ఆంధ్ర ప్రదేశ్

Devaragattu: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం, కర్రల సమరంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు, 100 మందికి పైగా గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

VNS

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అంనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు.

TDP Janasena First Coordination Meeting: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం హైలెట్స్ ఇవిగో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా

Hazarath Reddy

టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం (TDP Janasena Alliance First Meeting) రాజమహేంద్రవరంలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు.

Lokesh-Amit Shah Meeting Row: అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషే, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Hazarath Reddy

టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌​‍ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్‌ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషేనని తెలిపారు.

Immersion of Durga Idols: నేటి నుంచే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం.. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Rudra

దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Advertisement

Chandrababu Letter: రాజమండ్రి జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బ‌హిరంగ లేఖ..నేను జైలులో లేను..ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను..

ahana

తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. నేను జైలులో లేను.. ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయ‌లేరు అని చంద్రబాబు లేఖలో తెలిపారు.

Varla Ramaiah on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు చనిపోయాడనే బాధతో, గుండె బరువుతో 154 మంది చనిపోయారని తెలిపిన వర్ల రామయ్య

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు చనిపోయాడని బాధతో, గుండె బరువుతో రాష్ట్ర వ్యాప్తంగా 154 మంది చనిపోయారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నోరెళ్లబెడుతున్నాయి. చూసుకుని మాట్లాడాలని మండిపడుతున్నాయి.

Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు

Rudra

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు

Rudra

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Weather Forecast: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, ఈనెల 23తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ

Hazarath Reddy

నేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

Cyclone Hamoon Update: సైక్లోన్ హమూన్ అప్‌డేట్ ఇదిగో, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా బలపడితే హమూన్‌గా నామకరణం

Hazarath Reddy

నేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో విడుదల

Hazarath Reddy

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Navratri 2023: వీడియో ఇదిగో, కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌, అంతరాలయంలో ప్రత్యేక పూజలు

Hazarath Reddy

కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

AP FiberNet Scam Case: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట, ముందస్తు బెయిల్‌‌పై విచారణ నవంబర్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి

Rudra

ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు.

CM YS Jagan in Kodali Nani Niece Wedding: వీడియో ఇదిగో, కొడాలి నాని మేనకోడలు పెళ్లికి హాజరైన సీఎం జగన్, వధూవరులను ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మేనకోడలు వివాహా వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌. కంకిపాడు అయాన కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్‌ దీపక్‌లను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురును వాతావరణ శాఖ అందించింది.ముఖ్యంగా ఏపీలో మళ్లీ వానలు భారీగా కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.

Advertisement

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు కోసం ఓయూలో ఉరేసుకుని వినూత్నంగా నిరసన

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వినూత్నంగా ఉరి తాళ్లతో ఉరేసుకుని నిరసన తెలిపారు.

Andhra Pradesh: అర్చకులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

YSR Lifetime Achievement Awards: వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ గ్రహితలు వీరే, నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు అవార్డులు ప్రదానం

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు.

Skill Development Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ, దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ అయింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది.

Advertisement
Advertisement