తెలంగాణ

LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

Rudra

గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) వినియోగదారులకు షాక్ కలిగించే వార్త ఇది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

TS Elections Polling: తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్.. మునుగోడులో అత్యధికంగా 91.51 శాతం.. అత్యల్పంగా యాకుత్‌ పురా లో 39.9 శాతం పోలింగ్

Rudra

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది.

Telangana Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఇవిగో, కేసీఆర్ సర్కారుకు షాక్ తప్పదంటున్న సర్వేలు,  కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్‌ ముగియడంతో.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి.

Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement

Telangana Exit Polls 2023: తెలంగాణలో 67 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి, 22 నుంచి 30 సీట్లతో సరిపెట్టుకోనున్న బీఆర్ఎస్, చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

Telangana Exit Polls 2023: తెలంగాణలో హ్యట్రిక్ కొట్టబోతున్న సీఎం కేసీఆర్, రెండవ స్థానంతో సరిపెట్టుకోనున్న కాంగ్రెస్ పార్టీ, పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది

Telangana Exit Polls 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి, మొత్తం 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపిన ఆరామస్తాన్ సర్వే, టీఆర్ఎస్ 49 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

Telangana Exit Polls 2023: కేసీఆర్ 72కు పైగా సీట్లతో మళ్లీ మూడవసారి అధికారంలోకి, కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయంతో రెండవ స్థానం, Center For Political Studies Survey ఇదిగో..

Hazarath Reddy

తాజాగా Center For Political Studies Survey విడుదల అయింది. తెలంగాణలో 72 సీట్లతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలోకి వస్తుందని సర్వే తెలిపింది.

Advertisement

Telangana Assembly Election 2023: తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌, మిగతా 106 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్

Hazarath Reddy

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో (13 constitutions) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (TS Assembly Elections ) ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్‌ ముగిసింది. చెన్నూర్‌, బెల్లంపల్లి, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

Telangana Assembly Election 2023: ఓటు వేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాద్ ఓటర్లు, దారుణంగా పడిపోయిన ఓటింగ్ శాతం, రాష్ట్ర వ్యాప్తంగా మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదు

Hazarath Reddy

మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69. 33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుండగా..హైదరాబాద్ నగరంలో మాత్రం తక్కువ పోలింగ్ నమోదవుతోంది.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు

Advertisement

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు,అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నా. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌ నమోదు, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు

Advertisement

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, బంజారాహిల్స్‌ నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్‌ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, భార్యా కొడుకుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హరీశ్‌రావు

Hazarath Reddy

మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్‌ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Telangana Assembly Election 2023: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ మధ్య, నవంబర్ 30, గురువారం నాడు రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ మరియు BRS కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారు

Tension prevailed at Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత, రెండు రాష్ట్రాల పోలీసులు ఫైటింగ్, గొడవపై రాజకీయ నేతలు ఎవరు మాట్లాడవద్దంటూ ఈసీ ఆదేశాలు

Hazarath Reddy

గత అర్ధరాత్రి దాటిన తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్‌ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు.

Advertisement
Advertisement