రాష్ట్రీయం

Hyderabad Shocker: ఇంటి ముందు వేసిన ముగ్గు మీద నీళ్లు పోసిన పక్కంటి కుటుంబం, కోపంతో వారిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు, ఒకరు మృతి

Hazarath Reddy

చార్మినార్ - ఛత్రినాక పరిధిలోని శివాజీనగర్లో మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయగా.. అది కాస్తా కొట్టుకుపోయింది. ఈ ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింటి దుర్గేష్, మాణిక్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.

Boy Drowned in Swimming Pool: ఆడుకుంటూ మూడంతస్తుల మీద నుంచి స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ బాలుడు, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి, పుప్పాలగూడలో విషాదం

VNS

హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందాడు. మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ అనే బాలుడు...ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో (drowned) పడిపోయాడు.

Hyderabad:వీడియో ఇదిగో, షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన గర్భిణితో సహా 12 మంది కస్టమర్లు, సురక్షితంగా వారిని రక్షించిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో గత రాత్రి చిక్కుకున్న గర్భిణి సహా 12 మందిని అగ్నిమాపక అధికారులు, పోలీసులు సురక్షితంగా రక్షించారు.

Adudam Andhra: అక్టోబర్ 2నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, మొత్తం 2 లక్షల 94 వేల మ్యాచ్‌లు, ఐదు కేటగిరిలో పోటీలు

Hazarath Reddy

అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కే రోజా తెలిపారు. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

Advertisement

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో పార్టీ నష్ట నివారణ చర్యలకు బీజేపీ శ్రీకారం , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి

Hazarath Reddy

తెలంగాణలో బీజేపీలో రోజు రోజుకు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది.

Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..

kanha

గత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ పదవి, జాక్ పాట్ కొట్టిన కోమటి రెడ్డి అంటున్న సన్నిహితులు

kanha

కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal : వరంగల్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్ కు సహకరించిన స్నేహితుల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టిన, అమ్మాయి తండ్రి..

kanha

ఇటుకాలపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్. కోపంతో ప్రేమికుడి ఇంటికి, పెళ్లికి సహకరించిన అతడి స్నేహితుల ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి. యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్ కాగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంజిత్.

Advertisement

CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన హైలెట్స్ ఇవిగో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రితో ముగిసిన భేటీ

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు

School Bus Accident Video: వీడియో ఇదిగో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, ఒక్కసారిగా బోల్తాపడిన స్కూల్ బస్‌, 15 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడపడం వల్ల స్కూల్ బస్‌ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.

Nandi Natakotsavalu: ఏపీలో నంది నాటకోత్సవాలు, 73 నంది అవార్డులు త్వరలో ప్రధానం చేస్తామని తెలిపిన పోసాని కృష్ణమురళి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి 'నంది నాటకోత్సవాలు' (రంగస్థల పురస్కారాలు) జరుపుకోవాలని నిర్ణయించింది. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక ఆటలు, పిల్లల ప్లేలెట్‌లు, కళాశాల లేదా యూత్ ప్లేలెట్‌లు అనే ఐదు విభాగాలలో అవార్డులను అందజేయాలని నిర్ణయించింది.

MLA Raghunandan Rao Arrest: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్, అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

దుబ్బాక BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్ దగ్గర పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి..అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు

Advertisement

Hyderabad Road Accident: షాకింగ్ సీసీ పుటేజీ, అతివేగంగా వెళ్తూ స్కూల్ విద్యార్థిని ఢీకొట్టిన బైక్, తీవ్రగాయాల పాలైన చిన్నారి

Hazarath Reddy

రంగారెడ్డి - షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Telangana High Court: మురికివాడ ప్రజలకు దశాబ్దాలు దాటినా పరిహారం ఇవ్వరా? కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ భూసేకరణ అధికారి, కమిషనర్‌లపై హైకోర్టు ఆగ్రహం

Hazarath Reddy

హైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌, బాపూనగర్‌లోని సర్వే నంబర్లు 58, 59, 60లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల భూమి సేకరణ తర్వాత పరిహారం ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దశాబ్దాలు దాటినా మురికివాడల్లోని ప్రజల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది.

Telangana: ఆ 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, అవన్నీఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపిన ధర్మాసనం, ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం

Hazarath Reddy

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది.

AP Assembly Elections 2024: మళ్లీ జగన్ సర్కారుదే అధికారం, నవరత్నాలే కారణం, సినీ నటుడు సుమన్ ఆసక్తిర వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అంద­జేయడంతో మరోసారి వైఎస్సార్‌ సీపీ ప్రభు­త్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్‌ చెప్పారు.

Advertisement

CM Jagan in Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, ఏపీకి రావలసిన నిధులు,బకాయిలపై చర్చ, హోంమంత్రి, ఆర్థికమంత్రిలతో కూడా సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై ధ్వజమెత్తే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tomato Prices: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు, ఏకంగా రూ. 150కి చేరిన కిలో టమాటా ధర, మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

VNS

కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతున్నది.

Hyderabad: వీడియోలు ఇవిగో, మద్యం తాగి మృతి చెందిన మందుబాబు, అతన్ని బయటకు లాగి పడేసిన వైన్స్ నిర్వాహకులు, కోపంతో షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

హైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు.

Rains In AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే?

VNS

నైరుతి రుతుపనాల (Monsoon) ప్రభావంతో ఆంధ్రప్రదేశంలో వర్షాలు (Rains in AP) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా

Advertisement
Advertisement