తెలంగాణ

Bhadrachalam: భద్రాచలం రాములోరి దర్శనం ఇకపై చాలా ఖరీదు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఈవో శివాజీ

Hazarath Reddy

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్‌ ధరలను (vSri Rama Navami celebrations Tickets Price Hike ) పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 374 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,579 శాంపిల్స్ పరీక్షించగా, 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.

COVID in TS: తెలంగాణ తగ్గుముఖం పట్టిన కరోనా, గత 24 గంటల్లో 385 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,386 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

CM KCR Speech at Narayankhed: దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నా, పోరాటానికి బయల్దేరా, బంగారు భారతదేశాన్ని తయారుచేద్దాం, నారాయణఖేడ్‌‌ బహిరంగసభలో కేసీఆర్

Krishna

నారాయణఖేడ్‌‌లో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు.

Advertisement

MP Sanjay Raut on CM KCR: సీఎం కేసీఆర్ అందర్నీ కలుపుకుపోతారు, ముందుకు నడిపించే సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు.

CM KCR Meets Sharad Pawar: సరికొత్త ఎజెండాతో ముందుకు వస్తాం: కేసీఆర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తో సుధీర్ఘంగా చర్చ, కేసీఆర్‌ తో కలిసి పనిచేస్తానన్న పవార్, త్వరలోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం

Naresh. VNS

దేశం దశ, దిశను మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నాన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తో సమావేశమైన ఆయన...పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో పాలన సరైన రీతిలో జరగడం లేదని, కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్.

CM KCR Mumbai Tour Highlights: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన విజయవంతం, జాతీయ స్థాయిలో అందర్నీ ఏకం చేస్తామని ప్రకటన, దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చల కోసం ప్రముఖులతో భేటీ

Hazarath Reddy

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ముంబై ప‌ర్య‌ట‌న (CM KCR Mumbai Tour Highlights) విజ‌య‌వంతంగా ముగిసింది. ముంబై ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు నిర్వహించగా, 256 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

KCR Meets Uddhav: ఇది ఆరంభం మాత్రమే! త్వరలోనే అన్ని పార్టీల నేతల మీటింగ్, ఉద్దవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ప్రతీకార రాజకీయాలు మంచివి కావన్న ఇరువురు సీఎంలు

Naresh. VNS

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ( Regional parties) ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్‌... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో (Uddhav Thackeray) చర్చించారు.

Telangana CM KCR meets Maharashtra CM Uddhav Thackeray: ముంబై చేరుకున్న కేసీఆర్, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ తో సీఎం కేసీఆర్ భేటీ

Krishna

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఆదివారం నాడు ముంబైలో భేటీ అయ్యారు. హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నండి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముంబైలో ఘన స్వాగతం లభించింది.

Sangareddy MLA Jagga Reddy Resignation: పదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి  

Krishna

పదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

KCR To Meet Uddhav: జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్! మహారాష్ట్రతోనే తొలి అడుగు, ఆదివారం ఉద్దవ్‌ తో కేసీఆర్ కీలక భేటీ, కేంద్రంపై యుద్ధానికి స్కెచ్ వేయనున్న కేసీఆర్

Naresh. VNS

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR)...ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఒక్కొక్కరిని కలువనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో (Uddhav Thackeray) సమావేశం కానున్నారు.

Advertisement

Medaram Jatara: ముగిసిన మేడారం మహా జాతర, వన ప్రవేశం చేసిన సమ్మక్క- సారలమ్మ, దాదాపు 1.30 కోట్ల మంది దర్శించుకున్నారని అంచనా, తిరుగు పయనమైన భక్తజనం

Naresh. VNS

మేడారం మహా జాతర (Medaram) ముగిసింది. నాలుగు రోజుల పాటూ అంగరంగ వైభవంగా సాగిన జాతర....చివరి రోజు దేవతల వనప్రవేశంతో సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క(Sammakka), సారలమ్మ(Sarakka), పగిడిద్దరాజు(Pagididda raju), గోవిందరాజులు (Govindarajulu) వన ప్రవేశం చేశారు.

MLA Jaggareddy: అన్నా నీవు రాజీనామా చేయకు, జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన వీహెచ్ హనుమంతరావు

Hazarath Reddy

పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి... నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్... వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.

Jagga Reddy: అవసరమైతే కొత్త పార్టీ పెడతా: జగ్గారెడ్డి, వాళ్లు చెప్పారని మూడు రోజులు టైం ఇస్తున్నా, నన్ను ఎవరూ కలవొద్దు, కావాలనే పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారంటూ ఆవేదన

Naresh. VNS

కాంగ్రెస్ పార్టీకి మరో మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jagga Reddy). కాంగ్రెస్ ( Congress) ను వీడాలని లేకపోయినప్పటకీ...తాజా పరిస్థితులు తనను అటువైపుగా ఆలోచించే విధంగా చేస్తున్నాయన్నారు.

Road Accident: మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం, ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురి మృతి

Krishna

మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కొంతమంది కారులో మేడారం జాతరకు వెళ్లారు.

Advertisement

MLA Jagga Reddy Resigns Congress: నేడు కాంగ్రెస్ లో బాంబు పేల్చనున్న జగ్గారెడ్డి, నేడు పార్టీకి రాజీనామా చేసే చాన్స్, పటాన్ చెరులో ముఖ్యకార్యకర్తలతో సమావేశం, ఏ పార్టీలో చేరనని ప్రకటన...

Krishna

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన తన అనుచరులతో సమావేశమై పార్టీకి గుడ్ చై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి మాత్రమే.... ఈరోజు జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారని చెబుతున్నారు.

Medaram Jatara Ends Today: నేటితో ముగియనున్న మేడారం జాతర, అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనున్న సంబరం, కోటి మంది భక్తులు హాజరు..

Krishna

Corona in TS: తెలంగాణలో కొత్తగా 425 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 130 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,042 కరోనా పరీక్షలు నిర్వహించగా, 425 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28, నల్గొండ జిల్లాలో 23, ఖమ్మం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

Chittoor Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, అదిలాబాద్, నాగర్‌ కర్నూల్‌ జిల్లా రోడ్డు ప్రమాదాల్లో మరో నలుగురు మృతి

Hazarath Reddy

ఏపీలో చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement
Advertisement