Technology

Reliance-GIC,TPG Deal: రిలయన్స్‌లోకి తాజాగా రూ.7,350 కోట్లు పెట్టుబడులు, రిలయన్స్ రిటైల్ విభాగంలో ఈ మొత్తాన్ని పెట్టనున్నట్లు తెలిపిన జీఐసీ, టీపీజీ సంస్థలు, రూ.32,197.50 కోట్లకు చేరిన రిలయన్స్ మొత్తం పెట్టుబడులు

Hazarath Reddy

జియో అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగంలో (Reliance Retail Ventures Ltd (RRVL) రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థ జీఐసీ, గ్లోబల్ ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కాపిటల్ (Reliance-GIC,TPG Deal) అంగీకరించినట్టు ఆర్ఐఎల్ ప్రకటించింది.

BrahMos Cruise Missile: దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి

Hazarath Reddy

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Cruise Missile) ఒడిశాలోని ఐటీఆర్ బాలాసోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. దీంతో డీఆర్డీవో (DRDO) ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అభినందించారు.

PUBG-Jio Deal Talks: పబ్‌జీ‌పై జియో కన్ను, 50-50 డీల్ కోసం ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించని రిలయన్స్ జియో

Hazarath Reddy

ఇండియాలో నిషేధం విధించబడిన పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జీని (PUBG) భారతీయ వినియోగదారులకు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ టెలికాం విభాగం జియో (Reliance Jio) పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు (PUBG-Jio Deal Talks) జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు (PUBG Corp, Jio in talks) కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయని అనధికార వర్గాలు వెల్లడించాయి.

Xiaomi’s Travelling Store: రోడ్డు మీదకు షియోమి, ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ పేరుతో నేరుగా గ్రామాల్లోకి షియోమి వాహనాలు, అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులోకి..

Hazarath Reddy

చైనా..భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువయిన నేపథ్యంలో షియోమి కొత్త వ్యూహానికి తెరలేపింది. చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ ‌ విక్రయాలను విస్తరించడంలో భాగంగా ఎంఐస్టోర్ ఆన్ వీల్స్(MiStore-on-wheels) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షియోమి ట్రావెలింగ్ స్టోర్‌ (Xiaomi’s Travelling Store) ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుంది.

Advertisement

'Jio Cricket Play Along': జియో నుంచి బహుమతులు గెలుచుకోండి, జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్ ద్వారా బంఫర్ ఫ్రైజ్ గెలుచుకునే అవకాశం, వివరాలు జియో యాప్‌లో చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఐపీఎల్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రేక్షకులకు జియో నెట్‌వర్క్‌ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో (Jio Users) పాటు నాన్‌ జియో యూజర్లు 'జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్' యాప్‌ (Jio Cricket Play Along)‌ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ను కూడా అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్‌ టీమ్‌కు స్టికర్‌ చాట్‌ ఏర్పాటు, స్కోర్‌లు, మ్యాచ్ షెడ్యూల్‌లు, ఫలితాలను యాక్సస్‌ చేసుకునే అవకాశాన్ని కూడా జియో కల్పిస్తోంది.

TikTok vs America: ట్రంప్‌పై అమెరికా కోర్టులో టిక్‌టాక్ ఫిర్యాదు, అమెరికా అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టును ఆశ్రయించిన చైనా యాప్, అగ్రరాజ్యంలో టిక్‌టాక్, వీ చాట్‌‌లపై నిషేధం

Hazarath Reddy

చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు (TikTok Ban) అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను నిషేధించామని యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ తెలిపింది. కాగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.

Paytm App Removed: గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తొలగింపు, గూగుల్ యొక్క గాంబ్లింగ్ పాలసీకి విరుద్ధంగా పేటీఎం యాప్ వ్యవహరిస్తుందని పేర్కొన్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం

Team Latestly

ఇప్పటికే పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు యాప్ యొక్క అన్ని సేవలను వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభించదు...

