రాష్ట్రీయం

Andhra Pradesh: ఇకపై అమరావతి మనందరి అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

Hazarath Reddy

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు

Suicide Caught on Camera: సీసీ ఫుటేజీ ఇదిగో, కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి సూసైడ్, డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ జరగరాని ఘోరం..

Hazarath Reddy

హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ అనే వ్యక్తి కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Tomato Theft Video: సీసీ పుటేజీ ఇదిగో, అర్థరాత్రి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లిన దొంగ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన

Hazarath Reddy

దేశంలో టమోటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడం చూస్తున్నాం. అలాగే వారిని హత్య చేసి టమోటా ఆదాయం మీద వచ్చిన డబ్బులను దోచుకెళ్లడం చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో టమోటాల చోరీ జరిగింది. రాత్రి పూట వచ్చిన ఓ వ్యక్తి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.

Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో టోల్ గేట్ మేనేజర్‌పై కర్రతో దాడి చేసిన కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ఘటన వీడియో ట్యాగ్ చేసిన బాధితుడు

Hazarath Reddy

కామారెడ్డి - భిక్కనూర్ టోల్ ప్లాజా పై, మేనేజర్ మీద స్థానిక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి మద్యం మత్తులో కర్రలతో దాడికి తెగబడ్డాడు. మేనేజర్ తల మీద కర్రతో కొట్టి అర గంట పాటు హంగామా సృష్టించిన భీమ్ రెడ్డిని బైండోవర్ చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి వీడియోతో ట్వీట్ చేసిన టోల్ గేట్ మేనేజర్ పవన్.

Advertisement

Video: రూ. 15 లక్షల విలువైన టమాటాల లారీ బోల్తా, దొంగలు ఎత్తుకుపోకుండా రాత్రంతా కాపలా కాసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద 15 లక్షల విలువైన టమాటోల లారీ బోల్తా పడగా టమాటో అధిక ధరల వల్ల దొంగలు ఎత్తుకుపోకుండా పోలీసులు కాపలా కాయాల్సి వచ్చింది.

Telangana: టీవీ కేబుల్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్, స్తంభంపైనే యువకుడు మృతి, కంటతడి పెట్టిస్తున్న వీడియో ఇదిగో...

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి - చేవెళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభంపై నేపాల్ కు చెందిన అనిల్ (21) విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు, ప్రొక్లెయినర్ సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసి అందరూ కంటతడి పెడుతున్నారు.

Bogatha Waterfall: తెలంగాణ నయాగార జలపాతం వీడియో ఇదిగో, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోన్న బొగత జలపాతం

Hazarath Reddy

తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా, వాజేడు మండలంలోని చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీడియో ఇదిగో..

Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.

Advertisement

AP Weather Forecast: ఉత్తరాంధ్ర జిల్లా­లకు భారీ వర్ష ముప్పు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంపై ఉపరి­తల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న­ట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లా­ల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

Telangana Shocker: య్యూట్యూబ్‌కు బానిసై వంటింట్లో ఉరి వేసుకున్న 6వ తరగతి విద్యార్థి, సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు ఫోన్‌లో యూ ట్యూబ్‌ చూడొద్దని బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Chandramukhi-2: చంద్రముఖి-2పై ఆసక్తి పెంచేసిన ఎంఎం కీరవాణి.. పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు తాను నిద్రలేని రాత్రులు గడిపానన్న ఆస్కార్ విజేత

Rudra

హారర్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా చంద్రముఖి-2 వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు.

Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Rudra

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Advertisement

Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్‌ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..

Rudra

హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఘోరం జరిగింది. ఫ్లైఓవర్‌ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Shocking Incident in Kakinada: హమ్మో! కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన.. కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని బాలుడు.. అందుకే, ఇలా!!

Rudra

కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిరిగి తననే తిడతారని ఓ బాలుడు భయపడ్డాడు. ఆరు నెలలు గడిచింది. అయితే, అనూహ్యంగా అతడికి రేబీస్ సోకింది. దీంతో ఆదివారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.

VRA System: వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, వీఆర్‌ఏలను పలు శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా సర్ధుబాటు చేసిన ప్రభుత్వం

VNS

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ (Sub Committee) సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Avinash Reddy Letter to CBI: ఆస్తి పత్రాల కోసమే వివేకా హత్య జరిగి ఉండొచ్చు! సీబీఐ డైరక్టర్‌ కు లేఖ రాసిన ఎంపీ అవినాష్‌ రెడ్డి, విచారణ అధికారి రామ్‌ సింగ్‌పై సీబీఐకి ఫిర్యాదు

VNS

వైయస్ వివేకానంద హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా కేసులో జరుగుతున్న విచారణపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు (CBI Director) ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ (Avinash reddy letter) రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌ పై (Sp Ram singh) ఫిర్యాదు చేశారు.

Advertisement

Viral Video: చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం, గద్వాల జిల్లాలో షాక్‌ తిన్న మత్య్సకారులు వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..

kanha

జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం అయ్యింది. దీంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు.

Telangana CM KCR: ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

kanha

ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం - తెలంగాణ మైనారిటీలకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటించారు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

kanha

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Telangana: తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్‌ రూ.3,016 నుంచి రూ. 4,016కు పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

kanha

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్‌ మొత్తాన్ని రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది.

Advertisement
Advertisement