World
Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు
Hazarath Reddyప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.
Coronavirus Crisis: భార‌త్‌ను ఆదుకుంటున్న ప్రపంచదేశాలు, రూ.2.22 కోట్లు అత్యవసర విరాళంగా ప్రకటించిన ఈఐబీ, 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపిన గవీ, 10,000 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్లను పంపిన ఐక్యరాజ్య సమితి
Hazarath Reddyరోనా సెకండ్ వేవ్ భార‌త్‌ను వణికిస్తోంది.. భార‌త్‌లో నెల‌కొన్న క‌రోనా సంక్షోభంపై (Coronavirus Crisis) యూరోపియ‌న్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) (European Investment Bank) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ స్పందించారు. ఈయూ బ్యాంక్ సొంత నిధుల నుండి 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు
Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyఅంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.
Canadian Woman Dies: ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా వాసి మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో మరణం, అధికారికంగా వెల్లడించిన కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్
Hazarath Reddyయూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ కెనడా వ్యక్తి మరణించాడు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు సంబంధించినంత వరకు కెనడాలో ఇదే తొలి మరణం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో కెనడాలోని అల్బెర్టాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.
Man Sells 2 Year Old Son: రెండో భార్యతో హనీమూన్, డబ్బుల కోసం మొదటి భార్య కొడుకుని రూ.18 లక్షలకు అమ్మిన కసాయి తండ్రి, వచ్చిన డబ్బుతో రెండో భార్యతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్న చైనా వ్యక్తి
Hazarath Reddyచైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి రెండో భార్యతో హనీమూన్ టూర్ కోసం మొదటి భార్య కొడుకుని 18 లక్షలకు (Man Sells 2 Year Old Son) అమ్మేశాడు. ఆ డబ్బులతో రెండో భార్యతో హనీమూన్‌కు (Holiday With His New Wife) వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం ఆ తండ్రి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
Bangladesh: ఘోర ప్రమాదం, పద్మా నదిలో తిరగబడిన బోటు, 26 మంది అక్కడికక్కడే దుర్మరణం, కార్గో పడవను ఢీ కొట్టిన బోటు, బంగ్లాదేశ్‌లో విషాద ఘటన
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ( Speedboat Collides With Sand Carrier) ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Mexico Metro Overpass Collapse: మెట్రో రైలు వెళుతుండగా కూలిన ఫైఓవర్‌, 20 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు, మెక్సికోలో విషాద ఘటన, వైరల్‌ మారిన సీసీ టీవీ దృశ్యాలు
Hazarath Reddyమెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫైఓవర్‌ (Mexico Metro Overpass Collapse) కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 70 మంది వరకు గాయపడ్డారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Bill Gates Divorce: 27 ఏళ్ల వివాహ బంధానికి సెలవు ప్రకటించిన బిల్గేట్స్, భార్య మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపిన దంపతులు
Hazarath Reddyప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. తమ 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి (Bill and Melinda Gates Announce To End Marriage After 27 Years) పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భార్య మిలిందా ( Melinda Gates) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా బిల్గేట్స్ ప్రకటించారు.
Sweden: భారత్‌కు 1 మిలియన్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు, అండగా ఉంటామని తెలిపిన స్వీడన్, కరోనాపై ప్రపంచవ్యాప్తంగా పోరాడటానికి చేయగలిగినది చేద్దామంటూ పిలుపు
Hazarath Reddyయు.ఎన్-బ్యాక్డ్ కోవాక్స్ ద్వారా 1 మిలియన్ మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను భారతదేశానికి దానం చేయాలని (Sweden plans to donate 1 million doses) స్వీడన్ యోచిస్తోంది. స్కాండినేవియన్ దేశ అంతర్జాతీయ అభివృద్ధి సహకార మంత్రి పర్ ఓల్సన్ ఫ్రిద్ సోమవారం స్వీడిష్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌విటిపై ఈ విషయాన్ని ప్రకటించారు,
Pfizer Donates Medicines: భారత్‌లో క‌రోనా కల్లోలం..రూ.510 కోట్ల విలువైన మందులను సాయంగా ప్రకటించిన ఫైజర్, వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి
Hazarath Reddyభార‌త్‌లో కరోనా కోరలు చాస్తున్నవేళ అమెరికా గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా మహమ్మారిపై పోరాడుతున్న భార‌త్‌కు 70 మిలియన్‌ డాల‌ర్ల (రూ.510 కోట్లకు పైన) విలువైన మందుల‌ను ఇండియాకు (Pfizer Donates Medicines) అందివ్వనుంది.
