World

Hindu Temples Demolition in PAK: దారుణం..పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలు ధ్వంసం, తీవ్రంగా ఖండించిన భారత్, పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన, జనవరి 5న పాక్ సుప్రీంకోర్టులో విచారణ

Hazarath Reddy

దాయాది దేశం వాయవ్య పాకిస్థాన్‌లో ఓ హిందూ దేవాలయాన్ని దుండుగులు ధ్వంసం (Hindu Temple’s Demolition in Pak) చేశారు. దీనిపై భారత ప్రభుత్వం శుక్రవారం తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలిపింది.

Covid Updates: కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనావైరస్ (Coronavirus Outbreak) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది.

India's COVID Update: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,821 పాజిటివ్ కేసులు నమోదు, 96 శాతానికి మెరుగుపడిన రికవరీ రేటు, 257,656గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

దేశంలో ప్రతిరోజు వేలల్లో కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి, అయితే రికవరీ రేటు కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతోంది. కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో దేశంలో రికవరీ రేటు 96 శాతం దాటింది.....

AstraZeneca-Oxford Vaccine: ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి యూకేలో అనుమతి, భారత్ లోనూ త్వరలోనే ఈ టీకాకు ఆమోదం లభిస్తుందని ఊహాగానాలు

Team Latestly

యూకేలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు ఆమోదం లభించడంతో భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. భారతదేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) 'కోవిషీల్డ్' పేరుతో అభివృద్ధి చేస్తుంది.....

Advertisement

COVID in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,550 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 1,02,44,853కి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య, దేశంలో మరో 14 మందికి కొత్త వేరియంట్ వైరస్ నిర్ధారణ

Team Latestly

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.99% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.56% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....

New Covid Strain in India: భారత్‌లో మొదలైన కొత్త కరోనావైరస్ కల్లోలం, ఆరుమందికి కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పాజిటివ్, హైదరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్, నెల రోజుల్లో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు

Hazarath Reddy

భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ (New Covid Strain in India) అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

United States: అమెరికాను హడలెత్తిస్తున్న నాలుగు సంక్షోభాలు, ట్వీట్ చేసిన జో బిడెన్, పదవీ బాధ్యతలు చేప‌ట్టిన వెంట‌నే సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన

Hazarath Reddy

అమెరికా ఏక‌కాలంలో నాలుగు చారిత్ర‌క సంక్షోభాలను ఎదుర్కొంటున్న‌ద‌ని ఇటీవ‌ల ఆ దేశ‌ అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అమెరికా (United States) కొవిడ్-19 విజృంభణ‌, దెబ్బ‌తిన్న ఆర్థిక‌ వ్య‌వ‌స్థ, వాతావ‌రణ మార్పు, జాతివివ‌క్ష లాంటి నాలుగు చారిత్ర‌క సంక్షోభాల‌ను (four historic crises at once) ఒకేసారి ఎదుర్కొంటున్న‌ద‌ని బైడెన్ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.అయితే ఈ కాలానుగుణ స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డంపై త‌న బృందం హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ద‌ని ఆయ‌న (Joe Biden) చెప్పారు.

New Covid Strain Symptoms: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

Hazarath Reddy

కొత్త కరోనావైరస్ ని ఎలా గుర్తించాలినే దానికి బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) కొన్ని లక్షణాలను (New Coronavirus variation symptoms) వెల్లడించింది.

Advertisement

India Coronavirus: ఓ వైపు కొత్త కరోనా స్ట్రెయిన్ అలజడి, మరోవైపు భారీగా తగ్గిన కేసులు, దేశంలో తాజాగా 18,732 మందికి కోవిడ్ పాజిటివ్, కరోనా చివరి సంక్షోభం కాదని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

ఓ వైపు కొత్త కరోనావైరస్ భయం ఇండియాను (New Covid Starain) వెంటాడుతోంది. మరోవైపు పాత కరోనా వైరస్‌ ప్రభావం (India Coronavirus) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,732 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది.

New Covid Strain: మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

Hazarath Reddy

యూకెలో కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అవుతున్న కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Covid Strain) ఇప్పటికే ఇండియాలోకి ఎంటరయింది. పలు రాష్ట్రాలకు యూకె నుంచి వచ్చిన వారి భయం పట్టుకుంది. బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి శాంపిల్స్ ఇప్పటికే ల్యాబ్ లకు పంపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పై ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ (Genomics and Integrative Biology (IGIB) Director Anurag Agrawal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Covid Update: మళ్లీ ఇంకో కొత్త వైరస్, నైజీరియాలో ఇద్దరికీ సోకిన కొత్త రకం కరోనావైరస్, ఇండియాలో తాజాగా 23,068 కరోనా కేసులు నమోదు, 336 మంది మరణంతో 1,01,46,846కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

భారతదేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు (Coronavirus Outbreak) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది. ఇందులో 2,81,919 యాక్టివ్‌ కేసులు ఉండగా, 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,47,092 మంది (Covid Deaths) మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 336 మంది మరణించగా, 24,661 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

COVID-19 New Strain: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌పై మార్గదర్శకాలు విడుదల, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

Hazarath Reddy

యూకేలో కరోనావైరస్ (కోవిడ్ -19) యొక్క కొత్త వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) నుండి వచ్చే ప్రయాణీకులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రామాణిక విధానాలను (ఎస్ఓపి) జారీ చేసింది.

