ఆంధ్ర ప్రదేశ్

Vijayawada Murder Attempt: విజయవాడలో దారుణం, కారుపై పెట్రోలు పోసి ముగ్గురి వ్యక్తుల సజీవ దహనానికి నిందితుడు ప్రయత్నం, డబ్బుల వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని విజయవాడలో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి (Vijayawada Murder Attempt) కారణమైంది. బెజవాడ నోవాటల్ హోటల్ వద్ద కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో జరిగిన డబ్బులు వ్యవహారమే (Vijayawada Real Estate Spat) హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్‌ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

Swarna Palace Fire Accident: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం, రమేష్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు, కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే ఎవరికైనా నోటీసులు ఇస్తామని తెలిపిన ఏసీపీ సూర్యచంద్రరావు

Hazarath Reddy

ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద దుర్ఘటనకు (Swarna Palace Fire Accident) సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్‌ కార్డియాక్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు (Dr. P. Ramesh Babu) ఆగస్టు 17న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారని తెలిపారు.

Heavy Rains Alert in AP: మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు

Hazarath Reddy

ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains Alert in AP) కురవనున్నాయి. తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం (AP IMD) వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP coronavirus: కరోనాపై ఏపీలో భారీ ఊరట, రెండు లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ కేసులు 84,777, గత 24 గంటల్లో 6,780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్‌ (AP coronavirus)నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య (Coronavirus Cases) 2,09,100కి పెరిగింది. గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్‌ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి.

Advertisement

Manish Kumar Sinha: విశాఖకు కొత్త బాస్, ఆర్కే మీనా స్థానంలో బాధ్యతలు స్వీకరించిన మనీష్ కుమార్ సిన్హా, విశాఖ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపిన మాజీ సీపీ ఆర్కే మీనా

Hazarath Reddy

విశాఖకు కొత్త పోలీస్ వచ్చారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా (Manish Kumar Sinha) బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి వరకు సీపీగా పని చేసిన రాజీవ్ కుమార్ మీనా (RK Meena) నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేశారు. డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సీపీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Chandrababu Letter to PM Modi: వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది, ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ (Chandrababu Letter to PM Modi) రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతోందని. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని (YSRCP Govt Tapping Phones of Opposition Parties) లేఖలో ఆరోపించారు.

Heavy Rain Floods: మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను వరదలు (Heavy Rain Floods) ముంచెత్తాయి. రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rians Hits Telugu States) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం దశ, దిశ ఇప్పటివరకు తెలియకపోవటంతో... ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో తెలియడం లేదు.

AP Coronavirus Updates: పెళ్లికొడుకుకి కరోనా, 500 మందిలో మొదలైన టెన్సన్, ఏపీలో తాజాగా 8,012 కేసులు, గత 24 గంటల్లో 10,117 మంది డిశ్చార్జ్‌, 2,89,829కి చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా నుంచి ఆదివారం ఒక్కరోజు 10,117 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,01,234కి చేరింది. గడిచిన 24 గంటల్లో 48,746 మందికి పరీక్షలు చేయగా 8,012 మందికి పాజిటివ్‌గా (Andhra Pradesh Coronavirus) తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) 2,89,829కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది.రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28,60,943 పరీక్షలు నిర్వహించారు. తాజాగా 88 మంది మృతితో (Coronavirus Deaths) మొత్తం మరణాలు 2,650కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 85,945 ఉన్నాయి.

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,732 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,81,817కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 2500 దాటిన కరోనా మరణాలు

Team Latestly

తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1126 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరు జిల్లా నుంచి 959 కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా కొత్త కేసులు వచ్చాయి....

AP Coronavirus Updates: ఏపీలో లక్షా ఎనభై వేలు దాటిన కోవిడ్ డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ రద్దు, ఏపీలో తాజాగా 8,943 కేసులు, ప్లాస్మా దానం చేయాలని కోరిన గవర్నర్

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 53,026 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు (AP Coronavirus) జ‌ర‌ప‌గా 8,943 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,70,190కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి‌వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 1,80,703కు చేరుకుంది. తాజాగా వైర‌స్ బాధితుల్లో 97 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం మృతుల సంఖ్య 2475గా (Coronavirus Deaths) ఉంది. ప్ర‌స్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో (AP Medical Health Department) పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.

AP Entrance Exams New Dates: ఏపీలో సెట్స్‌ నిర్వహణ తేదీలు ఖరారు, సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, అన్ని పరీక్షల తేదీల వివరాలు లోపల కథనంలో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది.

#IndependenceDay 2020: రెండు తెలుగు రాష్ట్రాలకు 30 అవార్డులు, ఉత్తమ సేవలందించిన పోలీసులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం, వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట

Hazarath Reddy

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) పోలీసు సిబ్బందికి పతక పురస్కారాల జాబితాను #IndependenceDay 2020 లో ప్రకటించింది. 215 మంది సిబ్బందికి ధైర్యసాహసాలకు పోలీసు పతకం, 80 మంది విశిష్ట సేవలకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 631 మంది మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీస్ మెడల్ పొందారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు (Police Personnel) కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కేంద్ర హోంశాఖ వివిధ రాష్ష్ర్టాల నుంచి ఉత్తమ సేవలందించిన 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 80 మందిని ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌కు​ , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది.