Lockdown in India: కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం, కొన్ని వారాల పాటు షట్‌డౌన్‌ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చిన డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ, ఇప్పటివరకు రాష్ట్రాలకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ
Hazarath Reddyఅంతర్జాతీయంగా క‌రోనా వైర‌స్‌పై అధ్య‌య‌నం చేస్తున్న డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ (Lockdown in India) ఒక్కటే మార్గమని తెలిపారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు దేశంలో కొన్ని వారాల పాటు ష‌ట్డౌన్‌ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు.
International Flights Suspension: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు, మరో నెలపాటు పొడగిస్తున్నట్లు తాజాగా సర్క్యులర్ జారీ చేసిన డీజీసీఎ
Team Latestlyఅయితే, అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని, అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌ మరియు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టంచేసింది....
CSK vs SRH Highlights: తిరుగులేని చెన్నై సూపర్ కింగ్స్, 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సునాయాస విజయం, పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం; నేడు ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్
Team Latestlyఇక ఆడిన 6 మ్యాచుల్లో ఈ ఓటమితో కలిపి మొత్తం 5 ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఐపిఎల్-2021 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.ఇక ముందు ఎలాంటి అద్భుతాలు జరిగినా సన్ రైజర్స్ నాకౌట్ దశలోకి వెళ్లేలా కనిపించడం లేదు....
Coronavirus Catastrophe: భారత్‌లో కరోనా విశ్వరూపానికి ఈ వైరస్సే కారణం, రెండు వైరస్‌ల కలయికతో పుట్టిన బి.1.617 వైరస్‌‌, 17 దేశాలను వణికించేందుకు రెడీ అయిన డబుల్ మ్యూటెంట్ కోవిడ్ వేరియంట్
Hazarath Reddyఇండియాలోలో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్‌ రకం (B1617 Variant) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన డబుల్ మ్యూటెంట్ కోవిడ్ వేరియంట్ ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ (WHO) పేర్కొంది.
Saudi Arabia: దేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత, 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను సాయం ప్రకటించిన సౌదీ అరేబియా, నౌకలో దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరిన ట్యాంకులు
Hazarath Reddyదేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను (Saudi Arabia to ship 80 metric tonnes of oxygen to India) పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
Iraq Covid Hospital Fire: కరోనా ఆస్పత్రిలో ఒక్కసారిగా పేలిన ఆక్సిజన్ ట్యాంక్, 82 మంది అగ్నికి ఆహుతి, 110 మందికి గాయాలు, ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం
Hazarath Reddyఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఆదివారం అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం (Iraq Covid Hospital Fire) సంభవించింది. ఇరాక్ రాజధాని నగరంలోని Ibn Khatib ఆస్పత్రాలో ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో (oxygen tank explodes) సుమారు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 110 మంది గాయపడ్డారు.
Baghdad Covid Hospital Fire: కరోనా ఆస్పత్రిలో ఆగ్ని ప్రమాదం, 24 మంది అక్కడికక్కడే మృతి, బాగ్దాద్ శివార్ల‌లోని ఇబ్న్ అల్-ఖ‌తిబ్ ఆస్పత్రిలో విషాద ఘటన
Hazarath Reddyఇరాక్‌లోని ఓ క‌రోనా ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో హాస్పిట‌ల్లో చికిత్స పొందుత‌న్న వారిలో 24 మంది మృతిచెందారు. రాజ‌ధాని బాగ్దాద్ శివార్ల‌లోని ఇబ్న్ అల్-ఖ‌తిబ్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఆదివారం తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.
Coronavirus Scare: కరోనాతో పోరాడుతున్న ఇండియాకు సంఘీభావం ప్రకటించిన పాకిస్తాన్, కోవిడ్ నుంచి భార‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Hazarath Reddyక‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాడుతోన్న భార‌త్‌కు పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ సంఘీభావం ప్ర‌క‌టించారు. క‌రోనా నుంచి భార‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ‌మంతా ఏక‌మై మ‌హ‌మ్మారిపై పోరాడాల‌ని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
Kuwait: భారత్‌ విమానాలపై నిషేధం విధించిన కువైట్‌, భారత్‌లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపిన అధికారులు
Hazarath Reddyఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు కువైట్ శనివారం తెలిపింది. నేరుగా భారత్‌ నుంచి వచ్చినా, ఇతర దేశాల మీదుగా వచ్చినా శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యాన్‌ అమలులో ఉంటుందని కువైట్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోగా.. బ్రిటన్‌ రెడ్‌లిస్ట్‌లో పెట్టింది కువైట్‌ సైతం అదేబాట పట్టింది.