ఆంధ్ర ప్రదేశ్

Kakinada RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన, ప్రమాదంలో సగం వరకు కాలిపోయిన ఇంద్ర బస్, బస్సులో ఉన్న 15 మంది సేఫ్

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో (Kakinada RTC Bus Fire) అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు (Fire Breaks Out In RTC Bus At Kakinada) రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.

AP MPTC, ZPTC Elections 2021: టీడీపీ అవుట్, బీజేపీ సై, నిజమైన ప్రతిపక్షం మాదేనంటున్న సోము వీర్రాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహష్కరించిన టీడీపీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన బీజేపీ

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 8న జరగనున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము పోటీలో లేమని ప్రజలు గమనించాలని కోరారు. ఇక బీజేపీ ఎన్నికల్లో (AP MPTC, ZPTC Elections 2021) పోటీ చేస్తున్నామని స్పష్టం చేసింది.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1288 కోవిడ్ కేసులు నమోదు, ప్రతి ఒక్కరు కరోనా మార్గదర్శకాలు పాటించాలని, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండగా, చాలా చోట్ల జనం కోవిడ్ నిబంధనలు విస్మరించి రథయాత్రలు, ఇతర వేడుకల్లో పాల్గొంటుండం ఆందోళన కలిగిస్తుంది.....

Election Code in AP: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్, ఆఖిలపక్షంతో భేటీ అనంతరం స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, భేటీకి బీజేపీ, టీడిపీ మరియు జనసేన పార్టీల గైర్హాజరు

Team Latestly

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ అన్నారు. శుక్రవారం నాడు అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్నీ, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు....

Advertisement

Heatwaves Over AP & TS: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాబోయే మూడు రోజుల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ

Team Latestly

రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం ఉండడం వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో

AP ZPTC MPTC Elections 2021: ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8న పోలింగ్‌, 10న ఫలితాలు, ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

Hazarath Reddy

ఏపీలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ (AP ZPTC MPTC elections 2021) విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

AP's COVID19 Report: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఏపి సీఎం వైఎస్ జగన్, అర్హులైన ప్రతీ ఒక్కరు టీకా కోసం ముందుకు రావాలని పిలుపు; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1271 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు జగన్ సతీమణి భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన పౌరులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఈ కోటాలో సీఎం జగన్ టీకా తొలి డోస్ అందుకున్నారు....

AP Covid Report: వృద్ధులకు మళ్లీ కరోనా వస్తే చాలా డేంజర్, ఏపీలో కరోనా విశ్వరూపం, తాజాగా 1,184 మందికి కరోనా, నలుగురు మృతితో 7217 కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,184 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Report) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 456 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

Cylinders blast in Nadnyal: సిలిండర్ల పేలుళ్లతో దద్దరిల్లిన నంద్యాల, హోటల్ మూసి ఉండడంతో తప్పిన ప్రాణాపాయం, మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది, 15 వరకు సిలిండర్లు బ్లాస్ట్

Hazarath Reddy

నంద్యాల నగరం సిలిండర్ల పేలుళ్లతో దద్ధరిల్లింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం (Cylinder blast in Nadnyal) తప్పింది. కర్నూలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే నంద్యాల చెక్ పోస్టు దగ్గర హోటల్లో సిలిండర్ల పేలుళ్లు (Cylinder Blast) బీభీత్సం సృష్టించింది. మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్డాలు, మంటలను చూసిన జనం ఎం జరుగుతుందో అర్థం కాక ప్రాణ భయంతో పరుగులు తీశారు.

Heatwave Hits Telugu States: బయటకు రాకండి..వస్తే మాడిపోతారు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఎండలు, మే నెల రాకముందే మొదలైన వడగాడ్పులు, మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు (Heatwave Hits Telugu states) వీస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

Vizag Shocker: ఎనిమిది మంది భార్యలతో వ్యభిచారం, చేయకుంటే కూతుర్ని వ్యభిచార ముఠాకు అమ్మేస్తానంటూ బెదిరింపులు, విశాఖలో నిత్యపెళ్లికొడుకు లీలలు, నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ సీపీ ఆదేశాలు

Hazarath Reddy

విశాఖఫట్నంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు 8 మంది మహిళల్ని (married 8 Women) వివాహం చేసుకుని వారితో వ్యభిచారం (adultery) చేయించేందుకు రెడీ అయ్యాడు.

