తెలంగాణ
Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని 2 వేల మంది విద్యార్థుల నిరసన
Arun Charagondaబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.
Money Fraud In Hyderabad: హైదరాబాద్లో రూ.500 కోట్ల భారీ మోసం, ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి, అధిక వడ్డీ ఆశతో డబ్బులు వసూలు, బోర్డు తిప్పేసిన కంపెనీ
Arun Charagondaహైదరాబాద్లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను ముంచేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ. ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. రెండు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువ కావడంతో మాదాపూర్లోని ఆఫీసుకి తాళం వేసి.. పరారయ్యారు . హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు
Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్, రంగనాథ్ సీరియస్, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు...వీడియో
Arun Charagondaహైడ్రా పేరుతో పలువురు బిల్డర్లను బెదిరిస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైడ్రా పేరుతో కమిషనర్ రంగనాథ్ పేరు చెప్పి రూ.20 లక్షలు ఇవ్వాలంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోనూ MCOR Projects బిల్డర్లను బెదిరించాడు ఓ కేటుగాడు.
Mallareddy Funny Video: మల్లారెడ్డి - ఈటల రాజేందర్ ఫన్నీ సంభాషణ, ఫోటోలు మంచిగ రావాలని కామెంట్, ఈటలపై సరదా జోకులు...వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కీసర ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈటల, మల్లారెడ్డి.
Harishrao On Khammam Floods: ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం, ఎంపీ - ఎమ్మెల్యే- ఎమ్మెల్సీల ఒక నెల జీతం విరాళం ప్రకటించిన హరీశ్ రావు
Arun Charagondaఖమ్మం వరద బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వరద బాధితులను ఆదుకోవాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
Telangana Horror: మెదక్ జిల్లాలో దారుణం, దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు మీద వేశారని ముగ్గురిపై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి, ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ మెదక్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో రాములు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలపై గ్రామస్తుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాములు మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
IMD Weather Alert: విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది.
Telangana Floods: వీడియో ఇదిగో, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించలేం, రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyకేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Telangana Rains: మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Khammam: బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి అని వెల్లడి
Arun Charagondaనిన్న ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన కారు హరీశ్రావుదే అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసిన రామ్మోహన్..కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి.. అందులో హరీశ్రావు కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
Heavy Rains In Medaram: మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్
Arun Charagondaభారీ వర్షాల ప్రతాపం మేడారం అడవులపై తీవ్ర ప్రభావం చూపింది. మేడారం-తాడ్వాయి మధ్య వేల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలి దుమారంతో 5కి.మీ పరిధిలో ఎటు చూసినా చెట్లు నాశనమయ్యాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Car Crash In USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి, పూర్తిగా కాలిపోయిన శరీరాలు
Arun Charagondaఅమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. మంటల్లో పూర్తిగా శరీరాలు కాలిపోయాయి. ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్పల్లి, హైదరాబాద్),ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్),దర్శిని వాసుదేవన్ (తమిళనాడు), పాలచర్ల లోకేష్ చనిపోయిన వారిలో ఉన్నారు.
Hyderabad Rains : హైదరాబాద్లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్లు
Arun Charagondaభాగ్యనగరం హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన
Vikas Mఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్
Hazarath Reddyరాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.
Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, చేపలు పట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితుడు
Hazarath Reddyమెదక్ జిల్లాలో వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. టేక్మాల్ మండలం గుండు వాగులో ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు గుండు వాగు బ్రిడ్జి పైకి వెళ్లిన కల్లూరుకు చెందిన రమావత్ నందు (45) ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకుపోతున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
CM Revanth Reddy on Khammam Floods: తాను ఫామ్ హౌస్లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి
Hazarath Reddyఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు (CM Revanth Reddy on Khammam Floods) వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు.
Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డివి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టే పిచ్చి మాటలు, ప్రభుత్వం వరదలపై ప్రజలను అలర్ట్ చేయలేదంటూ మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Hyd Traffic Police Issues Advisory: ఆ మూడు రోజులు గచ్చిబౌలి నుండి లింగంపల్లి వెళ్లే ప్రయాణిలకు అలర్ట్, ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyసెప్టెంబర్ 3,6, 9 తేదీల్లో గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో ఇంటర్కాంటినెంటల్ కప్ 2024 ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ అడ్వైజర్ జారీ చేశారు.