ఆంధ్ర ప్రదేశ్

AP Capital Move Row: అమరావతి కేసులు నేటి నుంచి హైకోర్టులో విచారణ, 90కి పైగా పిటిషన్లను విచారించనున్న హైకోర్టు ఛీప్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం

Hazarath Reddy

హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Chief Justice Prashant Kumar Mishra) ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ వ్యాజ్యాలపై నేటి నుంచి రోజువారీ విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ కేసులను హైబ్రిడ్ పద్ధతుల్లో హైకోర్టు (Andhra Pradesh high court) విచారించనుంది.

AP Panchayat Election Results 2021: పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులదే హవా, 27 సర్పంచ్‌, 47 వార్డు స్థానాలు కైవసం, పెండింగ్ పంచాయితీ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్‌ పదవుల్ని, 47 వార్డుల్ని అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

AP Municipal Election 2021: ఏపీలో ప్రారంభమైన పురపాలక ఎన్నికల పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్, నవంబర్ 17న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఏపీలో వివిధ కారణాల వల్ల ఏపీలో ఆగిపోయిన మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Municipal Election 2021) ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు పోలింగ్ (AP Municipal And Nagar Panchayat Elections 2021) కొనసాగుతోంది.

Amit Shah in Andhra Pradesh : స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్న అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యను ప్రశంసల్లో ముంచెత్తిన షా..

Krishna

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్సికోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

AP CM Jagan, Amit Shah : తిరుపతిలో ప్రారంభమైన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్ హాజరు, తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా..

Krishna

ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మై, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్‌ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం జగన్‌ సత్కరించారు.

Earthquake in Visakhapatnam: వైజాగ్‌లో భూకంపం, భవనాలు వదిలిపి రోడ్డుపైకి పరుగులెత్తిన జనం, ఊడిపడ్డ భవనాల పెచ్చులు, విశాఖ వాసుల్లో ఆందోళన..

Krishna

Earthquake in Visakhapatnam: ఏపీలోని విశాఖపట్టణంలో భూమి కంపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావటంతో నగర వాసులు ఆందోళనకు గురయ్యారు.

Guntur: ఈసీజీ పరీక్ష పేరుతో యువతి నగ్నఫోటోలు తీసిన ఆసుపత్రి అటెండర్, దారుణం...

Krishna

పాత గుంటూరుకు చెందిన యువతికి పరీక్షలు చేస్తున్న సమయంలో ఆమె దుస్తులు తొలగించి ఉండగా, ఆమెను హరీష్‌ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు.

YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్, బయటపడ్డ బడాబాబుల పేర్లు..

Krishna

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా బాబుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు

Advertisement

AP MLC Elections 2021: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నామని తెలిపిన పార్టీ ప్రధాన కార్యదర్శి

Hazarath Reddy

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను (YSRCP MLC candidates) పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని ఆయన (Sajjala Ramakrishna Reddy) చెప్పారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 262 మందికి కరోనా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,362 కరోనా పరీక్షలు నిర్వహించగా, 262 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 38, గుంటూరు జిల్లాలో 33, కృష్ణా జిల్లాలో 31 కేసులు వెల్లడయ్యాయి.

Corona in AP: ఏపీలో కొత్తగా 286 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో 53 మందికి పాజిటివ్, రాష్ట్రంలో ముగ్గురి మృతి

Hazarath Reddy

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 37,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 286 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 36, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 30 కేసులు వెల్లడయ్యాయి.

Andhra Pradesh Rains: దూసుకొస్తున్న తుఫాను, విద్యుత్ సమస్య ఉంటే వెంటనే 1912కు ఫోన్ చేయండి, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన APSPDCL MD హెచ్. హరనాథ రావు

Hazarath Reddy

తుఫాను ఏపీని వణికిస్తోంది. భారీ వర్షాలు పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అలర్ట్ అయింది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు (APSPDCL MD Haranatha Rao) ఆదేశించారు.

Advertisement

Andhra Pradesh Rains: తుఫాను ముప్పు, నీట మునిగిన నెల్లూరు, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అదేశాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

Hazarath Reddy

భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

YSRCP MLC Candidates: మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏపీ సీఎం జగన్, మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు, ఇక పలుచోట్ల ఏకగ్రీవంగా మారిన జెడ్పీటీసీలు

Hazarath Reddy

ఏపీలో మూడు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను (YSRCP MLC Candidates) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan ) ఖరారు చేశారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు.

Tamil Nadu Rains: ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

Corona in AP: ఏపీలో కొత్తగా 348 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు నమోదు కాగా... కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Advertisement

Tamil Nadu Rains: దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తుఫానుగా రూపాంతరం (soon with possibility of cyclone) చెందే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

AP PGECET Results 2021: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత, అనంతపురంలో కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల (AP PGECET Results 2021) చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు.

CM YS Jagan Odisha Tour: నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ, జల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం

Hazarath Reddy

ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM YS Jagan meet Odisha CM Naveen Patnaik ) ముగిసింది. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 231 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో 37, తూర్పు గోదావరి జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 31 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 231 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 37, తూర్పు గోదావరి జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement
Advertisement