రాష్ట్రీయం

Kesalingayapalli: మా గ్రామంలో అందరూ హిందువులే, ఇతర మతాల వాళ్లు వస్తే తన్ని తరిమేస్తాం, ఏపీలోని కేశలింగాయపల్లి గ్రామస్తులు కీలక నిర్ణయం

Hazarath Reddy

ఇతర మతాలకు చెందిన వారిని, ముఖ్యంగా మత ప్రచారకులను తమ గ్రామంలోకి రాకుండా, తమ విశ్వాసాన్ని ప్రచారం చేయొద్దని గ్రామస్థులు బహిరంగంగా హెచ్చరించడంతో కేశలింగాయపల్లి వార్తల్లోకెక్కింది

MLA Raja Singh: తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను.

MLA Raja Singh on Party Change: ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్య

Hazarath Reddy

గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.

Hyderabad: బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం చేస్తున్న 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు

Advertisement

Online Rummy Ban Row: ఏపీలో ఆన్ లైన్ రమ్మీపై హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించాలని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది.

Weather Forecast: జాడలేని అల్ప పీడనాలు, హిమాలయాల వద్ద తిష్ట వేసిన రుతుపవనాలు, వచ్చే నెలలో కూడా వర్షాలు కష్టమే, ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

జూలైలో భారీ వర్షపాతంతో హడలెత్తించిన రుతపవనాలు ఆగస్టులో నెమ్మదించాయి. ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.

Telugu Language Day: తెలుగు భాషా దినోత్సవం, ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి అంటూ సీఎం జగన్ శుభాకాంక్షలు

Hazarath Reddy

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు.

Telangana: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్, 30 శాతం పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

Advertisement

Video: ఆ బంక్‌లో పెట్రోల్ కొట్టించే ముందు ఈ వీడియో చూడండి, సగానికి పైగా నీళ్లే, శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ బాగోతం వెలుగులోకి

Hazarath Reddy

హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ భాగోతం వెలుగుచూసింది. వాహనదారులు పెట్రోల్ పోసుకొని ఒక కిలోమీటర్ వెళ్ళగానే దాదాపు 20 వాహనాలు ఆగిపోయాయి. తీరా బాటిల్లో పెట్రోల్ పోసి పరిశీలిస్తే సగానికి పైగా నీళ్లే ఉన్నాయి.

Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్‌ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌ కు మెయిల్ చేశాడు.

NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?

Rudra

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??

Rudra

నేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.

Advertisement

APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

Andhra Pradesh: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే నో మొబైల్, ఏపీలోని అన్ని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది.

TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్, టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన, రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లోకి..

Hazarath Reddy

రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Lakshmi Parvathi: మరో లేఖ విడుదల చేసిన లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిపై నా పోరాటం కొనసాగుతుందని లేఖలో వెల్లడి

Hazarath Reddy

ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. విడుదల చేసిన లేఖలో ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. లేఖ ఇదే..

Advertisement

Jagananna Vidya Deevena: సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు, అందుకే దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు, జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమ­­వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేసింది ఏపీ ప్రభుత్వం.

NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.

Hyderabad Road Accident: రోడ్డు ప్రక్కన చెత్త ఊడుస్తున్న స్వీపర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ కాలేజ్ బస్సు, చెట్టుకు-బస్సుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో రామ్ కోటిలో రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న జీహెచ్ఏంసీ స్వీపర్ సునీతను వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బస్సు, చెట్టుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.

Fake Voters in Telangana: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..

Rudra

తెలంగాణలో భారీఎత్తున బోగస్ ఓట్లు బయటపడ్డాయి. వీటిని ఈసీఐ తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం.

Advertisement
Advertisement