Advertisement

Amaravati Farmers: రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు, చట్టంలో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించాం, ఈ నిర్ణయం ఏకపక్షం కాదు, హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

గత కొంత కాలంగా ఏపీలో రాజధాని మార్పు మీద రగడ జరుగుతున్న విషయం విదితమే. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులును తీసుకువచ్చిన సంగతి విదితమే. దీంతో అమరావతి రైతులకు (Amaravati capital region Farmers) అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ( AP High Court) ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గతవారం విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ, అప్పటి వరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

CM Jagan Key Decesion: జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం, ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య, సమగ్ర సర్వే కోసం కమిటీల ఏర్పాటు, అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వులు

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం (CM Jagan Key Decesion) తీసుకున్నారు. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య (New survey on industries) కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో జగన్ ప్రభుత్వం వెల్లడించింది.

AP Coronavirus Report: ఏపీలో తాజాగా 9,996 కేసులు, 2,64,142కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 2378కు చేరిన మొత్తం మరణాల సంఖ్య, రికార్డు స్థాయిలో 27,05,459కు పెరిగిన టెస్టులు

Hazarath Reddy

ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 55,692 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా 9,996 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Coronavirus Report) 2,64,142కు చేరుకుంది. తాజాగా 9,499 మంది క‌రోనాను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం రిక‌వ‌రీ కేసుల కేసుల సంఖ్య (Recoveries) 1,70,924గా ఉంది. క‌రోనా కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 82 మంది ప్రాణాలు (Covid-19 Deaths) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ ప‌రీక్ష‌ల సంఖ్య 27 ల‌క్ష‌లు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య‌ 27,05,459కు చేరుకుంది.

Dogs Eat Patient's Dead Body: శవాన్ని పీక్కుతిన్న కుక్కలు, ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ ఘటన, వీడియోని షేర్ చేసిన చంద్రబాబు, స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు

Hazarath Reddy

ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సబ్బంది ( GGH Staff) పట్టించుకోలేదు. దీంతో చివరకు ఈ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు (Dogs Ate Patient Body)వార్తలు గుప్పుమన్నాయి. ఈ దారుణ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా మంగళవారం తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ముమ్మాటికీ మనుషుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా అగౌరవ పరచటమే. ఈ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ దారుణాన్ని ఖండించేందుకు కూడా నాకు మాటలు రావట్లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

AP SSC Result 2020 Declared: ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల, పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాస్, మార్కుల వివరాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ 10 వ తరగతి పరీక్షల ఫలితాలను (AP SSC 10th Result Declared) ఆంధ్రప్రదేశ్ బోర్డు (సెకండరీ ఎడ్యుకేషన్) విడుదల చేసింది.10 వ తరగతి పరీక్షలకు హాజరైన 6.39 లక్షల మంది విద్యార్థులు వెబ్‌సైట్- bse.ap.gov.in మరియు manabadi.com ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, COVID-19 మహమ్మారి పరిస్థితుల కారణంగా పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులందరికీ పదోన్నతి లభించింది. ఈ ఏడాది ఎస్‌ఎస్‌సి పరీక్షకు హాజరైన 6.39 లక్షల మంది విద్యార్థులకు పదోన్నతి లభించింది.

ABCD Awards in AP: ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట, క్రైమ్ డిటెక్షన్ సాధించినందుకు 103 మంది పోలీసులకు ఎబిసిడి అవార్డులు, జాతీయ స్థాయిలో 26 అవార్డులు, సంతోషం వ్యక్తం చేసిన డీజీపీ సవాంగ్

Hazarath Reddy

రాష్ట్ర పోలీసు కార్యాలయంలో బుధవారం క్రైమ్ డిటెక్షన్ సాధించినందుకు కానిస్టేబుల్ నుండి డిఎస్పి స్థాయి వరకు 103 మంది పోలీసు సిబ్బందికి ఉత్తమ నేర గుర్తింపు (ABCD awards) అవార్డును పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ (Director General of Police D Gautam Sawang)అందజేశారు. రాష్ట్రంలో గత తొమ్మిది నెలలుగా నమోదైన పలు కేసుల దర్యాప్తులో సత్తా చాటి, శిక్షలు పడేలా చేసిన పోలీసు అధికారులకు ఆయన ఏబీసీడీ అవార్డులు (Award for the Best Crime Detection) అందజేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్‌ బాస్‌ మాట్లాడారు.

Penmatsa Suresh Babu: ఎన్నికవడం లాంఛనమే, వైసీపీ తరపున ఎమ్మెల్సీ స్థానానికి పెన్మత్స సురేష్‌ బాబు నామినేషన్, ఈ నెల 24న ఎమ్మెల్సీ ఎన్నిక, పెనుమత్స సాంబశివరాజు తనయుడే ఈ సురేష్ బాబు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌ బాబు (Penmatsa Suresh Babu) గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

CM Jagan Review: అమరావతిలో నిర్మాణాలపై ఏపీ సీఎం రివ్యూ, ప్రారంభానికి సిద్ధమైన కనకదుర్గ ఫ్లైఓవర్‌, 15వ తేదీ సాయంత్రం వరకు విజయవాడలో పలు ఆంక్షలు

Hazarath Reddy

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై (Amaravathi Metropolitan Area Development) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement