తెలంగాణ

Telangana Road Accident: రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

Hazarath Reddy

రెండేళ్ల తరువాత విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన దంపతులను మృత్యువు కాటేసింది. సూర్యాపేట రహదారిపై రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది.

Hyderabad Horror: భాగ్యనగరంలో విషాదం, వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Weather Forecast: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక, నేడు రేపు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని సూచన, భానుడు చండ్ర నిప్పులు చెరుగుతాడని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది

TRS Plenary Meeting 2022: మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్, పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, క‌శ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిపాటు, దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలని సూచన

Hazarath Reddy

రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్‌ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో (TRS Plenary Meeting 2022) ఆయన ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్‌ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు.

Advertisement

TRS Plenary Meeting 2022: ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, బిజెపిది వైఫల్యాల చరిత్ర, టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు.

TRS Plenary Meeting 2022: తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ, ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట ఇది, టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్రసంగం హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు (TRS 21st Formation Day Celebrations) పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

TRS Celebrates 21 Years: జాతీయే రాజకీయాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, 22వ వడిలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి (ఏప్రిల్‌ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు (TRS Celebrates 21 Years) పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) ( Hyderabad International Convention Centre (HICC) నిర్వహిస్తోంది.

Group-I Notification in Telangana: ఎనిమిదేళ్ల తర్వాత గ్రూప్-1, నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మొత్తం 503 ఖాళీలు భర్తీ, ఏయే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారంటే?

Naresh. VNS

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్‌-1 పోస్టులకు (Group-I posts) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Telangana State Public Service Commission) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌ (preliminary test ), మెయిన్స్‌ (Mains) ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

Advertisement

CM KCR at Bhoomi Puja: మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు, ఆల్వాల్ సభలో మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజలు

Hazarath Reddy

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు (CM KCR Participate In Tims) ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ‌లు (Alwal Bhoomi Puja) చేశారు.

Telangana Horror: తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించిన కొడుకు, బాధలు తట్టుకోలేక అతడి గొంతు కోసి చంపేసిన తల్లిదండ్రులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన కుమారుడి చేతిలో రోజూ పడుతున్న బాధలు తట్టుకోలేక తెలంగాణలో ఓ దంపతులు అతడిని గొంతుకోసి హత్య (Couple Kills Son Addicted To Liquor) చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna-Sircilla) సోమవారం చోటుచేసుకుంది.

Telangana: సొంత ఊరికి బస్సును తెప్పించిన గంగవ్వ, ఆమె మాటతో లంబాడిపల్లికి బస్సును ఏర్పాటు చేసిన ఆర్టీసీ, మొన్న పార్వతి.. నేడు గంగవ్వ అంటూ న్యూస్ వైరల్

Hazarath Reddy

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

TS Police Recruitment 2022: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభవార్త, రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Hazarath Reddy

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా శుభవార్త‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌న్నింటినీ భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీ సాక్షిగా కీలక ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ (Telangana) ఆర్థిక శాఖ వ‌రుస‌గా అనుమ‌తులు మంజూరు చేస్తూ వ‌స్తోంది.

Advertisement

Telangana: బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా శ్రీరామచంద్రారెడ్డి, ఏకగ్రీవ నియామకం

Hazarath Reddy

హైదరాబాద్‌లో శనివారం జరిగిన వార్షిక జనరల్ బాడీ సమావేశంలో బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా శ్రీరామచంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

Telangana Shocker: హన్మకొండలో మరో పుష్ప, భర్త నిద్రిస్తుండగా బ్లేడుతో గొంతు కోసిన భార్య, వరంగల్‌లో పెళ్లైన నెలకే దారుణ ఘటన

Hazarath Reddy

ఇటీవల భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ‘పుష్ఫ’ ఘటన మరవకముందే తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులైనా కాకముందే దారుణం జరిగింది.

PK Meets KCR: కాంగ్రెస్‌లో చేరుతా కానీ, మీకోసం పనిచేస్తా! కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ ఆఫర్, రెండు రోజుల పాటూ సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చలు

Naresh. VNS

సీఎం కేసీఆర్ తో ఆయన ఆదివారం లంచ్ చేశారు. వీరిద్దరి భేటీలో అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఆరా తీసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై ఆయనతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని (BJP) గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది.

Weather Forecast: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో నమోదైన టెంపరేచర్లు కాస్త తగ్గాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో వాతావరణం కూల్ అయ్యింది. అయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు (Rains in the Telangana State) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( Hyd Weather Department) తెలిపింది.

Advertisement

Warangal Shocker: వరంగల్ జిల్లాలో దారుణం, చున్నీతో యువతి చేతులు కట్టేసి గొంతు కోసి పరారైన యువకుడు, ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని హనుమకొండ గాంధీనగర్‌లో ప్రేమోన్మాది.. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది.

Rains in Hyd: హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో వర్షం, పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం, అయినా దంచి కొడుతున్న ఎండలు, బయటకు రావొద్దని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కుల ఆదేశాలు

Hazarath Reddy

భాగ్యనగరంలో పలుప్రాంతాల్లో అనుకోకుండా భారీ వర్షం పడింది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం (Rainfall in Several parts) కురిసింది. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మినగర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది

Covid in TS: తెలంగాణలో ఫోర్త్‌ వేవ్‌ అలర్ట్, మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. వెయ్యి జ‌రిమానా, ప్రతీ ఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలని తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Hazarath Reddy

తెలంగాణలో కరోనావైరస్ అదుపులోనే ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు (Telangana DH Srinivasa Rao) స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు.

Telangana: తెలంగాణలో కౌన్సిలర్ దారుణ హత్య, బైక్‌పై వెళ్తుండగా గొడ్డలితో దాడి చేసిన దుండుగులు, బానోతు ర‌వి హ‌త్య‌కు వ్యాపార లావాదేవీలే కార‌ణం తేల్చిన పోలీసులు

Hazarath Reddy

మహబూబాబాద్‌ జిల్లా పత్తిపాకలో పట్టపగలే దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ 8 వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవిని దుండగులు దారుణంగా (Councillor Banoth Ravi Naik hacked to death) హతమార్చారు. రవి బైక్‌పై వెళ్తుండగా కాపుగాసిన దుండగులు అతనిపై గొడ్డలితో దాడిచేశారు.

Advertisement
Advertisement