ఆంధ్ర ప్రదేశ్

Maha Padayatra In Amaravathi: అమరావతిలో 20వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు, 10 వేల మంది రైతులతో మహా పాదయాత్ర, జాతీయ జెండాలతో రోడ్డు మీదకు వచ్చిన రైతులు, సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు

Hazarath Reddy

మూడు రాజధానుల ప్రకటనకు( 3 Capital Issue) నిరసనగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు(Farmers Protest) కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని(Amaravathi)కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు మహా పాదయాత్రను(Maha Padayatra) నిర్వహించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు.

Vaikunta Dwara Darshanam: వైకుంఠ దర్శనం రెండు రోజులే, ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ, వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన కలియుగ వైకుంఠం

Hazarath Reddy

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో (High Court) నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ (TTD Board) బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది.

Tourist Bus Caught Fire: మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు, శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం, 18 మందికి గాయాలు, గాయపడిన వారిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలింపు, వెనుక నుంచి మరొక బస్సు బలంగా ఢీకొట్టడంతో ఘటన, ( వీడియో)

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా (Srikakulam) పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్‌ బస్సు మంటల్లో కాలి (Tourist Bus Catches Fire)బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్‌ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి.

AP Capital-Political Row: దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని, బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టమన్న చంద్రబాబు, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

AP Disha Police Station: ఏపీలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్, జిల్లాకు ఒక దిశ ప్రత్యేక కోర్టు, ఈనెల 7 నుంచి దిశ యాప్‌ అందుబాటులోకి, నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం, రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిటింగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh GOVT) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం (Disha Act) ఏపీలో (AP)త్వరలో అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్‌ను(Disha Police Station) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దిశ చట్టం అమలులో భాగంగా కాకినాడ నగరంలో(Kakinada) దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

Anantapur School Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, జోగ్ జలపాతం వద్ద లోయలో పడిన అనంతపురం జిల్లా స్కూల్ బస్సు, విద్యార్థి మృతి, 46 మందికి గాయాలు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్, తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

అనంతపురం జిల్లా కదిరి (Kadiri) నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి (Kadiri School Bus Accident) గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం(Jog Falls) వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

Amma Vodi: జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు, 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం, అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

అమ్మఒడి పథకం (Amma Vodi Scheme)లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(AP Education Minister Suresh) తెలిపారు. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.

Hyderabad Rains: రాజధానిలో అకాల వర్షాలు, 1992 తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు,మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తనున్న వానలు, ఏపీకి భారీ వర్ష సూచన

Hazarath Reddy

కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే హైదరాబాద్లో (Hyderabad)ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు..వానలు.. మూడురోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబరు వరకు చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నగరంలో 14 మి.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement

AP Capitals Row-Amarnath Reddy: ఏపీ రాజధానిగా తిరుపతిని చేయండి, లేదా చిత్తూరును సగం తమిళనాడులో, మిగతా సగం కర్ణాటకలో కలపండి, సరికొత్త వాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో తెలిపిన మూడు రాజధానుల అంశం(3 Capitals row) ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తోన్న రైతులు.. శుక్రవారం సకలజనుల సమ్మె చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) ఇదివరకే ప్రకటించారు. అయితే టీడీపీకే చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (Ex Minister Amarnath Reddy) మాత్రం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

YSR Aarogyasri: నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌, ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం, ఆరోగ్య శ్రీపై జగన్ కీలక నిర్ణయాలు ఇవే

Hazarath Reddy

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం (YSR Aarogyasri Scheme) పైలట్‌ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు (Eluru) ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును (YSR Arogyasri Pilot Project) ఆయన ప్రారంభించారు.

