ఆంధ్ర ప్రదేశ్

AP CM Review Meeting: మరిన్ని ఉద్యోగాలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం, విద్యుత్‌రంగంపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ సర్కారు (AP Govt) పరిపాలనలో ముందుకు దూసుకువెళుతోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. కాగా విద్యుత్‌రంగంపై (Power Sector) బుధవారం సీఎం జగన్‌ సమీక్ష (AP CM Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.

Polavaram Project: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి, ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం, మేఘా సంస్థ, ఈ నెల 27న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఊపందుకుంది. గోదావరి నదిపై (Godavari River) కడుతున్న ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. దేశంలోనే పెద్దదైన ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం, మేఘా సంస్థలు (Megha Engineering) ప్రణాళికలు రూపొందించాయి. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన విషయం విదితమే.

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమీషన్, త్వరలో ఖాళీ అవుతున్న 55 స్థానాలకు మార్చి 26న పోలింగ్

Vikas Manda

17 రాష్ట్రాల నుంచి మొత్తం 55 రాజ్యసభ స్థానాలు ఈ ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 2 మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించేసింది.....

Andhra Pradesh: మదనపల్లెలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు

Vikas Manda

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు ఇరవై ఎనిమిది మంది సాక్షులను హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరస్థుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.....

Advertisement

Jagananna Vasathi Deevena: ప్రతిపక్షం కాదది రాక్షసత్వం! చంద్రబాబును రాక్షసుడితో పోల్చిన సీఎం జగన్, విద్యార్థుల కోసం మరో ప్రతిష్ఠాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం

Vikas Manda

ప్రతిపక్షం దానిని ఓర్వలేక తమ పత్రికలు, మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు, రాక్షసత్వం అని, ప్రతిరోజు రాక్షసులతో యుద్ధం చేస్తున్నామంటూ చంద్రబాబు మరియు ఆయన బృందాన్ని సీఎం జగన్ రాక్షసులతో పోల్చారు.....

Kanakadurga Flyover: విజయవాడ వాసుల కష్టాలు తీరినట్లే, తుది దశలో కనక దుర్గ ఫ్లైఓవర్ పనులు, ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్, ఆ తరువాత వాహనాలకు అనుమతి

Hazarath Reddy

బెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం (Kanaka Durga Flyover) తుదిదశకు చేరుకుంది. ఈ ఫ్లైఓవర్‌ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరు-ఏప్రిల్ మొదటివారంలోగా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Sujana and Rayapati: వేలానికి సుజనా చౌదరి, రాయపాటి ఆస్తులు, రాయపాటి ఆస్తులను వేలం వేయనున్న ఆంధ్రా బ్యాంక్, సుజనా చౌదరి ఆస్తుల వేలానికి నోటీసులు పంపిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ సుజనాచౌదరి (Yalamanchili Satyanarayana Chowdary), అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులకు (Rayapati Sambasiva Rao) భారీ షాక్ తగిలింది. వారికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి.

Amaravati Bandh: నేడు అమరావతి బంద్, ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ, 29 గ్రామాల్లో కొనసాగుతున్న బంద్, 67వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో ఆందోళన చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. దీనికి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఇవాళ బంద్‌కు చేపడుతున్నారు. 29 గ్రామాల్లో బంద్‌ (Amaravati Bandh) జరుగుతుందని జేఏసీ ప్రకటించింది.

Advertisement

Special Investigation Team: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు, జీవోలో పోలీస్ స్టేషన్ ప్రస్తావన, ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు

Hazarath Reddy

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని అమరావతిలో (AP capital Amaravati) భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) (Special Investigation Team (SIT)) జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Intermediate Exam Admit Card 2020: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షల 2020 అడ్మిట్ కార్డుల విడుదల, డౌన్‌లోడ్ చేసుకునే విధానంతో పాటు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ పొందవచ్చు

Vikas Manda

రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వొచ్చు. ఇంటర్ 1వ, 2వ సంవత్సరం హాల్ టికెట్లు 2020 డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.in ను సందర్శించాలి.....

