ఆంధ్ర ప్రదేశ్

YS Jagan Visits Anakapalle: అచ్యుతాపురం సెజ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, బాధితులతో మాట్లాడిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆరా

Arun Charagonda

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు మాజీ సీఎం జగన్. బాధితులతో మాట్లాడారు. అక్కడి డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుండి అనకాపల్లికి చేరుకున్నారు జగన్.

YS Jagan Gives Shock To Duvvada Srinivas: వైసీపీలో పెను మార్పులు,దువ్వాడకు షాకిచ్చిన జగన్, టెక్కలి ఇంఛార్జీగా పేరాడ తిలక్, కొత్త అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం కొల్పోవడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చారు జగన్‌. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా పేరడా తిలక్‌ను నియమించారు.

Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

Rudra

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Advertisement

Jagan Slams CM Chandrababu: మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్‌ చేశారు.

Anakapalle Pharma Company Explosion: అయ్యో..ఒక్కరోజు ఆగినా ప్రాణాలతో బతికేది, సోదరుడికి రాఖీ కట్టి ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన హారిక

Hazarath Reddy

మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది.

YSRCP Opposing Waqf Bill: వక్ఫ్‌ బిల్లును అంగీకరించేది లేదు, మరోమారు తేల్చి చెప్పిన వైసీపీ అధినేత జగన్, ముస్లిం మైనారిటీలతో భేటీ

Hazarath Reddy

వక్ఫ్‌ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి

Hazarath Reddy

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..

Hazarath Reddy

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.

Mega Fan Extraordinary Gift To Chiranjeevi: చిరంజీవికి ఫ్యాన్ అదిరే గిఫ్ట్...3D పెయింటింగ్‌లో చిరు ఫోటోలో రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్!

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు ఓ అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కనిపించేలా 3D ఫెయింటింగ్ వేశారు. కుప్పంకు చెందిన కళాకారుడు పురుషోత్తం.. చిరంజీవి ఫోటోలో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.

Nellore Oil Factory Fire: వీడియో ఇదిగో, అనకాపల్లి పేలుడు జరిగిన గంటల వ్యవధిలో నెల్లూరు ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Hazarath Reddy

అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు(D) పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి

Andhra Pradesh Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌

Hazarath Reddy

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Anakapalle Pharma Company Explosion: ఆగస్టు 23న అనకాపల్లిలో రియాక్టర్ పేలిన ప్రమాదస్థలానికి జగన్, బాధితులకు అండగా నిలవాలని స్థానిక వైసీపీ నాయకులకు ఆదేశాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై ఏపీ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి, గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎస్ అబ్దుల్ నజీర్

Hazarath Reddy

అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీ కర్మాగారంలో జరిగిన పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం విచారం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Reactor Explosion in Anakapalle: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం, రేపు అచ్యుతాపురంలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

Reactor Explosion in Anakapalle: విషాదకర వీడియోలు ఇవిగో, మంటల్లో మాడిమసైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

Advertisement

Andhra Pradesh Factory Blast: పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 50 మందికి గాయాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Andhra Pradesh Shocker: కడపలో ఘోర విషాదం, సైకిల్ మీద వెళుతున్న విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సైకిల్ మీద వెళుతున్న ఇద్దరు పిల్లలకు కింద రోడ్డు మీద ఉన్న లైవ్ఈ ఘటనలో కరెంట్ తీగ తగిలింది 10వ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరొకరు లైవ్ వేలాడే తీగలతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

Manta Ray Fish Caught in AP: వీడియో ఇదిగో, జాలరులకు చిక్కిన 1,500 కిలోల బరువున్న మంటా రే చేప,ప్రపంచంలోనే అతి పెద్ద చేపలలో ఇది ఒకటి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని మినీ హార్బర్‌లో ఓ మత్స్యకారుడు సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన జెయింట్ ఓషియానిక్ మాంటా రే చేపను జేసీబీ యంత్రం సాయంతో ఒడ్డుకు చేర్చారు

Chittoor Food Poisoning: చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, వాంతులు,విరేచనాలతో ఆస్పత్రిపాలైన 70 మంది విద్యార్థులు

Hazarath Reddy

చిత్తూర్ అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు,విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Advertisement
Advertisement