YCP Leader Murder Plan: వైసీపీ నేత హత్యకు కుట్ర, శ్రీకాకుళం జిల్లాలో కలకలం, సుపారీ గ్యాంగును అరెస్ట్ చేసిన పోలీసులు, హత్య చేసేందుకు రూ.10 లక్షల డీల్ మాట్లాడుకున్న సుపారీ గ్యాంగ్

Hazarath Reddy

కాకుళం జిల్లాలో సుపారీ హత్య పన్నాగం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిను హతమార్చేందుకు దుండగులు కుట్ర చేశారు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. పోలీసులు ఆ గ్యాంగును అరెస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

AP Capital: తేలిపోనున్న మూడు రాజధానుల సంగతి, నేడు ఏపీ సీఎంకు నివేదికను అందించనున్న బీసీజీ, నెలఖారున తుది నివేదికను ఇవ్వనున్న హై పవర్ కమిటీ, రాజధాని ఏర్పాటు విషయంలో కీలకం కానున్న బోస్టన్ నివేదిక

Hazarath Reddy

ఏపీ రాజధానిపై (Andhra Pradesh Capital) సమగ్ర నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Boston consultancy gruop) నేడు ఏపీ సీఎం వైయస్ జగన్(CM YS Jagan)కు అందించనుంది. ఏపీ రాజధాని ఏర్పాటులో (AP Capital City) సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపును ఏపీ ప్రభుత్వం(AP GOVT) నియమించిన సంగతి విదితమే. ఈ గ్రూపు తుది నివేదికను నేడు అందించనుంది.

Advertisement

Sakala Janula Samme: శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె, మలిదశ ఉద్యమానికి సిద్ధమైన అమరావతి ప్రజలు, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపి వేస్తామని హెచ్చరిక

Vikas Manda

కొన్ని గ్రామాలు కలిసి సేవలు నిలిపివేస్తే తమంతటతామే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప, దానితో ఒరిగేదేమి లేదని కొన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరావతి నిరసనలు కేవలం ఒక సామాజిక వర్గం, టీడీపీ మరియు వారి అనుబంధ మీడియా ....

Pushpa Srivani TikTok: సీఎం జగన్ పాటపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ , మూడు రాజధానులపై అమరావతిలో కొనసాగుతున్న వేళ వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం వీడియో

Vikas Manda

ఉపముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి టిక్ టాక్ వీడియోలు చేయడం పట్ల మరికొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏపి ఉపముఖ్యమంత్రి ప్రజాసేవను మరిచి టిక్ టాక్ వీడియోలతో బిజీగా ఉన్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు....

Tirupati Laddu Free: ఇకపై తిరుపతి లడ్డు అందరికీ ఉచితం, జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీటీడీ, రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం

Hazarath Reddy

తిరుపతి లడ్డులంటే(Tirupati Laddu) చాలామందికి ఎంతో ఇష్టం. తిరుపతికి వెళ్లలేని వారు ఎలాగోలా వాటిని తెప్పించుకుని ఆ ఏడుకొండల వాడు కరుణ కటాక్షం పొందుతుంటారు. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)(Tirumala Tirupati Devasthanam) నూతన సంవత్సరానికిగానూ తీపి కబురు అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు (TTD Laddu Free) అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది.

AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Telugu Doctors Missing In Delhi: ఢిల్లీలో మిస్సింగ్ కలకలం, ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం, 6 రోజులైనా దొరకని ఆచూకి, పోలీసులకు కంప్లయింట్ చేసిన సమీప బంధువు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకా క్లూ కూడా చిక్కని వైనం

Hazarath Reddy

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం(Telugu Doctors Missing) కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ జిల్లా (YSR Kadapa) ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా (Ananthapuram) హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య డిసెంబర్‌ 25 నుంచి కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్‌ పోలీస్‌స్టేషన్‌లో (Hauz Khas police station) ఫిర్యాదు చేశాడు.

Niti Aayog's Index-2019: సుస్థిర అభివృద్ధిలో సత్తా చాటిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, తొలి స్థానంలో కేరళ, చివరి స్థానంలో బిహార్. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం

Vikas Manda

నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (NITI Ayog) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు భారతదేశంలోనే 3వ స్థానంలో నిలిచాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కినెట్టి తెలంగాణ....

AP Entrance Exam Shedule: ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదల, ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో..,లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) (APCETs-2020common entrance test) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Educational minister Adimulapu Suresh) సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను(AP EAMCET-2020) నిర్వహించనున్నారు. ఐసెట్‌ను(AP ICET-2020) ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు.

AP Political Row: అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసారంటూ విమర్శలు

Hazarath Reddy

తెలుగుదేశంపార్టీ(TDP) ఏపీ రాజధాని మార్పు (AP Capital Change) అంశం మీద అధికార పార్టీపై (YSRCP)నివురు గప్పిన నిప్పులా మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

Advertisement
Advertisement