తెలంగాణ
Corona in TS: తెలంగాణలో కొత్తగా 647 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కొత్త కేసులు వెలుగులోకి, ఇద్దరు మృతితో 3,780కి పెరిగిన మరణాల సంఖ్య, ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,213 శాంపిల్స్ పరీక్షించగా, 647 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 76, ఖమ్మం జిల్లాలో 58 కేసులు గుర్తించారు.
CM KCR Congratulated To Mirabai: మీరాబాయ్ చానుకి సీఎం కేసీఆర్ అభినందనలు, ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని ఆకాంక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు.
Telangana: మద్యానికి డబ్బులు ఇవ్వకుంటే చచ్చిపోతానని కొడుకు బెదిరింపు, ఇవ్వనని చెప్పిన తల్లి, మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్న కుమారుడు, తెలంగాణలో ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవపడిన ఓ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య (Telangana Young man Suicide) చేసుకున్నాడు.
Nizamabad Shocker: భార్యపై అనుమానం..గొడ్డలితో తల్లీ కూతుళ్లను నరికి హత్య చేసిన కసాయి భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో దారుణ ఘటన
Hazarath Reddyనిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూర్‌లో దారుణ హత్యలు (Double Murder) చోటు చేసుకున్నాయి. ఓ కసాయి భర్త (Nizamabad Shocker) తనభార్యపై అనుమానం పెంచుకుని ఆమెను, ఆమెకు మద్ధతు ఇస్తుందని కూతురిని హత్య (man kils wife and Daughter) చేసాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 643 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు నమోదు, నలుగురు మృతితో 3,778కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Telangana Floods: జల దిగ్బంధంలో చిక్కుకున్న తెలంగాణ, నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఅల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (Telangana Floods) కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. శని, ఆదివారాలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం (IMD warns heavy rainfall) ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Motkupalli Narsimhulu: బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు, పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు, త్వరలో టీఆర్ఎస్‌లో చేరే అవకాశం?
Vikas Mandaమోత్కుపల్లి నర్సింహులు మాటలను బట్టి ఆయన త్వరలోనే తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈటల రాజేంధర్ టీఆర్ఎస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన సీఎం కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు..
CM Review On Rains: తెలంగాణలో కుంభవృష్టి, భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
Team Latestlyనిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా ...
Telangana Rains: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచన, నిర్మల్ జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని అధికారులకు ఆదేశాలు
Team Latestlyఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా ఇండ్లల్లో ఉండడమే క్షేమమని సీఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు....
Heavy Rains Alert: తెలంగాణను కమ్మేసిన ముసురు, రాబోయే రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ
Team Latestlyఈరోజు నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మరియు భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలలో భారీ నుంచి భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ బులెటిన్ అంచనా వేసింది, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది....
Kaushik Reddy Joins TRS: టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి, తెలంగాణ పునర్మిర్మాణం ట్రాక్ ఎక్కిందన్న సీఎం కేసీఆర్, దళితబంధు ఎన్నికల కోసం కాదని స్పష్టత, ఎవరి విమర్శలకు బెదరబోమని వ్యాఖ్యలు
Team Latestlyకాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పేదరికం ఉంది. పేదరికం, సామాజిక వివక్ష ఇంకా దళితవాడల్లో ఉంది. దళితబంధు అంటే పుట్నాలు, పేలాలు పంచినట్టు కాదు. దళితులకు రూ.10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల కోసం కాదన్నారు...
COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 565 మంది రికవరీ; గుర్తింపు కార్డు లేకపోయినా టీకా వేసుకోవచ్చన్న కేంద్రం
Team Latestlyత‌గిన‌ ఫోటో గుర్తింపు కార్డులు లేనివారు టీకా పొందటానికి కేంద్రం పలు మార్గాలను సూచించింది. ఇందులో భాగంగా, కోవిడ్‌-19 టీకా కేంద్రానికి (సీవీసీ) నేరుగా వెళ్లి తమ పేరు, చిరునామా తదితర వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవ‌చ్చు లేదా మొబైల్....
Telangana: మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయండి, కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు, హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ ఫిర్యాదు చేసిన న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి
Hazarath Reddyమాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి (karimnagar munciff megistrate ) ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌పై (Former IPS RS praveen kumar) ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Bike Accident on Balanagar Flyover: బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం, బైక్‌పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకున్న యువకుడు, అక్కడికక్కడే మృతి చెందిన ప్రకాశం జిల్లా యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై (Bike Accident on Balanagar Flyover) విషాదం చోటు చేసుకుంది.ఫ్లైఓవర్‌ మీద బైక్‌పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి (Young Man Died in Road Accident) చెందాడు.
CM KCR's Bakrid Greetings: ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, బక్రీద్ త్యాగానికి ప్రతీక, ప్రవక్త బోధించినట్లు శాంతి సందేశాన్ని అనుసరించాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ సిఎం కెసిఆర్ బక్రిద్ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త బోధించినట్లు శాంతి సందేశాన్ని అనుసరించాలని, ఇతరులపై దయ, కరుణ, త్యాగం, సహనం చూపాలని ఆయన అన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 657 మందికి కోవిడ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కేసులు నమోదు, 704 మంది కోలుకోని క్షేమంగా ఇంటికి, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,38,030 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు నిర్వహించగా, 657 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74, ఖమ్మం జిల్లాలో 58 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ పేట్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు గుర్తించారు.
Singareni Workers Retirement Age: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు, కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయం, అమలు తేదీని నిర్ణయించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు
Hazarath Reddyసింగరేణి కార్మికులకు (Singareni workers) తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును (Singareni Workers Retirement Age) 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Telangana: భూములు విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, పెంచిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి, తాజా ఉత్తర్వులతో ఏమేం పెరగనున్నాయో ఓ సారి చూద్దామా..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెంచుతూ (Land market value, stamp duty rates revised in Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భూముల విలువ (Land market value) మరింత పెరగనుంది.
CM KCR Review: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ, రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు తెలిపిన సీఎం కేసీఆర్, బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తెలిపారు. రెండో విడ‌త గొర్రెల పంపిణీపై సీఎం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీష్ రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, అధికారుల‌తో మంగళవారం స‌మీక్ష నిర్వ‌హించారు.
Kokapet & Khanamet Lands Row: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అవినీతి ఆరోపణలు, స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై (Kokapet & Khanamet Lands Auction) భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది.