ఆంధ్ర ప్రదేశ్
COVID-19 in AP: కర్నూలును కలవరపెడుతున్న కరోనా, ఆ జిల్లాలో 84కి చేరిన కరోనా కేసులు, ఏపీలో 432కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు (positive coronavirus cases) నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.
AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
AP Lockdown: రోడ్డుపై ఉమ్మి వేస్తే జైలుకే, కరోనా నివారణకు మరో నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష
Hazarath Reddyఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం (Spitting pan, tobacco products), ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై బ్యాన్ విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు.
COVID-19 in AP: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు, 5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyకరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు (Free Masks) పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ (AP CM YS jagan) ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష (CM Jagan Review Metting) నిర్వహించారు.
Tribes Corona Leaf Masks: అడవి బిడ్డలకు ఆకులే మాస్కులు, ఎన్90 మాస్కులు కొనేందుకు చేతిలో డబ్బులు లేవు, వ్యాధి గురించి అవగాహన లేదు, అయినా కరోనాని తరిమేస్తున్న గిరిజనులు
Hazarath Reddyఏజెన్సీ ప్రాంతాల (Tribal areas) ప్ర‌జ‌ల‌కు ఎప్పూడూ క‌ష్టాలే. ఇప్పుడు తాజాగా క‌రోనా (Coronavirus) క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. క‌నీసం మాస్కులు లేక ఆకుల‌నే మాస్కులుగా (Tribes Corona Leaf Masks) తయారుచేసి క‌ట్టుకుంటున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల కథ.. ఏపీలో (Andhra Pradesh) అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో (Vizianagaram, Srikakulam) ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే అక్కడి గిరిజన చైతన్యం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు కరోనాని ఎలా తరిమేస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.
Covid-19 Pandemic in AP: ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు, కొత్తగా 24 కేసులు నమోదు, గుంటూరులో ఏప్రిల్12న పూర్తిగా కర్ఫ్యూ అమలు
Hazarath Reddyఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు (Covid 19 pandemic in AP) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. తాజా కేసులు జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
Telugu States Lockdown: తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, రెండు వారాలు పొడిగించాలన్న కేసీఆర్, రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలన్న జగన్, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు
Hazarath Reddyలాక్‌డౌన్ (India Lockdown) 21 రోజులు గడువు ఏప్రిల్ 14తో పూర్తి అవుతున్న నేపథ్యంలో దాన్ని పొడిగించాలా వద్దా అనే విషయంపై ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video conference) నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెజార్టీ ముఖ్యమంత్రులు (chief ministers) లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు.
AP Red Zone Areas: ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు, రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లు ఇకపై పోలీసుల వలయంలో.., ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసుల నమోదు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ (coronavirus in AP) విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా (AP Red Zones) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Justice V Kanagaraj: ఏపీకి నయా ఎస్‌ఈసీ, నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ, కనగరాజ్ పూర్తి ప్రొపైల్ గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా (AP new State Election commissioner) రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ ( Justice V. KanagaRaj) శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని (Retired Justice) నియమించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది
Electricity Bills in AP: గత నెల కరెంట్ బిల్లే ఈ నెల కట్టండి, స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి, లాక్‌డౌన్‌ వేళ ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదన్న డిస్కమ్‌లు
Hazarath Reddyమార్చి నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లులే (Electricity bills) ఏప్రిల్‌ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (APERC) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (COVID-19 Lockdown) కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాయి.
Nimmagadda Ramesh Kumar: ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్, నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి
Hazarath Reddyఏపీ ప్రభుత్వం (AP Govt) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా (State Election Commissioner) ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. దీనికి సంబందించి నిబంధనలు సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Governor Bhusan Haricchandan) ఆమోదం తెలిపారు. ఎస్.ఇ.సి.పదవి కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
COVID-19 In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు, ఏపీలో 381కి చేరిన కరోనా కేసులు, తెలంగాణలో 487కు చేరిన కరోనావైరస్ కేసులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (COVID-19 In Telugu States) రొజు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్ 19 (COVID-19) కట్టడికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States CMs) ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు నియంత్రణ కావడం లేదు. రోజు రోజుకు సరికొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ (Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.
