ఆంధ్ర ప్రదేశ్

Corona in AP: ఏపీలో కొత్తగా 154 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో 30, విశాఖ జిల్లాలో 20 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 30, విశాఖ జిల్లాలో 20 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 177 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

Chittoor Car Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం, కల్వర్టును ఢీకొట్టి కారులో చెలరేగిన మంటలు

Naresh. VNS

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి(Chandragiri) మండలం ఐతేపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.

Rosaiah Last Rites: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు, అశ్రునయనాల మధ్య ఆయన వీడ్కోలు పలికిన అభిమానులు, హాజరైన నేతలు

Naresh. VNS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Rosaiah) అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ(AP) ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ(Bosta Sathyanarayana), వెల్లంపల్లి(Vellampally), పేర్నినాని(Perni Nani), బాలినేని(Balineni) హాజరయ్యారు.

Cyclone Jawad: జవాద్ తుపాను ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను ముప్పు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Naresh. VNS

ఉత్తరాంధ్రను మరో తుపాను(Cyclone) వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం శుక్రవారం ఉ.11.30 గంటలకు తుపాను(Cyclone)గా మారింది. దీనికి జవాద్‌(Jawad) అని పేరు పెట్టారు.

Advertisement

Konijeti Rosaiah Political Journey: కొణిజేటి రోశయ్య జీవితంలోని ప్రధాన ఘట్టాలు ఇవే, 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ తోనే అనుబంధం, విద్యార్థినేత నుంచి సీఎం వరకూ ప్రయాణం..

Krishna

రోశయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.

Konijeti Rosaiah Passed Away: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత, ముగిసిన శకం, సీఎం జగన్ సంతాపం..

Krishna

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం, గంటకు 30 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తున్న జవాద్, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో, ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను (Cyclone Jawad) కేంద్రీకృతమైంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు (Tropical Cyclonic Storm Likely To Hit South Odisha Coast) దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Minister Kannababu) తెలిపారు.

Guntur Shocker: వీడు కొడుకేనా... తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని రోకలిబండతో తల్లిని చంపేశాడు, రక్తపు మడుగులో పడి ఉంటే వదిలేసి పరార్ అయ్యాడు, గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే రోకలిబండతో మోది ( Son brutally killed mother) హతమార్చాడో కసాయి కొడుకు. జిల్లాలోని వల్లూరులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని తెలిపిన ఏపీ సీఎం జగన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan reddy ) తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఉదయం తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Cyclone Jawad: మరో గండం..నేడు జవాద్ తుపానుగా మారనున్న వాయుగుండం, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాళాళాతంలో జవాద్‌ తుపానుగా (Cyclone Jawad) మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

Coronavirus in AP: ఏపీలో కొత్తగా 159 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,263 కరోనా శాంపిళ్లు పరీక్షించగా, 159 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

AP Floods 2021: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్, రేపు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.​ వరదలతో (andhra-pradesh Floods) చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు

Advertisement

Cheddi Gang Video: కర్రలు పట్టుకుని చెడ్డీ గ్యాంగ్ ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూడండి, విజయవాడలో అలజడి రేపుతున్న చెడ్డీ గ్యాంగ్, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

Hazarath Reddy

ఐదుగురు అగంతకులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేత బట్టుకుని, చెడ్డీలపై అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. అర్ధరాత్రి సమయంలో అలికిడి అవ్వటంతో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ యజమానికి అనుమానం వచ్చి వెంటనే క్యారీడార్‌లో లైట్లు వేశాడు. దీంతో ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారు.

AP Shocker: నన్ను వదిలేసి భర్తతో కాపురం చేస్తావా.., మహిళను కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రియుడు, కడప జిల్లా పులివెందుల మహిళా హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు

Hazarath Reddy

కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పులివెందుల పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో బుధవారం ఉదయం రిజ్వానా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యలో ప్రియుడే ఆమె పాలిట (Woman brutally murdered) కాలయముడయ్యాడు.

AP Floods: వీడియో..సీఎం జగన్ ముందు బోరున విలపించిన మహళలు, అంద‌రినీ ఆదుకుంటామ‌ని ధైర్యం చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం

Hazarath Reddy

సీఎం జ‌గ‌న్‌ ను చూసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల మ‌హిళ‌లు క‌న్నీరు ఆపుకోలేక‌పోయారు. బోరున విల‌పిస్తూ త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. అంద‌రినీ ఆదుకుంటామ‌ని జ‌గ‌న్ ధైర్యం చెప్పారు.

Cyclone Jawad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

Hazarath Reddy

ఉత్తరాంధ్రపై జవాద్ తుపాను విరుచుకుపడుుతన్న నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయింది. జవాద్ ఎఫెక్ట్ (Cyclone Jawad) కారణంగా తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) ప్రకటించింది.

Advertisement

Movie Ticket Rates in AP: ఏపీలో సినిమా టికెట్ రేట్ల లిస్ట్ ఇదే, కొత్త ధరలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని స్పష్టం, సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన దర్శకేంద్రుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సర్కార్.. రాష్ట్రంలో కొత్త టికెట్ ధరలు (Movie Ticket Rates in AP) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌తో (CM YS Jagan) మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదు.

APSRTC: పండగవేళ ఆర్టీసీ బస్సులో సీటు దొరకదనే బెంగను వదిలేయండి, 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోండి, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్నిపెంచిన ఏపీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్‌ (advance seat reservation) చేసుకునేందుకు అవకాశం ఉంది.

Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా..ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

Hazarath Reddy

అల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

Andhra Pradesh Floods: నడకదారిలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండ చరియలు, యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

వరదలకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిప‌డ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి.

Advertisement
Advertisement