Happy Maha Shivaratri Wishes: హరహర మహాదేవ శంభో శంకర, మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహాదేవుడి మహిమను తెలిపే శివ సూక్తులు, Lord Shiva Telugu Quotes, Maha Shivaratri Subhaakankshalu, Shivaratri Messages శివరాత్రి పర్వదినం విశిష్టతను తెలుసుకోండి

Vikas Manda

ఈ శివరాత్రి రోజున మీకు పరమశివుని కరుణాకటాక్షాలు కలగాలనే ఆకాంక్షతో శిననామస్మరణను స్పురించే సూక్తులు, శివరాత్రి సందేశాలు వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్, మహా శివరాత్రి శుభాకాంక్షలతో అందజేస్తున్నాం.....

Chandrababu's Security Cover: బాబుకు జడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం, ఫేక్ వార్తలను కొట్టి పడేసిన ఏపీ డీజీపీ కార్యాలయం, మొత్తం 183 మందితో భద్రతను ఇస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (TDP chief N Chandrababu Naidu) భద్రతకు సంబంధించి ఏపీ డీజీపీ కార్యాలయం (AP DGP Office) కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు భద్రతను కుదించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతలో (Chandrababu Naidu's Security Cover)ఎలాంటి మార్పు జరగలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

YSR Kanti Velugu: అవ్వా తాతలకు మనవడి భరోసా, గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు, వైయస్సార్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మూడో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలులో (Kurnool) ఈ కార్యక్రమాన్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

New Pension Cards: ఏపీలో కొత్త పెన్సన్ కార్డులు వచ్చేశాయి, నేటి నుంచి పంపిణీ చేయనున్న గ్రామ వాలంటీర్లు, కొత్తగా ఫించన్ మంజూరైన వారికి పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు

Hazarath Reddy

ఇటీవలే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం (AP Govt) పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త కార్డులను (New Pension Cards) పంపిణీ చేయబోతుంది. నేటి నుంచి లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు.

Technology Sabha Awards: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు, పోలీసు వీక్లీ ఆఫ్‌ విధానానికి తొలి అవార్డు, టెక్నాలజీ సభ అవార్డ్స్‌–2020 పేరిట ఒడిశాలో జాతీయ సెమినార్

Hazarath Reddy

ఏపీ పోలీస్ శాఖకు (Andhra Pradesh Police Department) అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు పలు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వరించాయి.

Jagan Meets Amit Shah: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ‘దిశ’ చట్ట రూపం దాల్చాలి, శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టండి, అమిత్ షాతో భేటిలో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Home minister Amit Shah) భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించారు. నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ఏపీ సీఎం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు.

Advertisement

How To Use Disha App: దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుందా, పూర్తి వివరాలు మీ కోసం

Hazarath Reddy

హిళల భద్రత (Women Safety) కోసం ఏపీ ప్రభుత్వం (AP government) ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై (Disha App) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొం‍దించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

AP Voters List Released: రాష్ట్రంలో 4 కోట్లను దాటిన ఓటర్ల సంఖ్య, 11 జిలాల్లో మహిళా ఓటర్లే అధికం, పెరిగి ధర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య, వివరాలను వెల్లడించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ 

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్వహించిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (K Vijayanand) శుక్రవారం విడుదల చేశారు.

Weekend Getaways From HYD: వీకెండ్ మునుపెప్పుడూ లేనంతగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే!

Vikas Manda

హైదరాబాదుకు కేవలం 300 కి. మీ పరిధిలోనే ప్రకృతి రమణీయమైన చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవిలో నుంచి జారే జలపాతం, సఫారీ రైడ్, స్వచ్ఛమైన తాటికల్లు, అచ్ఛమైన దేశీ నాటుకోడి కూర ఇంకా ఎన్నో అనుభూతులు.

No Non-veg Week in AP: ఏపీ గోదావరి జిల్లాల్లో కలకలం, వైరస్ వ్యాపించి వేలల్లో చనిపోతున్న కోళ్లు, మాంసాహారం తినటానికి జనం బెంబేలు, నాన్- వెజ్ హాలిడే ప్రకటన

Vikas Manda

తణుకు పట్టణంలో నాన్- వెజ్ బంద్ కు పిలుపునిచ్చారు. తణుకు అసెంబ్లీ ఎమ్మెల్యే కరుమూరి వెంకటనాగేశ్వరరావు పట్టణంలో ‘ నో నాన్-వెజ్ వీక్’ ప్రకటించారు. పౌల్ట్రీ ఫామ్స్‌లోని వేలాది కోళ్ళకు ప్రాణాంతక వైరస్ సోకింది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వారం నాన్-వెజ్ హాలిడే ప్రకటించాము" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు....

Advertisement
Advertisement