Advertisement

Coronavirus 2.0: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రమాదకరమా..? కరోనావైరస్ 2.0 అసలు పేరేంటి? కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుట్టింది? కోవిడ్ 2.0 గురించి పూర్తి సమాచారం

Hazarath Reddy

బ్రిటన్ వేదికగా ఈ కరోనావైరస్ స్ట్రెయిన్ (New coronavirus strain in UK) ప్రపంచ దేశాలను వణికించేందుకు రెడీ అయింది. బ్రిటన్ పూర్తిగా ఈ కరోనావైరస్ 2.0 (Coronavirus 2.0) దెబ్బకి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలతో పాటు ఇతర దేశాలు బ్రిటన్ కు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అయితే ఈ లోపే వైరస్ యూకె నుంచి బయటకు వచ్చేసింది.

New Coronavirus Strain: లాక్‌డౌన్ 4 వచ్చేసింది, డేంజర్ జోన్ లోకి బ్రిటన్, కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, యూకేకు అంతర్జాతీయ రాకపోకలను నిషేధించిన పలు దేశాలు, ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన భారత్

Hazarath Reddy

బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ కలకలం రేపుతున్న సంగతి విదితమే. కొత్త రూపును సంతరించుకున్న కొత్త రూపు కరొనావైరస్ (New Coronavirus Strain) అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నది.

New COVID-19 Variant: కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్

Hazarath Reddy

ప్రపంచాన్ని ఇప్పటి వరకు వణికించిన కరోనావైరస్ కొత్త రూపం (New COVID-19 Variant) సంతరించుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండగానే అది మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలను ఈ కొత్త రూపు (new coronavirus variant) సంతరించుకున్న వైరస్ వణికిస్తోంది.

COVID-19 Vaccine Update: వ్యాక్సిన్ అమెరికాలో వచ్చేసింది, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అతని భార్యకు తొలి వ్యాక్సిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహూకు తొలి కోవిడ్ వ్యాక్సిన్

Hazarath Reddy

కరోనా వైరస్ అమెరికాలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు (COVID-19 Vaccine Update) అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు కూడా భారీగానే జరుగుతోంది. ఇందులో భాగంగా ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల (Pfizer COVID-19 Vaccine) వినియోగానికి అనుమతి లభించింది. దీంతో ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Coronavirus: వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవాళ్లకు గడ్డం రావచ్చు, అందరూ మొసళ్లుగా మారుతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైర్‌ బోల్సనారో, ఫైజర్‌ టీకాపై దాడిని ఎక్కు పెట్టిన బ్రెజిల్ అధ్యక్షుడు

Hazarath Reddy

అమెరికా ఆమోదం తెలిపి కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఫైజర్‌ టీకా (Pfizer/BioNTech vaccine) తయారీ కంపెనీలపై బ్రెజిల్‌ దేశాధ్య‌క్షుడు జైర్ బొల్స‌నారో (Brazilian President Bolsonaro) తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ (Covid vaccine) తీసుకుంటే మీరు మొస‌ళ్ల‌లా మారిపోవ‌చ్చు.. ఆడ‌వాళ్ల‌కు గ‌డ్డం మొలిచే అవ‌కాశాలూ ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి క‌రోనా వైర‌స్ అంటే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రికొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Coronavirus India: షాక్..కరోనా వ్యాక్సిన్ తీసుకోగానే మూర్చపోయిన నర్సు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, దేశంలో తాజాగా 26,624 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 592 కేసులు

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించిన విషయం విదితమే. క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

‘Covid-19 is World War’: కరోనాపై ప్రపంచ యుద్ధం జరుగుతోంది, లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే 10 రోజుల ముందు చెప్పండి, కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి కరోనా ప్రవేశించింది. ఇంకొన్ని దేశాల్లో ఏకంగా మూడవ దశలోకి వెళ్లింది. మన ఇండియా విషయానికి వస్తే సెకండ్ వేవ్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాపై ప్రపం‍చ యుద్ధం (Covid-19 is world war) జరుగుతుందని, దీని వల్ల ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.

Coronavirus in India: షాకింగ్ న్యూస్..రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించవచ్చు, జాగ్రత్తగా ఉండాలని సూచించిన బిల్ గేట్స్, దేశంలో తాజాగా 24,010 మందికి కరోనా

Hazarath Reddy

కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave)నేపధ్యంలో రాబోయే ఐదారు నెలలు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) హెచ్చరించారు. అమెరికా సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో భారీగా పెరగడంతో పాటు, మరణాలు కూడా ఎక్కువవుతోన్న నేపధ్యంలో బిల్‌గేట్స్ ఈ సూచనలు చేశారు.

Advertisement
Advertisement