తెలంగాణ

By Elections: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్, ఉత్కంఠరేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

Naresh. VNS

తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Revanth Reddy: ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని చూస్తున్నారు: రేవంత్‌రెడ్డి, జలవివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని ఆరోపణ

Naresh. VNS

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు.

Telangana: ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేసిన కిరాతక కొడుకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన, పరారీలో నిందితుడు

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో తండ్రిని బండరాయితో తనయుడు కొట్టి చంపిన (Son kills father) ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం పద్మానగర్ చోటుచేసుకుంది.

Telangana Shocker: కొడుకు కాదు కసాయి, ఆస్తి తన పేర రాయలేదని తల్లిని దారుణంగా చంపిన తనయుడు, విద్యుత్ షాక్‌తో చనిపోయిందంటూ నమ్మించేయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆస్తి ముందు ఏ బంధం కూడా బ‌ల‌మైంది కాదని నేటి సమాజంలో చాలామంది నిరూపిస్తున్నారు. త‌ల్లి (Mother) పేరున ఉన్న నాలుగు ఎకరాల భూమితన పేరున రాయలేదని త‌ల్లిని అతిదారుణంగా హ‌త్య(Murder) చేసిన ఘ‌ట‌న నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వెలుగు చూసింది.

Advertisement

By-Elections 2021: రేపే తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు

Hazarath Reddy

Ganja Smuggling Cases in TS: తెలంగాణలో కలకలం రేపుతున్న గంజాయి దందా, హైదరాబాద్ సిటీలో 26 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన సీపీ అంజనీకుమార్, జిలాల్లో భారీగా పట్టుబడుతున్న గంజాయి

Hazarath Reddy

నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు (Ganja Smuggling Cases in TS) నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు.

HYD CP Anjani Kumar: మొత్తం సోదా చేయడం మా విధుల్లో భాగం, వాహనాదరుల వాట్సాప్ చెకింగ్ చేయడంపై హైదరాబాద్ సీపీ క్లారిటి, మనమంతా వాట్సాప్‌ యూనివర్సిటీలో విద్యార్థులమయ్యామని వ్యంగ్యం విసిరిన అంజనీ కుమార్

Hazarath Reddy

తెలంగాణలో ఓవాహనదారుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్‌లోని వాట్సాప్‌ను కూడా పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్‌గా మారిన సంగతి విదితమే. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో కామెంట్లు వచ్చాయి. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ (HYD CP Anjani Kumar) గురువారం స్పందించారు.

Anthrax Disease: కొత్తగా ఆంత్రాక్స్ కలకలం, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆంత్రాక్స్ ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటుంది, Anthraxపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.

Advertisement

Corona in TS: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్, కొత్తగా 171 మందికి కోవిడ్ పాజిటివ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్ గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది. గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.

Telangana: ఘోర విషాదాలు, ముగ్గురు యువతుల ఆత్మహత్య, ధర్మపురం చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరో మృతదేహం కోసం గాలింపు, కర్నూలులో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

Hazarath Reddy

ధర్మపురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు ( two young women dead bodies) లభించాయి. ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు బుధవారం నుంచి కనిపించడం లేదు. వారికోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.

Hyderabad Police: బీ అలర్ట్.. ప్రయాణికుల వాట్సాప్ చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు, అందులో గంజాయి ఛాటింగ్ ఉందని తేలితే వెంటనే అరెస్ట్

Hazarath Reddy

హనాల నుంచి వచ్చే ప్రయాణికులు మొబైల్స్ (Randomly Checking People's Mobile Phone) చెక్ చేస్తున్నారు. అందులో గంజాయికి సంబంధించి ఏమైనా ఛాట్ చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారా..కాగా తెలంగాణన గంజాయి లేని రాష్ట్రంగా తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.

Telangana: మిస్ తెలంగాణ 2018 యువతి ఆత్మహత్యాయత్నం, చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో, యువతిని రక్షించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు (hasini attempt suicide) యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. హిమాయత్‌నగర్‌లో ఓ యువతి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది.

Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, తప్ప తాగి అర్థరాత్రి యువతి గదిలోకి దూరి..ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించిన యువకుడు, యువకుడిని పట్టుకుని చితకబాదిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ యువకుడు అర్థరాత్రి యువతి ఇంట్లోకి దూరి కత్తితో (Hyderabad man stabs woman) యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని (Hyderabad Shocker) పట్టుకుని చితకబాదారు.

Telangana High Court: ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం, దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు, ఈ నెల 30 హుజూరాబాద్ ఉప ఎన్నిక

Hazarath Reddy

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించింది. దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ (Election Commission)ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు నిర్వహించగా, 186 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, తాజాగా 190 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి కోవిడ్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Krishna Water Dispute: సాగర్ ఎడమకాలువను ఏపీ ఇష్టారాజ్యంగా పెంచుకుంటూపోతోంది, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రెండు లేఖలు రాసిన తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్

Hazarath Reddy

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ (Telangana ENC Chief) రెండు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలను తుంగలో తొక్కి నాగార్జున సాగర్ ఎడమకాలువను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయారని లేఖలో ఆరోపించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 179 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు, ఇంకా 4,023 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు.

Road Accident in HYD: కీసర దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి, చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీస‌ర మండ‌లం యాదగిరిపల్లి వ‌ద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ( Hyderabad’s Outer Ring Road) సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in HYD) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

Advertisement
Advertisement