తెలంగాణ

Aid for Private Teachers: ప్రైవేట్ స్కూల్ సిబ్బందికి ఏప్రిల్ నెలాఖరులోగా అందనున్న రూ. 2 వేలు, నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ, రేషన్ షాపుల ద్వారా 25 కేజీల సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Team Latestly

విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈ నెల 10వ తేది నుండి 15వ తేది మధ్యన సంబంధిత జిల్లాలకు అందజేయనుందని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుండి 19వ తేది లోపల వివరాల పరిశీలన, ఏప్రిల్ 20 నుండి 24 తేదీల మధ్య వారి బ్యాంక్ అకౌంట్లలో ఆర్ధిక సహాయం జమ కానుందని మంత్రి వెల్లడించారు...

COVID in TS: తెలంగాణలో విస్తరిస్తున్న సెకండ్ వేవ్ కరోనా, కొత్తగా 2478 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 15,472కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,01,986 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,478మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 3,907 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు....

COVID Review: అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, అర్హులైన వారు టీకా వేసుకోవాలని సూచన, మాస్కులు ధరించని వారిపై చర్యలకు ఆదేశం

Team Latestly

కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టిపిసిఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

Relief for Private Teachers: ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేల ఆపత్కాల భృతి, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ నిర్ణయం

Team Latestly

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...

Advertisement

Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలు, థియేటర్లపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై పరిమితి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల చర్యలు పెంచాలని ఆదేశం

Team Latestly

మద్యం షాపులు కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా తయారవుతున్నాయని తెలంగాణ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్19 కేసులను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు, పబ్బులు, మద్యం విక్రయించే క్లబ్ లు మరియు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది....

Treasure Pot: తెలంగాణలోని జనగామ జిల్లాలో బయటపడ్డ లంకె బిందె, సుమారు 5కేజీల బంగారు, వెండి అభరణాలు లభ్యం, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది

Team Latestly

జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి, ఒక వెంచర్ అభివృద్ధి చేయడం కోసం నెలరోజుల క్రితం 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే గురువారం ప్రొక్లైయినర్ తో భూమిని చదును చేస్తుండగా భూమిలోపల నుంచి ఒక రాయిలా ఉన్న కుండ బయటపడింది. తీరా అందులో ఏముందని చూస్తే కళ్లు విస్తుపోయేలా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి...

COVID in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం, 2 వేలు దాటిన రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య, కోవిడ్ కట్టడి చర్యల కోసం కేంద్ర సహాయం కోరనున్న టీఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని మరోసారి స్పష్టీకరణ

Team Latestly

మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్రం పొడవైన సరిహద్దును కలిగి ఉండటం అలాగే, కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌కు వివిధ ప్రదేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం మూలానా కేసులు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.....

Major Jolt to TDP: తెలంగాణలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ, తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం, టీఎస్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ

Team Latestly

తెలుగు దేశం పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తాజా తీర్పుతో బోక్కబోర్లా పడ్డ టీడీపీకి, ఇటు తెలంగాణలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తెలుగు దేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.....

Advertisement

HYD Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికీలల్లో చిక్కుకున్న టైర్ల గోడౌన్, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు

Hazarath Reddy

హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అఫ్జల్ గంజ్ లోని బడేమియా పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ఓ టైర్ల గోడౌన్ అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Afzal Gunj Fire Accident: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం (Afzal Gunj Fire Accident) చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

MEIC in Hyderabad: అమెరికా తర్వాత..హైదరాబాద్‌లో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం, వేల మందికి ఉపాధి అవకాశాలు, 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడ్ ట్రానిక్, కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గల నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ (Telangana Industries Minister KT Rama Rao) బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య ప‌రిక‌రాల త‌యారీ సంస్థ మెడ్ ట్రానిక్ (Medtronic Engineering & Innovation Cente) రూ. 1200 కోట్ల‌తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Telangana Shocker: తండ్రి లేడు..చెల్లెలిపై అదేపనిగా అత్యాచారానికి పాల్పడిన అన్నలు, నిందితులకు సహకరించిన తల్లి,పెద్దమ్మ, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి

Hazarath Reddy

సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది, వావి వరసలు మరచి కామాంధులు (Bhadradri Kothagudem Shocker) అత్యాచారానికి ఒడిగుడుతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అన్నలే తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే చెల్లెలిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

Advertisement

TS's COVID Report: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా 1914 కేసులు నమోదు, 11 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో వైరస్ వ్యాప్తి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఇటీవలే ఏప్రిల్ 2న కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నిత్యం వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని నడిపించే సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం కొంత అస్వస్థత అనిపించడంతో కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది...

#KaleshwaramProject: గజ్వేల్‌ కాల్వలోకి కాళేశ్వరం జలాలను విడుదల చేసిన కేసీఆర్, 20 చెరువులను నింపనున్న కాళేశ్వరం జలాలు, మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం

Hazarath Reddy

కాళేశ్వరం జలాలను గజ్వేల్‌ కాల్వలోకి సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతూరు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం తదితర 20 చెరువులను నింపుతాయి.

Manjeera- Kaleshwaram Merge: కాళేశ్వరంలో ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక ఘట్టం.. మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం; గజ్వేల్ కాలువలోకి కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్

Team Latestly

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత‌మైంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాలువలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. ఎండకాలంలోనూ సాగు కోసం నీరు అందేలా.....

TS Judges Covid 19: తెలంగాణ కోర్టుల్లో పలువురు జడ్జీలకు కరోనా, రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌‌తో వేగంగా పెరుగుతున్న కేసులు, కోర్టుల్లో భౌతిక విచారణ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు.

Advertisement

COVID19 Second Wave: గతేడాది కంటే తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కరోనా, తెలంగాణలో కొత్తగా 1498 కేసులు నమోదు , రాష్ట్రంలో 10 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 313 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 164 కేసులు, రంగారెడ్డి నుంచి 128, నిజామాబాద్ నుంచి 142 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ....

Hyderabad Shocker: నా భర్త వేధింపులు తట్టుకోలేకున్నా, పోలీసులను ఆశ్రయించిన హిజ్రా, అమ్మాయి మోజులో పడి నన్ను వదిలేసాడని, డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపణ

Hazarath Reddy

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, తనను మోసం చేశాడని ఓ హిజ్రా పోలీసులకు ఫిర్యాదు (Hijra complaint against her husband) చేసింది.

TS Coronavirus Update: తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా, తాజాగా ఆరుమంది మృతితో 1,723కు చేరుకున్న మరణాల సంఖ్య, కొత్త‌గా 1,097 కరోనా కేసులు నమోదు, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వైద్యుల హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి (TS Coronavirus) చేరింది.

TS Coronavirus: తెలంగాణలో కొత్త‌గా 1,097 కరోనా కేసులు నమోదు, ఆరుమంది మృతితో 1,723కు చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది.

Advertisement
Advertisement