప్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, మహిళల క్రికెట్లో క్యాథరిన్​

Hazarath Reddy

ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను (May’s ICC Player of the Month Awards) తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్‌, మార్చిలో భువనేశ్వర్‌ కుమార్‌, ఏప్రిల్‌ నెలకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్కించుకున్నారు.

Ahmed Musaddiq: క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు

Hazarath Reddy

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట​ ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.

Advertisement

ICC T20 World Cup 2021: భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహిస్తారా లేదా..క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని కోరిన ఐసీసీ, నెల రోజుల్లో నిర్ణయాన్ని చెబుతామన్న బీసీసీఐ, 2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు

Hazarath Reddy

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. అయితే ఇందుకు నెల రోజులు సమయం్ కావాలని బీసీసీఐ కోరింది. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ (BCCI) విజ్ఞప్తిని ఎట్టకేలకు ఐసీసీ అంగీకరించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది.

Sachin Tendulkar: జీవితంలో రెండు కోరికలు తీరలేదని బాధపడుతున్న సచిన్, అవి కలగానే మిగిలిపోయాయని ఇంటర్వ్యూలో తెలిపిన లిటిల్ మాస్టర్, అవేంటో తెలుసుకుందామా..

Hazarath Reddy

దిగ్గజ క్రికెటర్ కూడా తన జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోలేకపోయాడట. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

IPL 2021 New Venue: ఐపీఎల్‌-2021 మళ్లీ వచ్చేస్తోంది, మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, రెండో దశ పోటీలకు తమ ఆటగాళ్లను అనుమతించేది లేదని తెలిపిన ఇంగ్లండ్

Hazarath Reddy

బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Asia Cup 2021: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దు, 2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత నిర్వహించే అవకాశం, శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా వెల్లడి

Hazarath Reddy

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ (T20 Tournament Postponed) రద్దయింది. జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల (COVID-19 Pandemic) నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు.

Advertisement
Advertisement