COVID-19 in AP: వైద్య సేవలందిస్తున్నవారికి సెల్యూట్, వారి సేవలు వెల కట్టలేనివంటూ కొనియాడిన ఏపీ సీఎం జగన్, కరోనా కట్టడిపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌
Hazarath Reddyకరోనా మహమ్మారిపై (COVID-19) జరుగుతున్న యుద్దంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) కొనియాడారు. ప్రతి జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రులు, క్రిటికల్‌ ఆస్పత్రుల్లో వీరంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా చర్యలపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM YS Jagan Video conference) ద్వారా మాట్లాడారు.
AP Coronavirus Cases: ఏపీలో కరోనాతో ఆరుమంది మృతి, 363కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య, మర్కజ్‌ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లినవారివే అత్యధికం, ప్రత్యేక ఫోకస్ పెట్టిన వైయస్ జగన్ సర్కారు
Hazarath Reddyఏపీలో రోజు రొజుకు కరోనావైరస్ కేసులు (AP Corona Cases) తగ్గుముఖం పట్టినట్లే పట్టి పెరుగుతున్నాయి. మొన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరిపీల్చుకునే లోపు మళ్లీ కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Corona Positive Cases in AP) 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
COVID19 Emergency Package: కోవిడ్-19పై పోరాటానికి రాష్ట్రాలకు రూ. 15 వేల కోట్ల అత్యవసర నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సహా దేశంలోని 9 రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాల తరలింపు
Vikas Mandaఈ నిధులను ప్రధానంగా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ -19 చికిత్సకు సౌకర్యాల కల్పన, వైద్య పరికరాలు మరియు చికిత్సకు అవసరమయ్యే ఔషధాల ఉత్పత్తి, భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగా సిద్ధంగా ఉండేలా ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి పరచటానికి ఉపయోగించనున్నారు......
Bulking 'Quarantine' Meal in AP: కరోనావైరస్ రోగ నిరోధక శక్తికి 'జగనన్న గోరుముద్ద', విజయవాడలోని క్వారైంటైన్ కేంద్రంలో డ్రై ఫ్రూట్స్ మరియు గుడ్లతో పౌష్టికాహారం, రాష్ట్రవ్యాప్తంగా ఇదే మెనూ అమలు పరచాలని ప్రభుత్వం ఆదేశాలు
Vikas Mandaరాష్ట్రంలోని విజయవాడ, గన్నవరం తదితర క్వారైంటైన్ కేంద్రాలలో 'జగనన్న గోరుముద్ధ' పథకం కింద అందించే ఆహారంలో జీడిపప్పు, బాదాం, ఖర్జూరం, గుడ్లు, అరటిపండ్లు శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన 'ఆరోగ్య ఆంధ్ర' విభాగం తెలిపింది......
Mahesh Babu Salutes Police: సెల్యూట్ తెలంగాణ పోలీస్ అంటున్న సూపర్ స్టార్ మహేశ్, కఠిన సమయాల్లో దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా, నిస్వార్థంగా శ్రమిస్తున్న పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్
Vikas Mandaఇంతటి కఠిన సమయాల్లో మా ప్రాణాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని మా కాపాడుతున్న తెలంగాణ పోలీసులకు అపారమైన కృతజ్ఞతలు. ఈ దేశం పట్ల, దేశంలోని ప్రజల పట్ల మీరు ప్రదర్శిస్తున్న నిస్వార్థమైన అంకితభావానికి నా సెల్యూట్" #TelanganaPolice #StayHomeStaySafe అంటూ మహేశ్ ట్వీట్....
Andhra Pradesh: గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నమోదు కాని కరోనావైరస్ కేసులు, గత 12 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 0, రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న అధికారులు
Vikas Mandaరాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే సాయంత్రం వరకు 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. అయితే ఇందులో 9 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.....
India Lockdown: ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తివేయలేం, కోవిడ్-19 సంక్షోభం తర్వాత మునిపటిలా జీవితం ఉండకపోవచ్చు, అఖిలపక్షం సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, 11న సీఎంలతో టెలి కాన్ఫరెన్స్
Vikas Mandaఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడగింపుపై కోరుతున్నాయి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతామని ప్రధాని తెలిపారు. ఏదేమైనా లాక్డౌన్ ముగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.