Minor Girl Rescued: బాలికను కిడ్నాప్ చేసి..అత్యంత దారుణంగా హింసించిన దివ్యాంగుడు, భిక్షాటన చేయాలని ఒత్తిడి, బాలిక ఒప్పుకోకపోవడంతో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన తణుకు పోలీసులు

Hazarath Reddy

సాతూర్‌కు చెందిన మేరీదాస్‌ అనే తొమ్మిదేళ్ల బాలికను మూడేళ్ల క్రితం బలవంతంగా ఎత్తుకుని (kidnapped a girl) వచ్చాడు. ఆమెతో తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

Advertisement

Visakapatnam Shocker: భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య, మరో చోట కాపురానికి పనికిరాని భర్త, భార్యను వదిలించుకునేందుకు వేధింపులు, అత్తింటి ఎదుట బాధితురాలు ధర్నా

Hazarath Reddy

భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని చనిపోయాడు. మరోచోట కాపురానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి అత్తింటి ముందు ధర్నాకు దిగింది.

NimmaGadda Ramesh kumar: తన ఓటు హక్కు అడగడం వల్లే ఈ గొడవంతా, ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్‌ వంటిది, ప్రభుత్వ తోడ్పాటుతోనే స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం, మీడియాతో నిమ్మగడ్డ రమేష్ కుమార్

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుండటంతో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుపానులా సమసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ( AP SEC Nimmagadda Ramesh Kumar) అభిప్రాయపడ్డారు.

Vote on Account Budget: కోవిడ్‌ వల్ల ఆదాయం లేదు, అనవసర ఖర్చులు తగ్గించండి, ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపుల పనులకే బిల్లులు ఇవ్వండి, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌

Hazarath Reddy

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసుల నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ (Finanace ministry) సూచించింది. కోవిడ్‌ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆయా రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ (Vote on Account Budget) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

Nimmagadda Ramesh Kumar: నేటితో ముగియనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం, దొరకని గవర్నర్ అపాయింట్‌మెంట్, కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని రేపు బాధ్యతలు, ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా దొరకలేదని తెలుస్తోంది.గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ నిమ్మగడ్డ (AP SEC Nimmagadda Ramesh Kumar) నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్‌ ఆసక్తి చూపలేదని వార్తలు వస్తున్నాయి.

Advertisement

AP Coronavirus: మాస్క్ ధరించండి, జరిమానా తప్పించుకోండి, మాస్క్ మస్ట్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న ఏపీ పోలీసులు, తాజాగా 993 మందికి కరోనా, ముగ్గురు మృతితో 7,213కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Tirumala: కోవిడ్19 దృష్ట్యా శ్రీవారి దర్శనం టికెట్లను తగ్గించిన టిటిడి పాలకమండలి, పరిస్థితి తీవ్రమైతే ఇప్పుటికే బుక్ అయినవి కూడా రీషెడ్యూల్, కరోనా లక్షణాలుంటే భక్తులు తిరుమల రావొద్దని సూచన

Team Latestly

ఏప్రిల్ 14 నుండి నిర్వహించబోయే అర్జిత సేవల కార్యక్రమాలను కూడా టిటిడి పున: సమీక్షిస్తోంది. అలాగే తిరుమల లేదా తిరుపతిలోని భక్తులకు కేటాయించే వసతి గృహాల్లో ఒక గదిలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వసతి కల్పించాలని టిడిపి నిర్ణయించింది. తిరుమల వచ్చే అన్ని వాహనాలకు....

AP Coronavirus: ఏపీలో తాజాగా 993 మందికి కరోనా, నాలుగు జిల్లాల్లోనే అధికం, ముగ్గురు మృతితో 7,213కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, రాష్ట్రంలో 6,614 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి (Covid Deaths) చెందారు. ఇదే సమయంలో 480 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Vijayawada City Police: మాస్కులు ధరించకుంటే భారీగా జరిమానాలు, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన విజయవాడ నగర పోలీసులు, కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో అలర్ట్

Hazarath Reddy

విజయవాడ సిపి శ్రీ బి. శ్రీనివాసులు ఆదేశాలపై, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ముసుగులు మరియు జరిమానాలు విధించడంపై నగర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కోవిడ్ కేసుల పెరుగుదల ఉన్నందున ముసుగు ధరించాలని విజయవాడ నగర పోలీసులు ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నారు

Advertisement
Advertisement