తెలంగాణ
BJP MLA Raja Singh: జానీ మాస్టర్ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన
Arun Charagondaలైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్పై తనదైన శైలీలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కీలక సూచన చేశారు. అరెస్టు చేసిన తర్వాత హంతకులు, దొంగలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో.. అదేవిధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Boxer Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం, నియామక పత్రం అందజేసిన డీజీపీ జితేందర్
Arun Charagondaబాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నారు నిఖత్. మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ ఉండనుంది. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్కు సవరణ చేసి నిఖత్కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను ప్రభుత్వం ఆదేశించింది.
Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్, రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందన్న భట్టి
Arun Charagondaఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ పై రెండు రోజుల్లో క్లారిటీ రానుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ముందుగా 21లోపు కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నా ...అనివార్య కారణాల వల్ల క్లారిటీ రాలేదని చెప్పారు.
Hyerabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్, కాసేపటి తర్వాత పునరుద్దరణ!
Arun Charagondaహైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్లోనే ట్వీట్ వేశారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
Kumari Aunty Donates Rs 50,000: వీడియో ఇదిగో, వరద బాధితుల కోసం రూ. 50 వేలు సాయం ప్రకటించిన కుమారి ఆంటీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నగదు అందజేత
Hazarath Reddyకుమారి అంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తనవంతుగా సాయం చేసినందుకు అభినందించారు.
Kamareddy School Bus Fire: వీడియో ఇదిగో, బ్యాటరీ పేలి ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు, భయంతో కేకలు వేసిన విద్యార్థులు
Hazarath Reddyవేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు.
CM Revanth Reddy On MSME Policy: ఎంఎస్ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaరాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
Ganesh Visarjan 2024: చార్మినార్ వద్ద బురఖాతో యువతి, అసలు నిజం ఇదిగో, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి చార్మినార్ వద్దకు వచ్చిన హిందూ అమ్మాయి
Hazarath Reddyమీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది
Telangana High Court On BRS Office: బీఆర్ఎస్కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చాల్సిందేనని ఆదేశాలు, ఫైన్ కూడా విధించిన న్యాయస్థానం
Arun Charagondaనల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు నోటీసులు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.
IPS Trainees To Telugu States: ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం, లిస్ట్ ఇదే!
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు) కేటాయించగా తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్)ను కేటాయించింది.
CM Revanth Reddy: ఎంఎస్ఎమ్ఈ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో MSME పాలసీ-2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Ayodhya Ram Temple: అయోధ్య బాలరాముడికి కేజీ బంగారం, 13 కిలోల వెండితో ధనస్సు, భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించిన తెలంగాణ భక్తులు
Arun Charagondaఅయోధ్య రాముడికి 13 కిలోల వెండి, ఒక కేజీ బంగారం తో తయారుచేసిన ధనస్సును గిఫ్ట్గా అందించనున్నారు తెలంగాణకు చెందిన భక్తుడు చల్లా శ్రీనివాసరావు. ఈ ధనస్సుకు దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేస్తున్న క్రమంలో ఇవాళ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు
KTR on CM Revanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, సెటైర్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో సీఎం బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
Clash In Jagtial BJP: జగిత్యాల బీజేపీలో వర్గపోరు, వినాయక నిమజ్జనం సందర్భంగా కొట్టుకున్న బీజేపీ నేతలు..వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల జిల్లా బీజేపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా జగిత్యాలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణికి నిమజ్జన కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రావణిని అడ్డుకున్నారు బీజేపీ నేత ముదుగంటి రవీందర్ రెడ్డి. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Ganesh Visarjan 2024: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్ను క్లియర్ చేస్తున్న పోలీసులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.
Telangana Arogya Mithras Strike: తెలంగాణలో సమ్మెకు దిగిన ఆరోగ్య మిత్ర సిబ్బంది, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్
Arun Charagondaతెలంగాణలో ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం. 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే వెంటనే విధుల్లో చేరుతామని తెలిపారు.
New UPI Fraud: కొత్త తరహా యూపీఐ మోసం, పొరపాటున యూపీఐకి డబ్బు వచ్చిందని మెస్సేజ్, తిరిగి పంపించామో అంతే..పోలీసుల అలర్ట్
Arun Charagondaరోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసరుతునే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో రూపంలో క్రైమ్కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొత్త తరహా యూపీఐ మోసానికి తెరలేపారు. పొరపాటున గూగుల్ పే కి కొంత డబ్బు వచ్చిందంటూ అమౌంట్ నంబర్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు.
Hyderabad Ganesh Immersion: లక్షకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ, అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులోనని వెల్లడి, ప్రశాంతంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం
Arun Charagondaతెలంగాణలోని జంట నగరాలైన సికింద్రాబాద్ - హైదరాబాద్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఇక ఇప్పటివరకు 1లక్ష 2510 గణనాధులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు.
Hyderabad Man Dies in Canada: పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు, కెనడాలో ఈతకు వెళ్లి తెలుగు యువకుడు మృతి
Hazarath Reddyఈతకు వెళ్లిన తెలుగు యువకుడు దుర్మరణం పాలైన ఘటన కెనడా (Canada)లో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)కు చెందిన ప్రణీత్ అనే యువకుడు ఎంఎస్ (MS) చేసేందుకు కెనడాకు వెళ్లాడు. అయితే ఈనెల 14న అతడి పుట్టిన రోజు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్ ప్రాంతానికి ఔటింగ్కు వెళ్లాడు.
Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి,ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.