ఆంధ్ర ప్రదేశ్
Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyసుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది.
Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, చంపొద్దు నాన్నా అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి, కాల్వలోకి తోసి తను మాత్రం ఈదుకుంటూ..
Hazarath Reddyపల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ అప్పుల బాధతో కన్న కూతుళ్ళని చంపాడు. వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరి అయిన నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.. ఇతనికి ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) ఉన్నారు.
Jagan Districts Tour: ఇకపై రెండు రోజుల పాటు కార్యకర్తలతోనే, వైఎస్ జగన్ కీలక నిర్ణయం, సంక్రాంతి తర్వాత జిలాల పర్యటనకు శ్రీకారం
Hazarath Reddyవైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.
Jagan Districts Tour: 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు, మనలో పోరాటం ఆగకూడదు, వైసీపీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyనేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.
Jagan Meeting With Party Leaders: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి, ఇకపై కార్యకర్తలతోనే ఉంటానని స్పష్టం చేసిన వైఎస్ జగన్
Hazarath Reddyవైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు
Smuggling Ration Rice in Kakinada: బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ? కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్
Hazarath Reddyకాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫానుతో వణుకుతున్న తమిళనాడు, ఏపీలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం సైక్లోన్ ఎక్కడ ఉందంటే..
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Cyclone Fengal Live Tracker: రానున్న 3 గంటల్లో ఫెంగల్ తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం, ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తీవ్ర అల్పపీడనం
Hazarath Reddyశుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు IMD విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ఈ వ్యవస్థ ట్రింకోమలీకి ఈశాన్యంగా 290 కి.మీ, నాగపట్టణానికి తూర్పున 290 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 320 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో ఉంది.
Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పిఠాపురం వాసులు, వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
Hazarath Reddyరాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ, పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగారు..సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమా పై బాధితులు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు .అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు
Andhra Pradesh Shocker: మడకశిరలో బాలుడి అదృశ్యం..దారుణ హత్య, కర్ణాటకలో శవమై కనిపించిన 8వ తరగతి విద్యార్థి
Arun Charagondaసత్య సాయి జిల్లా మడకశిరలో దారుణం చోటు చేసుకుంది. ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిన్నటి దినం 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ అదృశ్యం అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇవాళ మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో బాలుడి హత్య చేయబడి శవంగా కనిపించారు విద్యార్థి చేతన్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Naga Babu On Rajya Sabha Seat: రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు.. స్వార్థం తెలియని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పవన్ అని తెలిపిన నాగబాబు
Arun Charagondaరాజ్యసభకు తాను వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు మెగాబ్రదర్ నాగబాబు.నాకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవు అని తెలిపారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)
Rudraఅనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు స్థిరంగా ఉందని, ఇది మరో 12 గంటల్లో ఫెంగల్ తుఫానుగా మారుతుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది
Ram Gopal Varma: పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు, మరో బాంబు పేల్చిన వర్మ, ఎక్స్లో ప్రశ్నలు సంధించిన వివాదాస్పద దర్శకుడు
Hazarath Reddyవిచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా దీనిపై వర్మ ఎక్స్ వేదిగా ఓ స్టోరిని వదిలాడు ఆ స్టోరీలో వర్మ.. అన్ని న్యూస్ ఛానళ్లను ట్యాగ్ చేశారు. పాయింట్ల వారీగా అందులో రాసుకొచ్చారు.