రాష్ట్రీయం

Pawan Kalyan: సొంత చిన్నాన్న రక్తం జగన్ చేతికి అంటుకుని ఉంది, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడా..కత్తిపూడి వేదికగా కత్తులు దూసిన జనసేనాని పవన్ కళ్యాణ్

kanha

కత్తిపూడి వేదికగా పొలిటికల్ కత్తులు దూశారు జనసేనాని పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో కక్ష గట్టి ఓడించారని.. కానీ..ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు పవన్.

Elephants Enter Village: అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు, హడలిపోయిన పార్వతీపురం జిల్లా వాసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లా పూజారిగూడ గ్రామంలోకి ఏడు ఏనుగుల గుంపు ప్రవేశించగా వాటిలో కొన్ని బకెట్లు, కంటైనర్‌లో ఉంచిన నీటితో దాహం తీర్చుకున్నాయి. గ్రామస్తులు రెండు బకెట్లలో నిల్వ ఉంచిన నీటిని ఏనుగులు తాగుతున్న దృశ్యాలు కనిపించాయి.

Amit Shah Telangana Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు, జేపీ నడ్డా సభ యథావిధిగా కొనసాగుతుందని తెలిపిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్

Hazarath Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది.

Distribution of Nutrition Kits: కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రశేఖర్ రావు, మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్స్‌ ప్రయోజనం

Hazarath Reddy

రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు.

Advertisement

Telangana: రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు, రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Hazarath Reddy

హైదరాబాద్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారన్నారు.

TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

IT Raids on BRS Leaders Houses: బీఆర్ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు, మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు, రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాల్లోనూ సోదాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు అవుతున్నాయి

Hyderabad Girl Died in London: లండన్‌లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన బ్రెజిల్‌ యువకుడు, మరో తెలుగు యువతికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో తెలంగాణకు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని రెడ్డి లండన్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా..వారిలో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Goods Train Derailed: అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్, వందేభారత్ సహా పలు ట్రైన్ల రాకపోకలు నిలిపివేత, జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు రద్దు

VNS

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు (Goods train) పట్టాలు తప్పింది (Derailed). దక్షిణమధ్య రైల్వే (SCR) పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య (Thadi-Anakapalle) బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది.

KCR Nutrition Kit: రేపు నిమ్స్ ఆసుపత్రిలో న్యూట్రిష‌న్ కిట్ల పంపిణీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టనున్న సీఎం కేసీఆర్, న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం మొత్తం 24 జిల్లాల్లో పంపిణీ

kanha

గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌లు’ అనే మరో మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు న్యూట్రిష‌న్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి నిమ్స్ లో శ్రీ‌కారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్.

TS ECET 2023 Result Out Check Here: తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల.. 93.07 శాతం ఉత్తీర్ణత.. 22,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,899 మంది ఉత్తీర్ణత..

kanha

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా TS ECET 2023 ఫలితాలను ప్రకటించింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ecet.tsche.ac.inలో తమ మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.

AP Inter Supplementary Result 2023 live: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి.. ఫస్టియర్‌లో 37.77 శాతం, సెకండియర్‌లో 42.36 శాతం ఉత్తీర్ణత..

kanha

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2023, ఈరోజు, 13 జూన్ 2023, సాయంత్రం 5 గంటలకు ప్రకటించింది. AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు bie.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

Advertisement

Teachers Transfer in AP: ఏపీలో 56,829 మంది టీచర్ల బదిలీలు, వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీలు చేపట్టిన విద్యాశాఖ

Hazarath Reddy

ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది.

Kishan Rao Karad Met CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మర్యాదపూర్వక భేటీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ సమావేశమయ్యారు.

TSRTC: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇచ్చిన టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది.

AP Employee Union Leaders Meet CM Jagan: తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడమే కోరుకుంటుంది, ఉద్యోగ సంఘాల భేటీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్‌ నిర్ణయాలు, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి

Advertisement

CM Jagan Mohan Reddy Action Plan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు, వైద్య, ఆరోగ్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

Hazarath Reddy

వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు.

AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని సూసైడ్‌ కేసులో కొత్త ట్విస్ట్, డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు

Hazarath Reddy

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ కేసులో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ ముందుకు వచ్చిన సునీతా రెడ్డి

Hazarath Reddy

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

Advertisement
Advertisement