SBI ATM Cash Withdrawal Rules: రూ.10 వేలు దాటితే ఓటీపీ తప్పనిసరి, సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు, రూల్స్ ఏంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State bank of india) సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై కస్టమర్లు తమ డెబిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ (OTP) నమోదు చేయడం తప్పనిసరి. వచ్చే శుక్రవారం నుంచి ఈ మేరకు నిబంధనలు మారనున్నాయి. ఏటీఎం ద్వారా రూ.10 వేలు, అంతకు పైబడిన నగదు ఉపసంహరించుకునేందుకు ఏటీఎంలో లాగిన్‌ అయిన వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ, పిన్‌ నంబరు (debit card PIN) నమోదు చేసినప్పుడే కస్టమర్‌ చేతికి నగదు అందుతుంది. ఇవి రెండు కరెక్ట్ గా లేకుంటే డబ్బులు విత్ డ్రా కావు. కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

Advertisement

TV Price Hike: మోతెక్కనున్న టీవీ ధరలు, ప్యానెళ్ల ధరలు పెరగడమే ప్రధాన కారణమంటున్న పరిశ్రమ వర్గాలు, కరోనాతో చైనా నుంచి ఆగిపోయిన ప్యానెళ్ల దిగుమతులు

Hazarath Reddy

పండగ సీజన్ రానున్న నేపథ్యంలో టెలివిజన్‌ తయారీ సంస్థలు కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వబోతున్నాయి. అక్టోబర్ నెలలో టీవీల ధరలు అమాంతం (TVs to cost more from next month) పెరిగే అవకాశాలున్నాయి. ఒక్కో టీవీ ధర 20 నుంచి 35 శాతం పెరుగవచ్చన్న అంచనాలు (TV Price Hike) పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్యానెళ్ల ధరలు పెరగడమేనని టీవీ ఇండస్ట్రీ చెబుతోంది. గడిచిన కొద్దివారాల్లో ప్యానెల్‌ ధరలు 20 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

TikTok Picks Oracle over Microsoft: అమెరికాలో టిక్‌టాక్‌ కథకి ముగింపు? మైక్రోసాఫ్ట్‌కు బదులు ఒరాకిల్‌ పరం కానున్న టిక్‌టాక్‌, బైట్‌డ్యాన్స్‌తో చర్చలు సఫలం కాలేదని తెలిపిన మైక్రోసాఫ్ట్

Hazarath Reddy

చైనీస్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ రేసులోకి (TikTok Picks Oracle) వచ్చింది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తాజాగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్‌ (Oracle) పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది.

Low Cost Phones from Jio: జియో మరో సంచలనం, తక్కువ ధరలో 10 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లు తయరీ, అదనంగా డేటా ప్యాక్, వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుందంటూ వార్తలు..

Hazarath Reddy

ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి (Low Cost Phones form jio) సిద్ధమవుతోందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ద్వారా తక్కువ రేటుతో కూడిన 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారు (10 Crore Low-Cost Phones) చేయనుందని సమాచారం. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో డేటాప్యాక్ లను కూడా అదనంగా అందించాలని భావిస్తోంది.

WhatsApp Text Bomb: వాట్స్‌యాప్‌లోకి భయంకరమైన వైరస్, యూజర్లకి టెక్ట్స్ బాంబ్ సందేశాలు, ఓపెన్ చేస్తే ఫోన్ క్రాష్, అలర్ట్‌గా ఉండాలని సూచించిన వాబీటా ఇన్ఫో

Hazarath Reddy

ప్రపంచంలో అత్యంత పాపులర్ మెసేంజిగ్ యాప్ వాట్స్‌యాప్ హ్యాకింగ్ (WhatsApp crash) భారీన చిక్కుకుంది. దీనిపై బ్రెజిల్ హ్యాకర్లు దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. టెక్ట్స్ బాంబ్ గా పిలిచే స్కేరీ మెసేజ్‌ వైరస్ వాట్సాప్ నెట్ వర్క్ మీద దాడి (new text bomb) చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది. ఆగస్టు మధ్యలో ఈ వైరస్ మొదలైందని ఇప్పుడు ప్రపంచదేశాలకు ఇది విస్తరించిందని వాబీటా ఇన్ఫో తెలిపింది. కొద్ది రోజుల క్రితం వాట్స్‌యాప్‌ ఓఎస్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద కొత్త ఫీచర్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యూజర్లు చెప్పాలని వాబీటా ఇన్ఫో కోరింది.

Advertisement

Reliance Retail: రిల‌య‌న్స్‌లోకి వెల్లువలా పెట్టుబడులు, తాజాగా రూ.7500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు తెలిపిన సిల్వర్ లేక్, ఇప్పటికే జియోలో 1.35 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబడి పెట్టిన అమెరికా దిగ్గజం

Hazarath Reddy

అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ సంస్థ రిల‌య‌న్స్ రిటేల్ వెంచ‌ర్స్‌లో రూ.7500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఇవా‌ళ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సంస్థ పేర్కొన్న‌ది. ఆ పెట్టుబ‌డితో ఆర్ఆర్‌వీఎల్‌లో సిల్వ‌ర్ లేక్ సుమారు 1.75 శాతం వాటాను సొంతం (Reliance Retail Ventures Sells 1.75% Stake to Silver Lake) చేసుకుంది. రిల‌య‌న్స్ సంస్థ‌లో సిల్వ‌ర్ లేక్ .. బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం ఇది రెండ‌వ సారి.

PUBG Ban: టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలను తెంచుకున్న పబ్‌జీ కార్పొరేషన్, భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ (PUBG Ban) మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంతో పాటు దేశంలో డేటా భద్రత కోసం భారత ప్రభుత్వం చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పబ్‌జీలో బాగా పాపులర్ అయిన బ్యాటిల్ రాయల్ గేమ్ అనేది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ. అయితే పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ (Tencent Games) ప్రమోట్ చేస్తోంది. ఇక ఇండియాలో పబ్‌జీ మొబైల్ వర్షన్ రిలీజ్ చేసింది కూడా టెన్సెంట్ గేమ్స్ కంపెనీనే.

Chandrayaan-3: చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ, వ‌చ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగం, చంద్ర‌యాన్-2కి భిన్నంగా చంద్ర‌యాన్‌-3, ఆర్బిట‌ర్ లేకుండానే చందమామ మీదకు, వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Hazarath Reddy

చందమామను జల్లెడ పట్టేందుకు చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ (Chandrayaan-3) అవుతోంది. చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌న్నారు. చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ (Will Not Have Orbiter) ఉండ‌ద‌న్నారు. అయితే ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌న్నారు.

Airtel Xstream Fiber Plans: ఎయిర్‌టెల్ నుంచి భారీ ఆఫర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ప్యాకేజీలను ప్రకటించిన మెబైల్ సేవల దిగ్గజం, సెప్టెంబరు 7 నుంచి అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రముఖ టెలికం కంపెనీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను (Airtel Xstream Fiber Plans) ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్‌లు (Airtel customers broadband plans) అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్‌లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్‌లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Vodafone Idea Brands Now ’VI‘: జియోకు సవాల్, రూ. వొడాఫోన్ ఐడియాలోకి త్వరలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, వీఐ పేరిట సరికొత్త లోగోను విడుదల చేసిన మొబైల్‌ సేవల దిగ్గజం

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా వీఐ పేరుతో కొత్త వైర్‌లెస్‌ సర్వీసుల బ్రాండును (Vodafone Idea Rebrands) ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను (Vodafone Idea Now VI) సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్‌ సేవలలో (digital experience) భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్‌ ప్రకటించడం గమనార్హం!

Airtel Unlimited Data Offer: ఎయిర్‌టెల్‌ అపరిమిత డేటా ఆఫర్‌, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు డేటా పరిమితిని తొలగించనున్న కంపెనీ, జియోతో పోటీలో భాగంగా నిర్ణయం

Hazarath Reddy

ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు కంపెనీ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు (Airtel broadband Plans) అయిన బేసిక్, ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రీమియం, తదితర వాటికి ఇప్పటివరకు ఉన్న డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ (Airtel Unlimited Data Offer) ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు (JioFiber) మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PUBG Banned in India: పబ్జీ ఇండియా నుంచి అవుట్, భద్రతా కారణాలతో పబ్జీ గేమ్‌తో సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం, పబ్‌జీకి ఇండియాలో 50 మిలియన్ల మందికి పైగా యూజర్లు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ను నిషేధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం (118 Chinese Mobile Apps Banned) విధిస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ (Ministry of Electronics and Information Technology) నిర్ణయం తీసుకుంది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరో భారీ దెబ్బ కొట్టింది.

Airtel Free Data Offer: ఎయిర్‌టెల్ 2 జిబి ఉచిత డేటా, రూ.10 లేస్ కొంటే చాలు, స్నాక్,కూల్ డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకున్న భారతి ఎయిర్‌టెల్

Hazarath Reddy

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్నాక్, కూల్ డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఉచిత ఇంటర్నెట్ డేటాను (Airtel Free Data Offer) అందించేలా ఆఫర్లను ప్రకటించాలని నిర్ణయించింది. లేస్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర ప్యాక్ లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ఇంటర్నెట్ డేటాను (Airtel Lays Offer) అందించనున్నట్టు ప్రకటించింది. రూ. 10 ప్యాక్ తో 1 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా (Airtel PepsiCo Offer) ఇస్తామని చెబుతోంది.

Advertisement
Advertisement